ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా బిల్లు ప్రవేశపెట్టబోతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాలకు ముందు నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన సందర్భంగా మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని, అమరావతికి మద్దతిచ్చిందని తెలిపారు. అయితే, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నామని చెప్పారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేసే విధంగా బిల్లులో అంశాలుండాలని డిమాండ్ చేశారు.
రైతులకు న్యాయం జరగలేదని, రామారావు అనే రైతు ఆవేదన చెందుతూ చనిపోయారని, వారి తరఫున పార్లమెంటులో మాట్లాడతామని అన్నారు. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా అన్ని అంశాలు లేేవనెత్తాలని వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారని, అందుకు అనుగుణంగా వైసీపీ ఎంపీలు పోరాడతారని తెలిపారు.
7 నెలలుగా జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం నిధులు పెండిగ్ లో ఉన్నాయని గత పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ లేవనెత్తిందని, ఆ తర్వాతే నిధులు విడుదలయ్యాయని గుర్తు చేశారు.
This post was last modified on January 27, 2026 7:16 pm
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…