ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా బిల్లు ప్రవేశపెట్టబోతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాలకు ముందు నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన సందర్భంగా మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని, అమరావతికి మద్దతిచ్చిందని తెలిపారు. అయితే, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నామని చెప్పారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేసే విధంగా బిల్లులో అంశాలుండాలని డిమాండ్ చేశారు.
రైతులకు న్యాయం జరగలేదని, రామారావు అనే రైతు ఆవేదన చెందుతూ చనిపోయారని, వారి తరఫున పార్లమెంటులో మాట్లాడతామని అన్నారు. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా అన్ని అంశాలు లేేవనెత్తాలని వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారని, అందుకు అనుగుణంగా వైసీపీ ఎంపీలు పోరాడతారని తెలిపారు.
7 నెలలుగా జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం నిధులు పెండిగ్ లో ఉన్నాయని గత పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ లేవనెత్తిందని, ఆ తర్వాతే నిధులు విడుదలయ్యాయని గుర్తు చేశారు.
This post was last modified on January 27, 2026 7:16 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…