ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు సందర్భాల్లో మోడీ.. పవన్ కల్యాణ్ను ప్రశంసించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మ దీక్ష చేపట్టినప్పుడు.. పల్లె పండుగ ప్రారంభించి.. పల్లెల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు కూడా మోడీ పవన్ కల్యాణ్ను ప్రశంసించారు. ముఖ్యంగా కర్నూలులో నిర్వహించిన జీఎస్టీ బచత్ ఉత్సవం వేడుకల్లో మరింతగా పొగడ్తల వర్షం కురిపించారు.
తాజాగా మరోసారి ప్రధాని నుంచి పవన్ కల్యాణ్కు ప్రశంసలు లభించాయి. ఇటీవల పవన్ కల్యాణ్.. జపనీస్ కత్తి సాము.. కెంజుట్స్లోకి ప్రవేశం పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో `టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్` బిరుదు కూడా పొందారు. ముఖ్యంగా.. ప్రాచీన కత్తిసాములో పవన్ కల్యాణ్ ప్రవేశ పొంది.. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ను కూడా సొంతం చేసుకున్నారు. ఇలా.. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు పొందిన ఏకైక తెలుగు వ్యక్తి పవన్ కల్యాణే కావడం విశేషం.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా.. పవన్ కల్యాణ్ను అభినందించారు. కెంజుట్సులో ప్రవేశం పొందడం అరుదైన ఘనతగా ఆయన పేర్కొన్నారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్(యుద్ధ విద్య)లో పవన్ కల్యాణ్ మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు.
మూడు దశాబ్దాలుగా పవన్ సాధన చేస్తున్నారని తెలిసి తాను ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. పవన్ కల్యాణ్ నేటి యువతకు అద్భుత సందేశం ఇచ్చారని కొనియాడారు. పవన్ కల్యాణ్.. తన రికార్డుతోపాటు కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న `ఫిట్ ఇండియా`కు కూడా స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
`పవన్ జీ.. యూఆర్ భేష్` అంటూ.. ప్రధాని కొనియాడారు. పవన్ కల్యాణ్ ఇటు నటన పరంగాను.. అటు రాజకీయాల్లోనూ.. మరోవైపు మార్షల్ ఆర్ట్స్లోనూ రాణించడం.. గర్వించదగిన విషయమని ప్రధాని పేర్కొ న్నారు. కాగా.. తనను అభినందించిన ప్రధానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
This post was last modified on January 14, 2026 10:11 am
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…
తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…
విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…