Political News

అసెంబ్లీ నుండి వాకవుట్… ఎవరికి నష్టం?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైసీపీ ఎప్పటిలాగే బాయ్ కాట్ చేసింది. అటెండెన్స్ టార్గెట్ గా సభకు వచ్చిన వైసీపీ సభ్యులు ఆ పని పూర్తిచేసి .. సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ సభ్యులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు.

అసెంబ్లీలో 11వ తేదీన 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా అంటూ వైసీపీ సభ్యులనుద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. అంతకుమించి ఎక్కువ సమయం లేరుగా అని మీడియా ప్రతినిధులను సరదాగా ప్రశ్నించారు. సభ్యులు సభా సంప్రదాయాలు పాటిస్తే మంచిదని హితవు పలికారు.

వాస్తవానికి ఈ సారి సభకు హాజరైతే వైసీపీకి, జగన్ కు మైలేజ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. లడ్డూ ఇష్యూతోపాటు అంబటి, జోగి ఇళ్లపై దాడి అంశాన్ని సభలో జగన్ ప్రస్తావించవచ్చు. సభా నియమాల ప్రకారం వైసీపీ సభ్యులకు దక్కే సమయంలో ఈ విషయాలు ప్రస్తావించే అవకాశమున్నా.. అలా చేసేందుకు జగన్ అండ్ కో సిద్ధంగా లేదు.

ఎప్పటిలాగే వైసీపీ ఎమ్మెల్యేల వాకౌట్ ఈ రోజుకే పరిమితం కాదని..ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తం బాయ్ కాట్ చేసినట్లేనని ప్రచారం జరుగుతోంది. అయితే, కనీసం బడ్జెట్ సమావేశాలకైనా జగన్, వైసీపీ సభ్యులు వస్తే జనం దృష్టిలో వారికి ఉన్న కొద్దో గొప్పో ఇమేజ్ మిగులుతుంది.

ఇలాంటి సమయంలోనూ అసెంబ్లీకి రాకపోతే ఇంక ఎప్పుడూ వస్తారని సొంత నేతలే ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారు. ఇలానే కొనసాగితే నష్టం ప్రభుత్వానిది కాదని, తమదే అంటూ మొత్తుకుంటున్నారు. ఇక, యథా ప్రకారం తమకు బలమున్న శానస మండలిలోనే వైసీపీ తమ వాయిస్ వినిపించనుందని తెలుస్తోంది.

కాగా, మార్చి 7 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. సెలవు దినాలు, పండుగలు మినహాయించి మొత్తం 17 రోజుల పాటు సభ జరగనుంది. అవసరమైతే సమావేశాలు మరికొద్ది రోజులు పొడిగించనున్నారు. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 17, 18 తేదీల్లో బడ్జెట్ పై చర్చ ఉంటుంది. 18న బడ్జెట్ పై ఏపీ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమివ్వనున్నారు.

This post was last modified on February 11, 2026 3:52 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కుప్పంలో భువ‌నేశ్వ‌రి సైలెంట్ `టూర్స్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం.. తిరుప‌తిలోని కుప్పంలో ఆయ‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి సైలెంట్‌గా చుట్టేస్తున్నారు. ప్ర‌తి రెండు…

41 minutes ago

ముస్లిం కట్టిన అయోధ్య రామాలయం ఇది

అయోధ్య రామాలయం ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లో ఉంది కదా. మరి ఈ రామాలయం.. అది కూడా ఓ ముస్లిం కట్టిన…

46 minutes ago

పాపం కాదు… బాగుంది ప్రయత్నం అనిపించాలి

తిరువీర్ అంటే రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు సుపరిచితుడే కానీ సెలెక్టివ్ గా థియేటర్లకు వెళ్లే వాళ్లకు మాత్రం కొంచెం…

3 hours ago

ఇక ఎవరొచ్చినా అమరావతిని ముట్టుకోలేరు

తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి,…

3 hours ago

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…

4 hours ago

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

4 hours ago