తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 116 మున్సిపాలిటీలకు గాను 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపొందగా…38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది
వార్డుల వారీగా 2582 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 1347 వార్డులు దక్కించుకుంది. బీఆర్ఎస్ 717 వార్డుల్లో,
బీజేపీ 261 వార్డుల్లో, ఇతరులు 256 వార్డుల్లో విజయం సాధించారు.
ఈ నేపథ్యంలోనే ఈ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇంతటి అఖండ విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. లక్షలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమే ఈ విజయమన్నారు.
భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని చెప్పారు. రెండేళ్ల ప్రజాపాలన, అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇది ప్రజా తీర్పు అని తెలిపారు. ఈ గెలపు తమ బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ను గొప్పగా అభివృద్ధి చేస్తామన్నారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…