Political News

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి పార్టీలు కలిసి కట్టుగా వైసీపీకి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించాయి. దీనిపై సుదీర్ఘంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో పార్టీలు మంతనాలు చేశాయి. ప్రధానంగా వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో అడ్డుకునేందుకు సిద్ధమయ్యాయి. వాస్తవానికి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి.

ప్రభుత్వం చేయాల్సిన, చేపట్టాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అయినా వాటిని సైతం పక్కన పెట్టి ప్రభుత్వం ఈ లడ్డూ లడాయినే భుజాన వేసుకుంది. వాస్తవానికి రెండు రోజుల కిందట కేబినెట్ సమావేశం నిర్వహించారు. దీనిలో చర్చించేందుకు 22 ప్రధాన అంశాల అజెండాను నిర్ణయించుకున్నారు. అయితే వాటిని కూడా పక్కన పెట్టేసి పూర్తిగా కేబినెట్లో శ్రీవారి లడ్డూ ప్రసాదంపైనే చర్చించుకున్నారు. ఈ పరిణామం గతంలో ఎప్పుడూ జరగలేదు.

పైగా ఎంతో ఇంపార్టెంట్ అనుకున్న అమరావతి, పోలవరం పనులపై చర్చించాలని ముందుగా నిర్ణయించుకున్న ప్రభుత్వం వాటిని కూడా పక్కన పెట్టేసింది. వైసీపీ నాయకులు లేవనెత్తుతున్న లడ్డూ అంశానికి సీబీఐ ఇచ్చిన నివేదిక, కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్‌కే పరిమితం అయింది. ఈ పరిణామాలను గమనిస్తే వైసీపీ కోరుకున్నదే జరిగిందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పాలనను ప్రతిష్ఠంభన చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న వ్యూహం వైసీపీలో ఎప్పటి నుంచో ఉంది.

ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పదే పదే చెబుతున్నారు. పాలనను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా పార్టీల నాయకులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ అనూహ్యంగా అధిష్టానాల పెద్దలే వైసీపీ ట్రాప్‌లో చిక్కుకున్నట్టుగా కనిపిస్తోంది. లేకపోతే మూడు రోజులుగా కేవలం లడ్డూ చుట్టూ ప్రభుత్వం చక్కర్లు కొట్టడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంలో తప్పులేదు. కానీ ఇదే పనిగా పవన్, చంద్రబాబు భేటీ కావడం, మరోవైపు మూడు పార్టీల నేతలు భేటీ కావడం వంటివి పాలనపై ప్రభావం చూపుతున్నాయన్నది పరిశీలకులు చెబుతున్న మాట.

This post was last modified on February 5, 2026 10:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

10 minutes ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

1 hour ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

2 hours ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

4 hours ago

తమిళంలో అదరగొట్టిన చంద్రబాబు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…

4 hours ago

ధనుష్ కూడా ఇలా చేస్తే ఎలా?

పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్‌గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…

10 hours ago