Political News

ఏపీలో 40 సంస్థలు ఏర్పాటు: బాబుకు దుబాయ్ హామీ

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు బలమైన హామీ లభించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ ముందుకు వచ్చింది. తాజాగా దుబాయ్ ఆర్థిక శాఖ మంత్రి అల్ మార్రీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, దుబాయ్‌ల మధ్య ఉన్న ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై ఇరువురు చర్చించారు.

ముఖ్యంగా ఇరు ప్రాంతాల మధ్య ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సహకరించాలని చంద్రబాబు చేసిన సూచనలను అల్ మార్రీ స్వాగతించారు. ఆహార తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తమ దేశానికి చెందిన 40కి పైగా కంపెనీలు ఏపీలో బ్రాంచ్‌లు ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని, వాటిని ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఇతర రంగాల్లోనూ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరించారు.

ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబు దుబాయ్ మంత్రికి వివరించారు. ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్‌కు ఏపీ కేంద్రంగా మారుతుందని తెలిపారు. అదే సమయంలో సెమీకండక్టర్ రంగానికి కూడా ప్రధాన వేదిక అవుతుందని చెప్పారు. పునరుత్పాదక ఇంధన వనరులు, పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల రంగాల్లో కూడా పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

నైపుణ్యం కలిగిన యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారిని సమర్థంగా వినియోగించుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారికి సింగిల్ విండో విధానంలో నేరుగా అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. భూములు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని వివరించారు.

దీనిపై సంతోషం వ్యక్తం చేసిన దుబాయ్ ఆర్థిక మంత్రి, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తి సంసిద్ధత వ్యక్తం చేశారు.

This post was last modified on January 20, 2026 10:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

7 minutes ago

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

40 minutes ago

హౌస్ ఫుల్, బ్లాక్ బస్టర్ అంతా ఉత్తిదేనా?

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…

1 hour ago

ర్యాలీ పేరుతో అంబటి హడావిడి

రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…

1 hour ago

దురంధర్-2 వాయిదా పడితే..?

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…

2 hours ago

మళ్లీ థియేటర్ల హాహాకారాలు

గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…

3 hours ago