జనసేన తరఫున గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎస్సీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రాపాక స్టయిలే.. వేరుగా ఉందని అంటున్నారు వైసీపీ నాయకులు. జనసేన తరఫున గెలిచిన తర్వాత.. కేవలం నాలుగు నెలల్లోనే ఆయన వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. కేవలం కండువా మాత్రమే కప్పుకోలేదు కానీ.. వైసీపీ ఎమ్మెల్యేల కంటే.. కూడా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాజోలు నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన వైసీపీ నేతగా చలామణి అవుతూ.. ఇప్పటికే ఉన్న వైసీపీ నాయకులను డమ్మీలు చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది.
రాపాక ధోరణిని గమనించిన నాయకులు.. ముందు వేలు పెట్టారు.. తర్వాత.. తల పెట్టారు.. పోనీలే అనుకున్నాం.. ఇప్పుడు ఏకంగా నియోజకవర్గంలో వైసీపీని కబ్జా చేశారంటూ.. వ్యాఖ్యలుసంధిస్తున్నారు. దీనికి కూడా రీజన్ కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన శాసనసభ శీతాకాల సమావేశాల అనంతరం.. రాపాక.. ఏకంగా తన కుమారుడు రాపాక వెంకట్రామయ్య ఉరఫ్.. వెంట్రామ్ను వైసీపీలోకి చేర్చేశారు. యువ నాయకుడు.. ఇంకా మూడు పదులు కూడా వయసు నిండని ఉడుకు నెత్తురు కావడంతో జగన్ ఆయనను వెంటనే పార్టీ లోకి చేర్చేసుకున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది. అయితే.. ఇప్పుడు రాపాక ప్రతిపాదనతో వైసీపీ నేతలు ఖంగుతిన్నారు. రాజోలు నియోజకవర్గం ఇంచార్జ్ బాధ్యతలను తన కుమారుడికి ఇస్తే.. పార్టీని గెలిపించే బాధ్యత తనే తీసుకుంటానని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణద్వారా.. జిల్లా వైసీపీ ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ కొట్టించారట. దీనిపై వైవీ సమాధానం చెప్పకపోయినా.. ఒక అడుగైతే.. రాపాక నుంచి పడింది.
అంతటితో ఆయన ఆగకుండా.. ప్రస్తుతం నియోజకవర్గంలో అటు బొంతు రాజేశ్వరరావు, ఇటు పెదపాటి అమ్మాజీలు నిత్యం కొట్టుకుంటున్నారని.. దీంతో పార్టీ బలోపేతం కావడం లేదని.. తనైతే.. పార్టీని ముందుకు నడిపిస్తానని కూడా హామీ ఇచ్చారట. దీంతో ఇప్పుడు రాజోలు నియోజకవర్గంలో వేలుతో మొదలైన రాపాక రాజకీయం .. కబ్జావరకు చేరిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…