కొందరు నటనలోకి రావాలని ముందే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేస్తారు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి అడుగు పెడతారు. ఎలా వచ్చినా సరే.. ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిపోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, బాగా డబ్బులు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటుంటారు. ఐతే ఒకప్పుడు తెలుగులో నంబర్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదిగి, ఇప్పుడు బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన రకుల్ ప్రీత్ సింగ్.. జస్ట్ ఒక కారు కొనుక్కుంటే చాలు అనే టార్గెట్తో సినిమాల్లోకి అడుగుపెట్టిందట.
తనకు అనుకోకుండా సినిమా అవకాశం వచ్చిందని.. ఆ ఒక్క సినిమా చేసి, దాని ద్వారా వచ్చే పారితోషకంతో ఒక కారు కొనుక్కుంటే చాలు అనుకున్నానని ఆమె తాజాగా ఒక కార్యక్రమంలో వెల్లడించడం విశేషం. తాను కాలేజీలో చదువుకుంటున్న సమయంలో అనుకోకుండా కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తనకు ఒక అవకాశం వచ్చిందని.. ఎవరో కొందరు తన ఫొటోలు చూసి తన తండ్రిని కలిసి తమ చిత్రంలో నటించమని అడిగారని రకుల్ వెల్లడించింది. అప్పుడు తనకు ఏం చెప్పాలో అర్థం కలాలేదని.. సినిమాలపై తనకు అప్పుడంత అవగాహన లేదని రకుల్ తెలిపింది.
ఐతే ఈ సినిమాలో నటిస్తే రూ.5 లక్షల పారితోషకం ఇస్తామని అన్నారని.. ఆ డబ్బులతో కారు కొనుక్కోవచ్చని.. అప్పుడు తన స్నేహితుల బృందంలో కారు కొన్న తొలి అమ్మాయిని తానే అవుతాననే ఒకే కారణంతో ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని రకుల్ తెలిపింది. ఐతే ఆ సినిమా కోసం 40 రోజులు షూటింగ్లో పాల్గొన్నాక కెమెరా ముందు ఉండడం తనకెంతో ఇష్టమని గ్రహించానని.. అప్పుడే నటనను సీరియస్గా తీసుకున్నానని.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని.. అలా 2013లో పూర్తి స్థాయిలో సినీ రంగంలోకి అడుగుపెట్టానని ఆమె వెల్లడించింది.
ఎవరి ప్రమేయం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అన్నీ సొంతంగా నేర్చుకున్నాననంది. తొలి సినిమా చేశాక కొన్ని పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ, చదువు కోసం వాటిని వదులుకున్నట్లు ఆమె చెప్పింది. కారు కోసం రకుల్ చేసిన కన్నడ సినిమా పేరు.. గిల్లి. తర్వాత ఆమె 2013లో ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది.
This post was last modified on July 26, 2026 11:16 am
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…