తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై ఇప్పటికే సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సిట్ కొన్నిఅంశాలను పట్టించుకోకుండానే.. అసలు నేరస్తులను సరైన విధంగా విచారణ చేయకుండానే నివేదిక ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి.. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై సమగ్ర విచారణ చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలకు మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
వాస్తవానికి మంత్రి వర్గ సమావేశంలో అనేక అంశాలపై చర్చించాలని భావించినా.. తొలుత సుదీర్ఘంగా లడ్డూ కల్తీ నెయ్యి వినియోగంపై చర్చించారు. గతంలోనే లడ్డూ కల్తీ నెయ్యిపై నివేదిక వచ్చిందని..దీనిని అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని.. దీని వెనుక చాలా వ్యూహాత్మక కోణంతోపాటు.. నేరస్తులను తప్పించే లక్ష్యం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
ప్రధానంగా.. ఎన్డీడీబీ(నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) ఇచ్చిన నివేదిక ప్రకారం.. ప్రస్తుతం విచారణ ముగించిన సీబీఐ సిట్.. ఒక్క అంశాన్నీ పరిగణనలోకి తీసుకోలేదని మంత్రి వర్గం అభిప్రాయపడింది.
దీనికి తోడు 2022లో వచ్చిన సీఎఫ్టీఆర్(జంతువుల కోవ్వు పదార్థాలను పరీక్షించే) నివేదికను కూడా వైసీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే పక్కన పెట్టిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎఫ్టీఆర్, ఎన్డీడీబీ నివేదికల ఆధారంగా కొత్తగా కమిషన్ వేసి.. దాని ద్వారా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యిపై విచారణ చేయించాలని మంత్రి వర్గం నిర్ణయించినట్టు మంత్రులు.. పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
దీనిని చాలా సీరియస్గా తీసుకుంటున్నామని.. అలాగని తమకు రాజకీయ కక్ష సాధింపు ఏమీ లేదని.. శ్రీవారి లడ్డూ పవిత్రతతను కాపాడడమే తమ లక్ష్యమని మంత్రులు వివరించారు.
ఇక, గతంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి వర్గంలో చర్చించినట్టు తెలిపారు. ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిన అంశాలను అధ్యయనం చేసిన తర్వాతే .. చంద్రబాబు వ్యాఖ్యానించారని తెలిపారు. ఇప్పుడు దీనిపై సమగ్ర విచారణ చేయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
వాస్తవాలను ఎవరు మరుగు పరిచినా.. ఎవరు దానిని వెనుకేసుకు వచ్చినా.. నేరస్తులే అవుతారని పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు సీబీఐ ఇచ్చిన నివేదిక నెల్లూరు కోర్టులో విచారణ పరిధిలో ఉండగా.. తాజాగా మరో కమిషన్ చేయొచ్చా.. అనే ప్రశ్నకు.. దానికి.. దీనికి సంబంధం లేదని మంత్రులు బదులిచ్చారు.
This post was last modified on February 3, 2026 7:32 pm
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…