Political News

లడ్డూ విషయం పక్క దారి పట్టేసిందా

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారగా, ఈ వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలో ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన నివేదిక తర్వాత మరింతగా రాజకీయ కాక పెరిగింది. నివేదికకు ముందు, తర్వాత రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమ తప్పులేదని వైసీపీ, కాదు తప్పు చేసిందే ఆ పార్టీ అని పెద్ద ఎత్తున వివాదం ముసురుకుంది.

ఇది అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల అనంతరం దాడుల వరకు దారి తీసింది. తాజాగా టీడీపీ నేతలపైనా కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. హైకోర్టులో వేసిన పిటిషన్ దరిమిలా అంబటి కుటుంబానికి భద్రత కల్పించడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త రామచంద్రరావు సహా 31 మంది టీడీపీ నాయకులపై కేసులు పెట్టారు. ఇదిలావుంటే వైసీపీ మరింత దూకుడుగా ఉద్యమించేందుకు రెడీ అయింది.

దీనిని ఎదుర్కొనేందుకు, ఎదురు దాడి చేసేందుకు ప్రభుత్వ పక్షాలు కూడా సిద్ధమయ్యాయి. వాస్తవానికి సిట్ ఇచ్చిన నివేదికలో ఏముందన్నది ఇంకా అధికారికంగా బయటకు రావాల్సి ఉంది. అదే సమయంలో దీనిపై కోర్టు విచారణలు కూడా కొనసాగాల్సి ఉన్నాయి. ఇంత జరగాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే ఇది రాజకీయ హీట్ పెంచడం, దాడులకు, కేసులకు దారి తీయడం ఏమేరకు సమంజసం అన్నది ప్రధాన అంశం. పైగా శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారన్నది ప్రశ్న.

భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారంపై రాజకీయాలు ఆపితేనే ఈ వివాదం ఒక కొలిక్కి వస్తుంది. లేకపోతే ఇదే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతుందని, ఫలితంగా ప్రజల్లో చులకన అవుతారని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు విషయాన్ని విషయంగా చూడకుండా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ వివాదానికి తెరదించుతారో లేదో చూడాలి.

This post was last modified on February 4, 2026 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేరళ – తెలంగాణ మధ్య నిప్పు రాజుకుంది

కేర‌ళ రాష్ట్రంలో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫు స్టార్ క్యాంపెయిన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…

18 minutes ago

రొటీన్ ‘లీడర్’తో ఏం సాధించారు

2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…

44 minutes ago

వీరభద్రుడా… మంచి పని చేశావ్ !

తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…

1 hour ago

అగ్నికి ఆజ్యం పోసిన అంబటి

ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…

2 hours ago

సింపుల్ కథలు వద్దంటున్న సుప్రీమ్ హీరో

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…

3 hours ago

ఈ విషయంలో రాజశేఖర్ సూపర్

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి సూపర్ హిట్స్ తో తొంభై దశకంలో మంచి…

4 hours ago