కరుడుగట్టిన కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ వచ్చి తన తరఫున ప్రచారం చేసినా తనను ఓడించారని, సంగారెడ్డి నుంచి భవిష్యత్తులో పోటీ చేసే ప్రసక్తే లేదని ప్రజలపై జగ్గారెడ్డి అలిగిన వైనం వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయమని అడగబోనని జగ్గారెడ్డి చెప్పారు. కానీ, అదే సమయంలో ఓ కాంగ్రెస్ అభ్యర్థి కోసం పోలీసులతో కొట్లాడిన జగ్గారెడ్డి…ఓ సీఐని, ఓ హోంగార్డును రాయలేని విధంగా బూతులు తిట్టారు.
పోలీసులపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లకారాలతో పోలీసులను జగ్గారెడ్డి దూషించిన వైనం వివాదాస్పదమైంది. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని సీఐ దూషించారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలింగ్ బూతులోకి దూసుకువెళ్లిన జగ్గారెడ్డి నానా రచ్చ చేశారు.
బీఆర్ఎస్ రిగ్గింగ్ కు పాల్పడుతోందని, అందుకు సీఐ సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలింగ్ ఆపేస్తానని కేకలు వేశారు. ఈ బూత్ లో పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలోనే జగ్గారెడ్డి అనుచరులు, పోలీసుల మధ్య తోపులాట జరిగి అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ క్రమంలోనే అరే ఎవడ్రా నువ్వు?…రారా…ల…అంటూ లకారాలతో సీఐ శివ కుమార్ ను జగ్గారెడ్డి దుర్భాషలాడారు. ఇక, బీఆర్ఎస్ రిగ్గింగ్ చేస్తోందని కాంగ్రెస్ అభ్యర్థి ఫిర్యాదు చేస్తే ఆ అభ్యర్థి చొక్కా పట్టుకొని సీఐ దౌర్జన్యం చేశారని నిప్పులు చెరిగారు.
ఆ సీఐ మగోడైతే ఇక్కడకు రావాలి…అని సవాల్ విసిరారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా పోలీసులు ఉంటారని, అయినా సరే తమ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండమని తాను చెప్పలేదని అన్నారు.
ఆ సీఐ బీఆర్ఎస్ తొత్తు అని, ఆ విషయం తనకు తెలుసని, అతడిని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇదేమన్నా సినిమానా…నువ్వేమన్నా తీస్ మార్ ఖాన్ వా అంటూ ఆ సీఐపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇక, సీఐతో పాటు మరో హోంగార్డ్ పై కూడా బూతులతో జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. తాను పోలింగ్ బూత్ లోకి రాక 26 ఏళ్లయిందని…కానీ, ఈ రోజు రావాల్సి వచ్చిందని అన్నారు.
This post was last modified on February 11, 2026 6:21 pm
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించిన వ్యవహారం రాజకీయంగా రచ్చ రేపిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు…
వైసీపీ నేతలు, ఆ పార్టీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా రెండు…
‘బాహుబలి’తో ప్రభాస్ ఎంత పెద్ద స్టార్గా ఎదిగాడో.. ఒకేసారి తన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఎన్ని రెట్లయిందో కొత్తగా చెప్పాల్సిన…
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అంటూ చాలామంది సినీ జనాలు చెబుతుంటారు. ఐతే యాక్టర్ అయ్యాక డాక్టర్ అయిన వాళ్లు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైసీపీ ఎప్పటిలాగే బాయ్ కాట్ చేసింది. అటెండెన్స్ టార్గెట్ గా సభకు వచ్చిన వైసీపీ…
టీ20 వరల్డ్ కప్ 2026లో మరో మ్యాచ్ అసలైన కిక్ ఇచ్చింది. గ్రూప్-డిలో భాగంగా సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య…