Political News

మొన్న అంబటి.. నేడు జోగి తప్పేం లేదంటోన్న జగన్

ఒక పార్టీకి అధినేత అయిన వ్యక్తి తన పార్టీకి చెందిన నేతలను కాపాడుకోవాలనుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు. కానీ, ఆ పార్టీలోని కొందరు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో అయిన ఆ నేతల తీరును తప్పుబట్టాలి. పోనీ, ఆ నేతలు ఫీల్ అవుతారు అనుకుంటే కనీసం వారి కామెంట్ల గురించి మాట్లాడకుండా దాటవేత ధోరణి అవలంబించాలి.

అంతేగానీ, ఆల్రెడీ కాంట్రవర్షియల్ అయిన కామెంట్లను మాజీ ముఖ్యమంత్రి స్థాయి స్థానంలో ఉన్న వ్యక్తి సమర్థిస్తే ఆ పార్టీలో మొత్తం నేతలంతా ఇదే టైపు అని జనం ముద్ర వేస్తారు. వైసీపీ అధినేత జగన్ తాజాగా ఆ రీతిలో చేసిన వ్యాఖ్యలతో వైసీపీపై ప్రజలు బూతుల పార్టీ అని ముద్ర వేసినా ఆశ్చర్యం లేదు.

లోకేశ్ కు కొవ్వు తగ్గలేదు, లోకేశ్ మెదడులో చిప్ దొబ్బింది అంటూ జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలను జగన్ నిస్సందేహంగా సమర్థించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. మొన్న అంబటి రాంబాబు వ్యాఖ్యలను సమర్థించిన జగన్ నేడు జోగి రమేశ్ ను వెనకేసుకు వచ్చిన వైనం చర్చనీయాంశమైంది.

అంతేకాదు, జోగి రమేశ్ వ్యాఖ్యలపై ఇంకో అడుగు ముందుకు వేసిన జగన్…చంద్రబాబు, లోకేశ్, పవన్ ల చిప్ రిపేర్ చేయాలని వైసీపీ నేతలు ఆలయాల్లో పూజలు కూడా చేశారని వ్యాఖ్యానించి తమ పార్టీలోని నేతలంతా ఇంతే మాట్లాడతారు అని సభ్య సమాజానికి గట్టి సందేశం ఇచ్చినట్లయింది.

జోగి రమేశ్ చేసిన తప్పేమీ లేదని జగన్ అన్నారు. చంద్రబాబు, లోకేశ్, వాళ్లందరినీ ప్రశ్నిస్తూ చిప్ రిపేర్ చేసుకోండి అని మాత్రమే అన్నాడని సమర్థించారు. ఇంత అన్యాయమైన పని చేస్తున్నారు..ఇది ధర్మమేనా అని అడిగాడని, అంతకన్నా చేసిందేమీ లేదని జోగి రమేశ్ వివాదాస్పద వ్యాఖ్యలను జగన్ వెనకేసుకొచ్చారు.

అంతమాత్రానికే యాసిడ్ బాటిల్స్, పెట్రోల్ బాంబులతో జోగి రమేశ్ ఇంటిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దాడి సమయంలో 80 ఏళ్ల వయసున్న జోగి రమేశ్ తండ్రి ఇంట్లో ఉన్నారని, ఆ బాంబుల ధాటికి ఇంటికి నిప్పంటుకొని ఉంటే ఆయన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇది హత్యాయత్నం కాదా అని జగన్ నిలదీశారు.

Kumar

Recent Posts

రామ్ చరణ్ 17… లాంగ్ వెయిటింగ్ తప్పదు

పెద్ది విజయాన్ని ఆస్వాదిస్తున్న రామ్ చరణ్ త్వరలోనే చేతికి కీలకమైన సర్జరీ చేయించుకోబోతున్నాడు. ప్రమోషన్ల కోసమే దాన్ని బ్రేక్ వేస్తూ…

49 minutes ago

వరలక్ష్మి మీద మళ్ళీ ఆరోపణలు

ఆ మధ్య ఎస్ సరస్వతి సినిమా విడుదల టైంలో దర్శక నిర్మాత వరలక్ష్మి శరత్ కుమార్, రచయిత సాయి మాధవ్…

1 hour ago

బొంబాయి మాఫియాలో ‘బాలయ్య’ మాస్

వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని మళ్ళీ చేతులు కలిపారు. ప్రారంభం కావడంలో కొంత…

1 hour ago

‘దురంధర్’ చూసిన కళ్ళకు ‘ఆల్ఫా’ నచ్చేనా

ఎవరు ఔనన్నా కాదన్నా బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాగా దురంధర్ పేరు…

3 hours ago

అమరావతిలో రూ.2.5 వేల కోట్ల కేంద్ర ప్రాజెక్టు

అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి…

5 hours ago

మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్‌.. వైసీపీకి ఇర‌కాటం.. !

నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి.…

6 hours ago