తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు కోర్టుకు సమర్పించింది. అయితే.. ఈ నివేదికలో పలు విషయాలను విస్మరించారన్నది కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఆరోపణ. అసలు దోషులను విస్మరించారని.. కేవలం అధికారులపైనే నివేదిక ఆరోపణలు చేసిందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు దోషుల వ్యవహారాన్ని కూడా తేల్చి తిరుమల పవిత్రతను కాపాడాల్సి ఉందని ఆయన చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఏక సభ్య కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా జరిగిన కూటమి నేతల కీలక సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం.. ఈ వ్యవహారంపై పలు విషయాలను సీఎం చంద్రబాబుతో పంచుకున్నారు. దీనిలో ప్రధానంగా ఏకసభ్య కమిషన్ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇక, ఈ కమిషన్ ద్వారా వాస్తవాలను మరింత లోతుగా విచారించనున్నారు. తద్వారా దోషులను తేల్చనున్నారు. ఎంతటివారినైనా చట్టం ముందు నిలబెట్టనున్నారు.
ఇవీ తేలే విషయాలు..
+ 2022లోనే కల్తీ నెయ్యిపై సీఎఫ్టీఆర్ఐ నివేదిక వచ్చినా.. ఎందుకు తొక్కి పెట్టారు?
+ ఎవరి ఆదేశాలతో ఆనాడు నివేదికను విస్మరించారు.
+ నెయ్యి ద్వారా చేతులు మారిన సొమ్ము ఎంత?
+ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది ఎంత? ఏమేరకు కల్తీ చేశారు?
+ వైసీపీ హయాంలో ఎన్నాళ్లు ఇలా జరిగింది? దీని వెనుక ఎవరి పాత్ర ఏంటి?
+ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను మరింత కూలంకషంగా విచారణ చేయనున్నారు.
+ ఎన్డీడీబీ(నేషనల్ డెయిరీ డెవలప్మెంటు బోర్డు) నివేదికలో వెల్లడించిన వాస్తవాలపై మరింత అధ్యయనం.
+ దోషులు ఎంతటి వారైనా వారిని చట్టం ముందు నిలబెట్టడం.
This post was last modified on February 5, 2026 10:11 pm
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…