ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో టైటిల్ కార్డ్స్ అన్నవి తప్పనిసరి అయిపోయాయి. జస్ట్ పేరు, దాని ముందు ఒక ట్యాగ్ వేసి ఊరుకోవట్లేదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి కొందరు టాప్ స్టార్లకు మాత్రమే టైటిల్ కార్డ్ వేసేటపుడు హంగామా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి హీరోకూ స్పెషల్ టైటిల్ కార్డ్ వేయిస్తున్నారు.
వాళ్ల కెరీర్లో కల్ట్ క్యారెక్టర్ల తాలూకు బొమ్మలు తీసుకుని యానిమేషన్లో టైటిల్ కార్డ్స్ రెడీ చేయిస్తున్నారు. ఇది ప్రధానంగా తమిళ స్టార్ హీరో విజయ్ మూవీ ‘లియో’ నుంచి మొదలైన ట్రెండ్. అందులో విజయ్ కోసం రెడీ చేయించిన టైటిల్ కార్డ్ తన అభిమానులనే కాక అందరినీ ఆకట్టుకుంది.
దీంతో అందరూ అదే బాట పడుతున్నారు. తెలుగులో కూడా చాలామంది స్టార్ల సినిమాలకు ఈ స్టైల్ను ఫాలో అయ్యారు. చిన్న స్టార్లు సైతం ఇదే శైలిని అనుసరించడం.. దీనికి విలువ లేకుండా పోయింది.
ఐతే మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘విశ్వంభర’కు మాత్రం టైటిల్ కార్డ్ విషయంలో రెగ్యులర్ ఫార్మాట్లు ఉండవట. దాని కోసం ప్రత్యేకంగా డిజైన్లు చేయించినట్లు దర్శకుడు వశిష్ఠ ఒక ఇంటర్వ్యలో చెప్పాడు.
‘‘లియో తర్వాత యానిమేటెడ్ టైటిల్ కార్డ్స్ ట్రెండుగా మారాయి. కానీ విశ్వంభర కోసం ఆ స్టీరియో టైప్ను ఫాలో అవ్వాలని మేం అనుకోలేదు. అందుకే సినిమా కథ, ఆత్మకు తగ్గట్లుగా ఎనిమిది ప్రత్యేకమైన మెగాస్టార్ టైటిల్ కార్డ్స్ డిజైన్స్ తయారు చేయించాము. ప్రతి ఒక్కటీ విశ్వంభర కాన్సెప్ట్ను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఉంటుంది’’ అని వశిష్ఠ వెల్లడించాడు.
గత ఏడాది సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ కరెక్షన్ల వల్ల బాగా ఆలస్యం అయింది. ప్రస్తుతం వినిపిస్తున్న రిలీజ్ డేట్ జులై 10. త్వరలోనే ప్రకటన రావచ్చని అంచనా వేస్తున్నారు. యువి క్రియేషన్స్ రూ.250 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించింది.
This post was last modified on February 10, 2026 4:49 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…