తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ నిలిచాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలతోపాటు అనూహ్య విజయాలు నమోదయ్యాయి. తెలంగాణలో జనసేన, టీడీపీ బోణీ కొట్టాయి.
తెలంగాణలో ఒకప్పుడు బలంగా ఉన్న టీడీపీ కొంతకాలంగా బలహీనపడింది. ఈ క్రమంలోనే అక్కడ పూర్వ వైభవం కోసం పోరాడుతున్న టీడీపీ బోణీ కొట్టింది. ఖమ్మం జిల్లా మధిరలో తెలుగుదేశం పార్టీకి చెందిన బోడేపూడి రేవతి విజయం సాధించారు. బీఆర్ఎస్ కు చెందిన సుధాకర్ మీద ఆమె గెలిచి చాలా కాలం తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేలా చేశారు. తాజా ఫలితం తెలుగుదేశం పార్టీకి నూతనోత్సాహాన్నిచ్చింది.
ఇక, తెలంగాణలో జనసేన కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్ కార్పొరేటర్ గా జనసేన అభ్యర్థి అగ్గు సాగర్ గెలుపొందారు. 31 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. దాంతోపాటు, సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై 60 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలను కాదని మరీ జనసేనకు పట్టం కట్టటంతో జనసైనికులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ రెండు పార్టీలకు ఈ విజయం చిన్నదే అయినా భవిష్యత్తులో మరిన్ని విజయాలకు ఇదే నాంది అని ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో.. ఆయన ఇచ్చిన ధైర్యంతో ఎన్నికల బరిలో దిగి విజయం సాధించామని జనసేన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో జనసేన తరఫున 336 మంది అభ్యర్థులు బరిలో దిగారు. వీరి తరఫున జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయాలని భావించారు. దీనికి సంబంధించిన ప్రచార షెడ్యూల్ సైతం కన్ఫర్మ్ అయ్యింది అయితే.. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. పార్టీ తరఫున ఆర్ కే సాగర్, హైపర్ ఆది, తనీష్ వంటి వారు తరఫున ప్రచారం చేశారు.
This post was last modified on February 14, 2026 11:32 am
పైరసీలో ఎన్నో రకాలు చూశాం. కానీ ఒక సినిమా విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ ఆన్ లైన్లోకి…
మొన్న శుక్రవారం విడుదలైన డెకాయిట్ స్లో అండ్ స్టడీగా ఉంది. టాక్ డీసెంట్ గా ఉండటం, ప్రమోషన్లు జనాలకు చేరడం,…
ఆంధ్రప్రదేశ్లో ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఎమ్మెల్యేల పనితీరును చంద్రబాబు మరోసారి రాబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 164 స్థానాల్లో కూటమి పార్టీల నాయకులు…
పేరుకేమో.. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిలిం ఇండస్ట్రీల్లో ఒకటిగా పేరు. భారీ బడ్జెట్లు, రికార్డు బిజినెస్లు, కళ్లు చెదిరే పారితోషకాలు.. చివరికి చూస్తేనేమో వసూళ్లు…
ఓట్ల తొలగింపు అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా ఓట్లు కోల్పోయిన వారి వల్ల ఎన్నికలు ప్రభావితం (ఎఫెక్ట్)…
తన మంత్రి వర్గంలోని సభ్యుల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తరచుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వారు…