Political News

చంద్రబాబు ర్యాంకుపై జగన్ సెటైర్లు

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కూటమి పార్టీల నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.75 శాతం వృద్ధి సాధించిందని, 2025-26లో 10.75 శాతం వృద్ధి సాధించబోతున్నామని అంచనా వేస్తూ ప్రభుత్వం ఓ నివేదికను కూడా విడుదల చేసింది. అయితే, ఆ నివేదికను ఏపీ మాజీ సీఎం జగన్ తప్పుబట్టారు. ఈ గణాంకాలు ఏ స్వతంత్ర సంస్థ ఇవ్వలేదని, చంద్రబాబు కార్యాలయంలో సృష్టించినవని ఎద్దేవా చేశారు.

అంతేకాదు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 9 నెలలకు విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ విమర్శలు గుప్పించారు. రెండేళ్లుగా రాష్ట్ర పన్నుల రాబడి వృద్ధి సగటున కేవలం 1.97 శాతం అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 11 శాతం పైగా జీఎస్‌డీపీ వృద్ధి సాధిస్తున్న రాష్ట్రంలో పన్నుల రాబడి 2 శాతం లోపు ఎలా ఉంటుందని జగన్ ప్రశ్నించారు.

ఇక, ఈ వింత గణాంకాలు చూసి ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారని జగన్ సెటైర్లు వేశారు. ఏపీ ప్రభుత్వం చెబుతున్న వృద్ధి నిజమైతే, పన్నుల రాబడిలోనూ ఆ స్థాయి పెరుగుదల ఉండాలని జగన్ అన్నారు. కాగ్ లెక్కలు ప్రభుత్వ బూటకపు ప్రచారాన్ని బట్టబయలు చేశాయని విమర్శించారు.

23 రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల రాబడి వృద్ధి జాబితాలో ఏపీ 22వ స్థానంలో నిలిచిందని కాగ్ విడుదల చేసిన గణాంకాలను జగన్ ప్రస్తావించారు. ఆ లిస్ట్ లో ఏపీ అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలవడం సిగ్గుచేటని అన్నారు. ఇదే చంద్రబాబు ’22వ ర్యాంక్ విజన్’ అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు పాలనలో ఏపీ అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపులు, తప్పుడు ప్రచారంలో నెంబర్ వన్ గా ఉందని చురకలంటించారు. ఈ వృద్ధి రేటుతో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని ప్రభుత్వం చెప్పుకోవడం పెద్ద జోక్ అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అయినా జీఎస్‌డీపీ గణాంకాలతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు.

This post was last modified on February 10, 2026 6:01 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విజయ్ కి మద్దతు.. కాంగ్రెస్ కు పెద్ద లాసే?

తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…

1 hour ago

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

8 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

8 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

9 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

11 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

12 hours ago