Political News

లడ్డూ విషయం పక్క దారి పట్టేసిందా

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారగా, ఈ వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలో ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన నివేదిక తర్వాత మరింతగా రాజకీయ కాక పెరిగింది. నివేదికకు ముందు, తర్వాత రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమ తప్పులేదని వైసీపీ, కాదు తప్పు చేసిందే ఆ పార్టీ అని పెద్ద ఎత్తున వివాదం ముసురుకుంది.

ఇది అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల అనంతరం దాడుల వరకు దారి తీసింది. తాజాగా టీడీపీ నేతలపైనా కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. హైకోర్టులో వేసిన పిటిషన్ దరిమిలా అంబటి కుటుంబానికి భద్రత కల్పించడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త రామచంద్రరావు సహా 31 మంది టీడీపీ నాయకులపై కేసులు పెట్టారు. ఇదిలావుంటే వైసీపీ మరింత దూకుడుగా ఉద్యమించేందుకు రెడీ అయింది.

దీనిని ఎదుర్కొనేందుకు, ఎదురు దాడి చేసేందుకు ప్రభుత్వ పక్షాలు కూడా సిద్ధమయ్యాయి. వాస్తవానికి సిట్ ఇచ్చిన నివేదికలో ఏముందన్నది ఇంకా అధికారికంగా బయటకు రావాల్సి ఉంది. అదే సమయంలో దీనిపై కోర్టు విచారణలు కూడా కొనసాగాల్సి ఉన్నాయి. ఇంత జరగాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే ఇది రాజకీయ హీట్ పెంచడం, దాడులకు, కేసులకు దారి తీయడం ఏమేరకు సమంజసం అన్నది ప్రధాన అంశం. పైగా శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారన్నది ప్రశ్న.

భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారంపై రాజకీయాలు ఆపితేనే ఈ వివాదం ఒక కొలిక్కి వస్తుంది. లేకపోతే ఇదే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతుందని, ఫలితంగా ప్రజల్లో చులకన అవుతారని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు విషయాన్ని విషయంగా చూడకుండా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ వివాదానికి తెరదించుతారో లేదో చూడాలి.

This post was last modified on February 4, 2026 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కెమెరామెన్ పేల్చిన ‘విశ్వంభర’ బాంబులు

విపరీతమైన ఆలస్యానికి గురై, అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన విశ్వంభర విడుదల తేదీ ఇప్పటికీ ఖరారు కాలేదు. రెండు సంక్రాంతులు…

20 minutes ago

దానంకు స్పీకర్ క్లీన్ చిట్… కరెక్టేనా?

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…

3 hours ago

మహేష్ అభిమానులకు హరీష్ సారి

సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…

4 hours ago

కొత్త శుక్రవారం గంగార్పణం అవుతోంది

థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…

4 hours ago

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

8 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

10 hours ago