ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో టైటిల్ కార్డ్స్ అన్నవి తప్పనిసరి అయిపోయాయి. జస్ట్ పేరు, దాని ముందు ఒక ట్యాగ్ వేసి ఊరుకోవట్లేదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి కొందరు టాప్ స్టార్లకు మాత్రమే టైటిల్ కార్డ్ వేసేటపుడు హంగామా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి హీరోకూ స్పెషల్ టైటిల్ కార్డ్ వేయిస్తున్నారు.
వాళ్ల కెరీర్లో కల్ట్ క్యారెక్టర్ల తాలూకు బొమ్మలు తీసుకుని యానిమేషన్లో టైటిల్ కార్డ్స్ రెడీ చేయిస్తున్నారు. ఇది ప్రధానంగా తమిళ స్టార్ హీరో విజయ్ మూవీ ‘లియో’ నుంచి మొదలైన ట్రెండ్. అందులో విజయ్ కోసం రెడీ చేయించిన టైటిల్ కార్డ్ తన అభిమానులనే కాక అందరినీ ఆకట్టుకుంది.
దీంతో అందరూ అదే బాట పడుతున్నారు. తెలుగులో కూడా చాలామంది స్టార్ల సినిమాలకు ఈ స్టైల్ను ఫాలో అయ్యారు. చిన్న స్టార్లు సైతం ఇదే శైలిని అనుసరించడం.. దీనికి విలువ లేకుండా పోయింది.
ఐతే మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘విశ్వంభర’కు మాత్రం టైటిల్ కార్డ్ విషయంలో రెగ్యులర్ ఫార్మాట్లు ఉండవట. దాని కోసం ప్రత్యేకంగా డిజైన్లు చేయించినట్లు దర్శకుడు వశిష్ఠ ఒక ఇంటర్వ్యలో చెప్పాడు.
‘‘లియో తర్వాత యానిమేటెడ్ టైటిల్ కార్డ్స్ ట్రెండుగా మారాయి. కానీ విశ్వంభర కోసం ఆ స్టీరియో టైప్ను ఫాలో అవ్వాలని మేం అనుకోలేదు. అందుకే సినిమా కథ, ఆత్మకు తగ్గట్లుగా ఎనిమిది ప్రత్యేకమైన మెగాస్టార్ టైటిల్ కార్డ్స్ డిజైన్స్ తయారు చేయించాము. ప్రతి ఒక్కటీ విశ్వంభర కాన్సెప్ట్ను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఉంటుంది’’ అని వశిష్ఠ వెల్లడించాడు.
గత ఏడాది సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ కరెక్షన్ల వల్ల బాగా ఆలస్యం అయింది. ప్రస్తుతం వినిపిస్తున్న రిలీజ్ డేట్ జులై 10. త్వరలోనే ప్రకటన రావచ్చని అంచనా వేస్తున్నారు. యువి క్రియేషన్స్ రూ.250 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించింది.
This post was last modified on February 10, 2026 4:49 pm
కొద్దిసేపటి క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ ఒక పాడ్కాస్ట్లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారాన్నే…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)…ప్రధాని మోదీ మొదలు ప్రముఖ నటి రష్మిక మందన్న వరకు ఏఐ బాధితులే. కృత్రిమ మేథస్సుతో ఉపయోగాలతోపాటు…
పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి…
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కూటమి పార్టీల నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.…
మాజీ ఆర్మీ ఛీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన "ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ" పుస్తకం దుమారం రేపుతున్న సంగతి…
ఒకప్పుడు టాలీవుడ్లో మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఉండేవాడు అల్లు అర్జున్. కానీ ఇప్పుడు టాలీవుడ్ అనే కాదు.. ఇండియాలోనే…