జనసేన తరఫున గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎస్సీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రాపాక స్టయిలే.. వేరుగా ఉందని అంటున్నారు వైసీపీ నాయకులు. జనసేన తరఫున గెలిచిన తర్వాత.. కేవలం నాలుగు నెలల్లోనే ఆయన వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. కేవలం కండువా మాత్రమే కప్పుకోలేదు కానీ.. వైసీపీ ఎమ్మెల్యేల కంటే.. కూడా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాజోలు నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన వైసీపీ నేతగా చలామణి అవుతూ.. ఇప్పటికే ఉన్న వైసీపీ నాయకులను డమ్మీలు చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది.
రాపాక ధోరణిని గమనించిన నాయకులు.. ముందు వేలు పెట్టారు.. తర్వాత.. తల పెట్టారు.. పోనీలే అనుకున్నాం.. ఇప్పుడు ఏకంగా నియోజకవర్గంలో వైసీపీని కబ్జా చేశారంటూ.. వ్యాఖ్యలుసంధిస్తున్నారు. దీనికి కూడా రీజన్ కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన శాసనసభ శీతాకాల సమావేశాల అనంతరం.. రాపాక.. ఏకంగా తన కుమారుడు రాపాక వెంకట్రామయ్య ఉరఫ్.. వెంట్రామ్ను వైసీపీలోకి చేర్చేశారు. యువ నాయకుడు.. ఇంకా మూడు పదులు కూడా వయసు నిండని ఉడుకు నెత్తురు కావడంతో జగన్ ఆయనను వెంటనే పార్టీ లోకి చేర్చేసుకున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది. అయితే.. ఇప్పుడు రాపాక ప్రతిపాదనతో వైసీపీ నేతలు ఖంగుతిన్నారు. రాజోలు నియోజకవర్గం ఇంచార్జ్ బాధ్యతలను తన కుమారుడికి ఇస్తే.. పార్టీని గెలిపించే బాధ్యత తనే తీసుకుంటానని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణద్వారా.. జిల్లా వైసీపీ ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ కొట్టించారట. దీనిపై వైవీ సమాధానం చెప్పకపోయినా.. ఒక అడుగైతే.. రాపాక నుంచి పడింది.
అంతటితో ఆయన ఆగకుండా.. ప్రస్తుతం నియోజకవర్గంలో అటు బొంతు రాజేశ్వరరావు, ఇటు పెదపాటి అమ్మాజీలు నిత్యం కొట్టుకుంటున్నారని.. దీంతో పార్టీ బలోపేతం కావడం లేదని.. తనైతే.. పార్టీని ముందుకు నడిపిస్తానని కూడా హామీ ఇచ్చారట. దీంతో ఇప్పుడు రాజోలు నియోజకవర్గంలో వేలుతో మొదలైన రాపాక రాజకీయం .. కబ్జావరకు చేరిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on December 18, 2020 7:12 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…