Political News

మొన్న అంబటి.. నేడు జోగి తప్పేం లేదంటోన్న జగన్

ఒక పార్టీకి అధినేత అయిన వ్యక్తి తన పార్టీకి చెందిన నేతలను కాపాడుకోవాలనుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు. కానీ, ఆ పార్టీలోని కొందరు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో అయిన ఆ నేతల తీరును తప్పుబట్టాలి. పోనీ, ఆ నేతలు ఫీల్ అవుతారు అనుకుంటే కనీసం వారి కామెంట్ల గురించి మాట్లాడకుండా దాటవేత ధోరణి అవలంబించాలి.

అంతేగానీ, ఆల్రెడీ కాంట్రవర్షియల్ అయిన కామెంట్లను మాజీ ముఖ్యమంత్రి స్థాయి స్థానంలో ఉన్న వ్యక్తి సమర్థిస్తే ఆ పార్టీలో మొత్తం నేతలంతా ఇదే టైపు అని జనం ముద్ర వేస్తారు. వైసీపీ అధినేత జగన్ తాజాగా ఆ రీతిలో చేసిన వ్యాఖ్యలతో వైసీపీపై ప్రజలు బూతుల పార్టీ అని ముద్ర వేసినా ఆశ్చర్యం లేదు.

లోకేశ్ కు కొవ్వు తగ్గలేదు, లోకేశ్ మెదడులో చిప్ దొబ్బింది అంటూ జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలను జగన్ నిస్సందేహంగా సమర్థించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. మొన్న అంబటి రాంబాబు వ్యాఖ్యలను సమర్థించిన జగన్ నేడు జోగి రమేశ్ ను వెనకేసుకు వచ్చిన వైనం చర్చనీయాంశమైంది.

అంతేకాదు, జోగి రమేశ్ వ్యాఖ్యలపై ఇంకో అడుగు ముందుకు వేసిన జగన్…చంద్రబాబు, లోకేశ్, పవన్ ల చిప్ రిపేర్ చేయాలని వైసీపీ నేతలు ఆలయాల్లో పూజలు కూడా చేశారని వ్యాఖ్యానించి తమ పార్టీలోని నేతలంతా ఇంతే మాట్లాడతారు అని సభ్య సమాజానికి గట్టి సందేశం ఇచ్చినట్లయింది.

జోగి రమేశ్ చేసిన తప్పేమీ లేదని జగన్ అన్నారు. చంద్రబాబు, లోకేశ్, వాళ్లందరినీ ప్రశ్నిస్తూ చిప్ రిపేర్ చేసుకోండి అని మాత్రమే అన్నాడని సమర్థించారు. ఇంత అన్యాయమైన పని చేస్తున్నారు..ఇది ధర్మమేనా అని అడిగాడని, అంతకన్నా చేసిందేమీ లేదని జోగి రమేశ్ వివాదాస్పద వ్యాఖ్యలను జగన్ వెనకేసుకొచ్చారు.

అంతమాత్రానికే యాసిడ్ బాటిల్స్, పెట్రోల్ బాంబులతో జోగి రమేశ్ ఇంటిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దాడి సమయంలో 80 ఏళ్ల వయసున్న జోగి రమేశ్ తండ్రి ఇంట్లో ఉన్నారని, ఆ బాంబుల ధాటికి ఇంటికి నిప్పంటుకొని ఉంటే ఆయన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇది హత్యాయత్నం కాదా అని జగన్ నిలదీశారు.

This post was last modified on February 6, 2026 9:19 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

3 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

6 hours ago