Political News

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ…ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్నారు. అయితే, రఘురామపై సాక్షి మీడియా కథనాలు రాస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే సాక్షి మీడియా గ్రూపుపై చట్టపరమైన చర్యలకు రఘురామ రెడీ అయ్యారు.

తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని రఘురామ ఆరోపించారు. తన పరువు తీసేలా వరుస కథనాలు ప్రచురిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే ఇందిరా టెలివిజన్‌ ఎండీ భారతీరెడ్డి, ఎడిటర్‌, బ్యూరో చీఫ్, బోర్డ్ డైరెక్టర్లకు లీగల్ నోటీసులు పంపారు. తనకు బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, నష్ట పరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని, వాటిని అమరావతి రైతులకు ఇవ్వాలని లీగల్ నోటీసులో రఘురామ తరఫు న్యాయవాది ఉమేష్ చంద్ర పేర్కొన్నారు.

కాగా, అంతకుముందు రఘురామపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వర రాజు సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపించేందుకు రఘురామ కుట్ర పన్నారని ఆరోపించారు. తనను చంపాలని కుటుంబ సభ్యుల ఎదుటే అనుచరుడిని ఆదేశించారని ఆరోపించారు. సైకో ఎమ్మెల్యే రఘురామ నుంచి ఉండి నియోజకవర్గాన్ని కాపాడాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ లకు విజ్ఞప్తి చేశారు.

టీడీపీ నాయకులు, కార్యకర్తలను రఘురామ అసహ్యించుకుంటున్నారని, కొత్తపల్లి నాగరాజు సహకారంతో రఘురామ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రఘురామను ఎదిరించిన తనవంటి వారిపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ ప్రకారం సాక్షి మీడియాలో ఓ కథనం వెలువడింది. ఈ నేపథ్యంలోనే సాక్షి మీడియాకు రఘురామ లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.

This post was last modified on February 19, 2026 3:55 pm

Share

Recent Posts

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

32 minutes ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

4 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

4 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

5 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

6 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

6 hours ago