Political News

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి పార్టీలు కలిసి కట్టుగా వైసీపీకి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించాయి. దీనిపై సుదీర్ఘంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో పార్టీలు మంతనాలు చేశాయి. ప్రధానంగా వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో అడ్డుకునేందుకు సిద్ధమయ్యాయి. వాస్తవానికి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి.

ప్రభుత్వం చేయాల్సిన, చేపట్టాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అయినా వాటిని సైతం పక్కన పెట్టి ప్రభుత్వం ఈ లడ్డూ లడాయినే భుజాన వేసుకుంది. వాస్తవానికి రెండు రోజుల కిందట కేబినెట్ సమావేశం నిర్వహించారు. దీనిలో చర్చించేందుకు 22 ప్రధాన అంశాల అజెండాను నిర్ణయించుకున్నారు. అయితే వాటిని కూడా పక్కన పెట్టేసి పూర్తిగా కేబినెట్లో శ్రీవారి లడ్డూ ప్రసాదంపైనే చర్చించుకున్నారు. ఈ పరిణామం గతంలో ఎప్పుడూ జరగలేదు.

పైగా ఎంతో ఇంపార్టెంట్ అనుకున్న అమరావతి, పోలవరం పనులపై చర్చించాలని ముందుగా నిర్ణయించుకున్న ప్రభుత్వం వాటిని కూడా పక్కన పెట్టేసింది. వైసీపీ నాయకులు లేవనెత్తుతున్న లడ్డూ అంశానికి సీబీఐ ఇచ్చిన నివేదిక, కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్‌కే పరిమితం అయింది. ఈ పరిణామాలను గమనిస్తే వైసీపీ కోరుకున్నదే జరిగిందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పాలనను ప్రతిష్ఠంభన చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న వ్యూహం వైసీపీలో ఎప్పటి నుంచో ఉంది.

ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పదే పదే చెబుతున్నారు. పాలనను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా పార్టీల నాయకులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ అనూహ్యంగా అధిష్టానాల పెద్దలే వైసీపీ ట్రాప్‌లో చిక్కుకున్నట్టుగా కనిపిస్తోంది. లేకపోతే మూడు రోజులుగా కేవలం లడ్డూ చుట్టూ ప్రభుత్వం చక్కర్లు కొట్టడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంలో తప్పులేదు. కానీ ఇదే పనిగా పవన్, చంద్రబాబు భేటీ కావడం, మరోవైపు మూడు పార్టీల నేతలు భేటీ కావడం వంటివి పాలనపై ప్రభావం చూపుతున్నాయన్నది పరిశీలకులు చెబుతున్న మాట.

This post was last modified on February 5, 2026 10:04 pm

Share

Recent Posts

మాధ‌వ‌న్ గుండెలు గుబేల్‌

విజ‌య్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జ‌రిగినా ప‌రిస్థితి…

4 minutes ago

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

2 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

4 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

5 hours ago

దేవిలో ఇది గొప్ప లక్షణం

టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…

7 hours ago