Movie News

సాయిశ్రీనివాస డిస్కషన్ ఇప్పుడు ఎందుకు

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ సీక్వెల్ కావాలనే డిమాండ్ పెరిగిపోయింది. అనగనగా ఒక రోజు ప్రమోషన్ల కోసం నవీన్ పోలిశెట్టి అమెరికా వెళ్లినప్పుడు అక్కడి ఆడియన్స్ కొందరు ఈ కోరికను థియేటర్లో నేరుగా వినిపించారు. ఆ క్లిప్ కాస్త వైరల్ కావడంతో ఇక్కడి ఫ్యాన్స్ యాక్టివేట్ అయిపోయి పార్ట్ 2 పల్లవి అందుకున్నారు.

మొదటి భాగం తీసిన దర్శకుడు స్వరూప్ ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డతో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ కింద వేరే మూవీ చేస్తున్నారు. ఎప్పుడో అఫీషియల్ కాగా ఇవాళ సిద్ధూ పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది పూర్తిగా వేరే జానర్ అండ్ స్టోరీ.

పైగా ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ నిర్మాతలు దాని కొనసాగింపుకి ఇప్పుడప్పుడే సుముఖంగా లేరు. అందులోనూ బాహుబలి, పుష్ప, కెజిఎఫ్ లాగా ఇదేమి క్లైమాక్స్ లో మలుపులు పెట్టి కంటిన్యూటి కోసం ఎదురు చూసేలా చేయలేదు. ట్విస్టుని రివీల్ చేసి కథని అక్కడితో క్లోజ్ చేశారు.

డిటెక్టివ్ కథ కాబట్టి మళ్ళీ ఇంకో క్రైమ్ చుట్టూ అల్లుకోవచ్చు. కానీ నవీన్ సన్నిహితుల టాక్ ప్రకారం అతనికి ఈ సీక్వెల్స్ మీద ఆసక్తి లేదట. గతంలో జాతిరత్నాలు 2ని అమెరికా బ్యాక్ డ్రాప్ లో తీస్తే ఎలా ఉంటుందనే డిస్కషన్ స్వప్న సినిమా బృందంలో జరిగిందట. అనుదీప్ కూడా ఇంటరెస్ట్ చూపించాడు. కానీ కార్యరూపం దాల్చలేదు.

సో ఇప్పుడు ఏజెంట్ విషయంలోనూ నవీన్ పోలిశెట్టి ఇదే నిర్ణయంలో ఉండొచ్చు. వరసగా మూడు బ్లాక్ బస్టర్స్ కొట్టాక నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడనే దాని మీద ఫ్యాన్స్ ఏవేవో ఊహించుకుంటున్నారు. ప్రస్తుతం రెండు కథలు చివరి దశలో ఉన్నాయి. ఫైనల్ నెరేషన్ సంతృఫికరంగా అనిపిస్తే సెట్స్ పైకి తీసుకెళ్తారు. అప్పటిదాకా వెయిటింగ్ తప్పదు.

ఊరికే ట్విట్టర్, ఇన్స్ టాలో హడావిడి చేయడం తప్ప సాయిశ్రీనివాస ఆత్రేయ గురించిన ప్రచారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు. పైగా బిగ్ లీగ్ లోకి ప్రవేశించాలని చూస్తున్న నవీన్ పోలిశెట్టి ఈసారి ఎంటర్ టైన్మెంట్ కాకుండా సీరియస్ జానర్ వైపు చూస్తున్నాడని వినికిడి.

This post was last modified on February 7, 2026 6:08 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

2 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

3 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

3 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

5 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

5 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

7 hours ago