Political News

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ…ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్నారు. అయితే, రఘురామపై సాక్షి మీడియా కథనాలు రాస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే సాక్షి మీడియా గ్రూపుపై చట్టపరమైన చర్యలకు రఘురామ రెడీ అయ్యారు.

తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని రఘురామ ఆరోపించారు. తన పరువు తీసేలా వరుస కథనాలు ప్రచురిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే ఇందిరా టెలివిజన్‌ ఎండీ భారతీరెడ్డి, ఎడిటర్‌, బ్యూరో చీఫ్, బోర్డ్ డైరెక్టర్లకు లీగల్ నోటీసులు పంపారు. తనకు బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, నష్ట పరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని, వాటిని అమరావతి రైతులకు ఇవ్వాలని లీగల్ నోటీసులో రఘురామ తరఫు న్యాయవాది ఉమేష్ చంద్ర పేర్కొన్నారు.

కాగా, అంతకుముందు రఘురామపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వర రాజు సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపించేందుకు రఘురామ కుట్ర పన్నారని ఆరోపించారు. తనను చంపాలని కుటుంబ సభ్యుల ఎదుటే అనుచరుడిని ఆదేశించారని ఆరోపించారు. సైకో ఎమ్మెల్యే రఘురామ నుంచి ఉండి నియోజకవర్గాన్ని కాపాడాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ లకు విజ్ఞప్తి చేశారు.

టీడీపీ నాయకులు, కార్యకర్తలను రఘురామ అసహ్యించుకుంటున్నారని, కొత్తపల్లి నాగరాజు సహకారంతో రఘురామ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రఘురామను ఎదిరించిన తనవంటి వారిపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ ప్రకారం సాక్షి మీడియాలో ఓ కథనం వెలువడింది. ఈ నేపథ్యంలోనే సాక్షి మీడియాకు రఘురామ లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.

This post was last modified on February 19, 2026 3:55 pm

Share
Show comments
Published by
Kumar
Tags: RRR

Recent Posts

ఓజీ-2 ప‌నిలో సుజీత్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక‌, ఆయ‌న చేసిన చిత్రాల్లో అభిమానుల‌ను అత్యంత అల‌రించింది ఓజీనే. సినిమా…

35 minutes ago

రాముడు రావణుడు కలవడం లేదు

ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఇటీవలే రిలీజైన…

60 minutes ago

పార్టీలోని పెద్ద పదవి ఇప్పుడు లోకేష్ సొంతం

ఏపీలో అధికార కూటమికి సారధ్యం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ…

1 hour ago

నమ్మొచ్చా… టైటిల్ కోసం 112 కోట్లు

ఇటీవలే విడుదలైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తమిళంలో ఓ మోస్తరుగా, తెలుగులో నీరసంగా రన్ అవుతోంది. ఫైనల్ గా ప్రదీప్…

2 hours ago

ఎమ్మెస్ రాజు… మళ్లీ వచ్చారూ

శత్రువు, దేవి, దేవిపుత్రుడు, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నిర్మాత..…

3 hours ago

వారణాసిని చుట్టుకున్న యుద్ధ మేఘాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీర రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న వారణాసి షూటింగ్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. అయితే…

4 hours ago