తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 116 మున్సిపాలిటీలకు గాను 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపొందగా…38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది
వార్డుల వారీగా 2582 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 1347 వార్డులు దక్కించుకుంది. బీఆర్ఎస్ 717 వార్డుల్లో,
బీజేపీ 261 వార్డుల్లో, ఇతరులు 256 వార్డుల్లో విజయం సాధించారు.
ఈ నేపథ్యంలోనే ఈ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇంతటి అఖండ విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. లక్షలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమే ఈ విజయమన్నారు.
భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని చెప్పారు. రెండేళ్ల ప్రజాపాలన, అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇది ప్రజా తీర్పు అని తెలిపారు. ఈ గెలపు తమ బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ను గొప్పగా అభివృద్ధి చేస్తామన్నారు.
This post was last modified on February 13, 2026 9:28 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…