Political News

చంద్రబాబు ర్యాంకుపై జగన్ సెటైర్లు

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కూటమి పార్టీల నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.75 శాతం వృద్ధి సాధించిందని, 2025-26లో 10.75 శాతం వృద్ధి సాధించబోతున్నామని అంచనా వేస్తూ ప్రభుత్వం ఓ నివేదికను కూడా విడుదల చేసింది. అయితే, ఆ నివేదికను ఏపీ మాజీ సీఎం జగన్ తప్పుబట్టారు. ఈ గణాంకాలు ఏ స్వతంత్ర సంస్థ ఇవ్వలేదని, చంద్రబాబు కార్యాలయంలో సృష్టించినవని ఎద్దేవా చేశారు.

అంతేకాదు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 9 నెలలకు విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ విమర్శలు గుప్పించారు. రెండేళ్లుగా రాష్ట్ర పన్నుల రాబడి వృద్ధి సగటున కేవలం 1.97 శాతం అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 11 శాతం పైగా జీఎస్‌డీపీ వృద్ధి సాధిస్తున్న రాష్ట్రంలో పన్నుల రాబడి 2 శాతం లోపు ఎలా ఉంటుందని జగన్ ప్రశ్నించారు.

ఇక, ఈ వింత గణాంకాలు చూసి ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారని జగన్ సెటైర్లు వేశారు. ఏపీ ప్రభుత్వం చెబుతున్న వృద్ధి నిజమైతే, పన్నుల రాబడిలోనూ ఆ స్థాయి పెరుగుదల ఉండాలని జగన్ అన్నారు. కాగ్ లెక్కలు ప్రభుత్వ బూటకపు ప్రచారాన్ని బట్టబయలు చేశాయని విమర్శించారు.

23 రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల రాబడి వృద్ధి జాబితాలో ఏపీ 22వ స్థానంలో నిలిచిందని కాగ్ విడుదల చేసిన గణాంకాలను జగన్ ప్రస్తావించారు. ఆ లిస్ట్ లో ఏపీ అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలవడం సిగ్గుచేటని అన్నారు. ఇదే చంద్రబాబు ’22వ ర్యాంక్ విజన్’ అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు పాలనలో ఏపీ అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపులు, తప్పుడు ప్రచారంలో నెంబర్ వన్ గా ఉందని చురకలంటించారు. ఈ వృద్ధి రేటుతో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని ప్రభుత్వం చెప్పుకోవడం పెద్ద జోక్ అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అయినా జీఎస్‌డీపీ గణాంకాలతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు.

Kumar

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

15 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

47 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago