కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కూటమి పార్టీల నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.75 శాతం వృద్ధి సాధించిందని, 2025-26లో 10.75 శాతం వృద్ధి సాధించబోతున్నామని అంచనా వేస్తూ ప్రభుత్వం ఓ నివేదికను కూడా విడుదల చేసింది. అయితే, ఆ నివేదికను ఏపీ మాజీ సీఎం జగన్ తప్పుబట్టారు. ఈ గణాంకాలు ఏ స్వతంత్ర సంస్థ ఇవ్వలేదని, చంద్రబాబు కార్యాలయంలో సృష్టించినవని ఎద్దేవా చేశారు.
అంతేకాదు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 9 నెలలకు విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ విమర్శలు గుప్పించారు. రెండేళ్లుగా రాష్ట్ర పన్నుల రాబడి వృద్ధి సగటున కేవలం 1.97 శాతం అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 11 శాతం పైగా జీఎస్డీపీ వృద్ధి సాధిస్తున్న రాష్ట్రంలో పన్నుల రాబడి 2 శాతం లోపు ఎలా ఉంటుందని జగన్ ప్రశ్నించారు.
ఇక, ఈ వింత గణాంకాలు చూసి ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారని జగన్ సెటైర్లు వేశారు. ఏపీ ప్రభుత్వం చెబుతున్న వృద్ధి నిజమైతే, పన్నుల రాబడిలోనూ ఆ స్థాయి పెరుగుదల ఉండాలని జగన్ అన్నారు. కాగ్ లెక్కలు ప్రభుత్వ బూటకపు ప్రచారాన్ని బట్టబయలు చేశాయని విమర్శించారు.
23 రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల రాబడి వృద్ధి జాబితాలో ఏపీ 22వ స్థానంలో నిలిచిందని కాగ్ విడుదల చేసిన గణాంకాలను జగన్ ప్రస్తావించారు. ఆ లిస్ట్ లో ఏపీ అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలవడం సిగ్గుచేటని అన్నారు. ఇదే చంద్రబాబు ’22వ ర్యాంక్ విజన్’ అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు పాలనలో ఏపీ అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపులు, తప్పుడు ప్రచారంలో నెంబర్ వన్ గా ఉందని చురకలంటించారు. ఈ వృద్ధి రేటుతో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని ప్రభుత్వం చెప్పుకోవడం పెద్ద జోక్ అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అయినా జీఎస్డీపీ గణాంకాలతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు.
This post was last modified on February 10, 2026 6:01 pm
ఫిబ్రవరి మొత్తం దాదాపుగా డ్రైగా గడిపేసిన టాలీవుడ్ బాక్సాఫీస్ మార్చిలో మంచి బోణీ కోసం ఎదురు చూస్తోంది. ఎంత పిల్లల…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. వచ్చే ఏప్రిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. ఒంటరి పోరు చేస్తామంటూ..…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి ప్రతి ప్రోమో బ్లాక్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై మరోసారి తన పట్టును గట్టిగా నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలోనూ ఆయన అనేక సందర్భాల్లో…
హఠాత్తుగా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19కి ప్రీ పోన్ అయ్యిందన్న వార్త ఒక్కసారిగా నిన్న సాయంత్రం సోషల్ మీడియాని…
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న యుద్ధం.. భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందా? ప్రజలకు కష్టాలు ప్రారంభం కానున్నాయా? అంటే..…