తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 116 మున్సిపాలిటీలకు గాను 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపొందగా…38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది
వార్డుల వారీగా 2582 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 1347 వార్డులు దక్కించుకుంది. బీఆర్ఎస్ 717 వార్డుల్లో,
బీజేపీ 261 వార్డుల్లో, ఇతరులు 256 వార్డుల్లో విజయం సాధించారు.
ఈ నేపథ్యంలోనే ఈ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇంతటి అఖండ విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. లక్షలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమే ఈ విజయమన్నారు.
భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని చెప్పారు. రెండేళ్ల ప్రజాపాలన, అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇది ప్రజా తీర్పు అని తెలిపారు. ఈ గెలపు తమ బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ను గొప్పగా అభివృద్ధి చేస్తామన్నారు.
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…