Political News

అసెంబ్లీ నుండి వాకవుట్… ఎవరికి నష్టం?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైసీపీ ఎప్పటిలాగే బాయ్ కాట్ చేసింది. అటెండెన్స్ టార్గెట్ గా సభకు వచ్చిన వైసీపీ సభ్యులు ఆ పని పూర్తిచేసి .. సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ సభ్యులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు.

అసెంబ్లీలో 11వ తేదీన 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా అంటూ వైసీపీ సభ్యులనుద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. అంతకుమించి ఎక్కువ సమయం లేరుగా అని మీడియా ప్రతినిధులను సరదాగా ప్రశ్నించారు. సభ్యులు సభా సంప్రదాయాలు పాటిస్తే మంచిదని హితవు పలికారు.

వాస్తవానికి ఈ సారి సభకు హాజరైతే వైసీపీకి, జగన్ కు మైలేజ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. లడ్డూ ఇష్యూతోపాటు అంబటి, జోగి ఇళ్లపై దాడి అంశాన్ని సభలో జగన్ ప్రస్తావించవచ్చు. సభా నియమాల ప్రకారం వైసీపీ సభ్యులకు దక్కే సమయంలో ఈ విషయాలు ప్రస్తావించే అవకాశమున్నా.. అలా చేసేందుకు జగన్ అండ్ కో సిద్ధంగా లేదు.

ఎప్పటిలాగే వైసీపీ ఎమ్మెల్యేల వాకౌట్ ఈ రోజుకే పరిమితం కాదని..ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తం బాయ్ కాట్ చేసినట్లేనని ప్రచారం జరుగుతోంది. అయితే, కనీసం బడ్జెట్ సమావేశాలకైనా జగన్, వైసీపీ సభ్యులు వస్తే జనం దృష్టిలో వారికి ఉన్న కొద్దో గొప్పో ఇమేజ్ మిగులుతుంది.

ఇలాంటి సమయంలోనూ అసెంబ్లీకి రాకపోతే ఇంక ఎప్పుడూ వస్తారని సొంత నేతలే ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారు. ఇలానే కొనసాగితే నష్టం ప్రభుత్వానిది కాదని, తమదే అంటూ మొత్తుకుంటున్నారు. ఇక, యథా ప్రకారం తమకు బలమున్న శానస మండలిలోనే వైసీపీ తమ వాయిస్ వినిపించనుందని తెలుస్తోంది.

కాగా, మార్చి 7 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. సెలవు దినాలు, పండుగలు మినహాయించి మొత్తం 17 రోజుల పాటు సభ జరగనుంది. అవసరమైతే సమావేశాలు మరికొద్ది రోజులు పొడిగించనున్నారు. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 17, 18 తేదీల్లో బడ్జెట్ పై చర్చ ఉంటుంది. 18న బడ్జెట్ పై ఏపీ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమివ్వనున్నారు.

Kumar

Recent Posts

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

45 minutes ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

49 minutes ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

2 hours ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

2 hours ago

కృష్ణలంక వివాదాన్ని బాబు ఎలా హ్యాండిల్ చేశారు?

రాజ‌కీయ చతుర‌త‌లో మ‌రోసారి టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చాణ‌క్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. స‌ర్కారును ఇరుకున పెట్టేసి.. కుల‌,…

3 hours ago

తినాలని ఉన్నా తినలేని సమంత..

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఫిజిక్, లుక్స్ మీద రకరకాల కామెంట్స్ రావడం చాలా కామన్. కొంచెం బరువు పెరిగినా లేదా…

3 hours ago