సినీ రంగంలోకి కాస్త పేరు తెచ్చుకున్న ఎవ్వరైనా.. మళ్లీ జన్మంటూ ఉంటే ఇలా పుట్టాలని కోరుకోను అన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా దర్శకుడిగా గొప్ప విజయాలు అందుకున్న వ్యక్తి ఈ మాట అనడం ఇంకా షాకింగ్. సొగసు చూడతరమా, బాల రామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు లాంటి మరపురాని సినిమాలు తీసిన గుణశేఖర్ ఈ మాట అన్నాడు.
మళ్లీ జన్మంటూ ఉంటే దర్శకుడిగా పుట్టను అని వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతగా ఆయనకు ఏం విరక్తి వచ్చిందనే ప్రశ్న తలెత్తింది. ఆ కామెంట్ మీద గుణశేఖర్ తాజాగా వివరణ ఇచ్చాడు. ఇది విమర్శల వల్లో, నష్టాల వల్లో చేసిన కామెంట్ కాదని చెప్పాడు గుణ.
‘‘ట్రోలింగ్ అన్నది సమస్య కాదు. అది ఎప్పుడూ ఉంటుంది. ఓ దర్శకుడు పడే ఒత్తిడి గురించి చెబుతూ ఆ మాట అన్నాను. దర్శకుడి కుర్చీలో కూర్చున్న ఎవ్వరికైనా ఒత్తిడి తప్పదు. ఏ పనిలో అయినా సంతృప్తి ఉంటుంది కానీ.. దర్శకులకు ఉండదని నా అభిప్రాయం. తృప్తి ఉంటే కంటి నిండా నిద్ర పడుతుంది. అలాంటి నిద్రను నేను 1992లో వదిలేశాను.
ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నా. వచ్చే జన్మలో అయినా హాయిగా నిద్ర పోవాలనే ఉద్దేశంతో మళ్లీ డైరెక్టర్గా పుట్టను అని అన్నాను’’ అని గుణశేఖర్ వివరించాడు. చాన్నాళ్లుగా గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. ‘రుద్రమదేవి’తో ఆయన చేసిన సాహసం ఫలితాన్నిచ్చింది కానీ.. ‘శాకుంతలం’ దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఆయన స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘యుఫోరియా’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భూమిక, సారా అర్జున్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.
This post was last modified on February 6, 2026 10:13 am
‘జాతిరత్నాలు’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యువ దర్శకుడు అనుదీప్. అందులో అతను పండించిన కొత్త రకం కామెడీకి ఈ…
ఎప్స్టీన్ ఫైల్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మాట. ఎప్స్టీన్ అనే అమెరికన్ వ్యాపారవేత్త.. తాను ఇచ్చే ప్రైవేట్ పార్టీలకు ఎంతోమంది…
తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని కమిటీలను నియమించింది. మరో…
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి…
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…