కరుడుగట్టిన కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ వచ్చి తన తరఫున ప్రచారం చేసినా తనను ఓడించారని, సంగారెడ్డి నుంచి భవిష్యత్తులో పోటీ చేసే ప్రసక్తే లేదని ప్రజలపై జగ్గారెడ్డి అలిగిన వైనం వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయమని అడగబోనని జగ్గారెడ్డి చెప్పారు. కానీ, అదే సమయంలో ఓ కాంగ్రెస్ అభ్యర్థి కోసం పోలీసులతో కొట్లాడిన జగ్గారెడ్డి…ఓ సీఐని, ఓ హోంగార్డును రాయలేని విధంగా బూతులు తిట్టారు.
పోలీసులపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లకారాలతో పోలీసులను జగ్గారెడ్డి దూషించిన వైనం వివాదాస్పదమైంది. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని సీఐ దూషించారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలింగ్ బూతులోకి దూసుకువెళ్లిన జగ్గారెడ్డి నానా రచ్చ చేశారు.
బీఆర్ఎస్ రిగ్గింగ్ కు పాల్పడుతోందని, అందుకు సీఐ సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలింగ్ ఆపేస్తానని కేకలు వేశారు. ఈ బూత్ లో పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలోనే జగ్గారెడ్డి అనుచరులు, పోలీసుల మధ్య తోపులాట జరిగి అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ క్రమంలోనే అరే ఎవడ్రా నువ్వు?…రారా…ల…అంటూ లకారాలతో సీఐ శివ కుమార్ ను జగ్గారెడ్డి దుర్భాషలాడారు. ఇక, బీఆర్ఎస్ రిగ్గింగ్ చేస్తోందని కాంగ్రెస్ అభ్యర్థి ఫిర్యాదు చేస్తే ఆ అభ్యర్థి చొక్కా పట్టుకొని సీఐ దౌర్జన్యం చేశారని నిప్పులు చెరిగారు.
ఆ సీఐ మగోడైతే ఇక్కడకు రావాలి…అని సవాల్ విసిరారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా పోలీసులు ఉంటారని, అయినా సరే తమ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండమని తాను చెప్పలేదని అన్నారు.
ఆ సీఐ బీఆర్ఎస్ తొత్తు అని, ఆ విషయం తనకు తెలుసని, అతడిని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇదేమన్నా సినిమానా…నువ్వేమన్నా తీస్ మార్ ఖాన్ వా అంటూ ఆ సీఐపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇక, సీఐతో పాటు మరో హోంగార్డ్ పై కూడా బూతులతో జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. తాను పోలింగ్ బూత్ లోకి రాక 26 ఏళ్లయిందని…కానీ, ఈ రోజు రావాల్సి వచ్చిందని అన్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…