స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు బలమైన హామీ లభించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ ముందుకు వచ్చింది. తాజాగా దుబాయ్ ఆర్థిక శాఖ మంత్రి అల్ మార్రీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, దుబాయ్ల మధ్య ఉన్న ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై ఇరువురు చర్చించారు.
ముఖ్యంగా ఇరు ప్రాంతాల మధ్య ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సహకరించాలని చంద్రబాబు చేసిన సూచనలను అల్ మార్రీ స్వాగతించారు. ఆహార తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తమ దేశానికి చెందిన 40కి పైగా కంపెనీలు ఏపీలో బ్రాంచ్లు ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని, వాటిని ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఇతర రంగాల్లోనూ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరించారు.
ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబు దుబాయ్ మంత్రికి వివరించారు. ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్కు ఏపీ కేంద్రంగా మారుతుందని తెలిపారు. అదే సమయంలో సెమీకండక్టర్ రంగానికి కూడా ప్రధాన వేదిక అవుతుందని చెప్పారు. పునరుత్పాదక ఇంధన వనరులు, పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల రంగాల్లో కూడా పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
నైపుణ్యం కలిగిన యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారిని సమర్థంగా వినియోగించుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారికి సింగిల్ విండో విధానంలో నేరుగా అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. భూములు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని వివరించారు.
దీనిపై సంతోషం వ్యక్తం చేసిన దుబాయ్ ఆర్థిక మంత్రి, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తి సంసిద్ధత వ్యక్తం చేశారు.
This post was last modified on January 20, 2026 10:20 pm
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…