ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు సందర్భాల్లో మోడీ.. పవన్ కల్యాణ్ను ప్రశంసించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మ దీక్ష చేపట్టినప్పుడు.. పల్లె పండుగ ప్రారంభించి.. పల్లెల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు కూడా మోడీ పవన్ కల్యాణ్ను ప్రశంసించారు. ముఖ్యంగా కర్నూలులో నిర్వహించిన జీఎస్టీ బచత్ ఉత్సవం వేడుకల్లో మరింతగా పొగడ్తల వర్షం కురిపించారు.
తాజాగా మరోసారి ప్రధాని నుంచి పవన్ కల్యాణ్కు ప్రశంసలు లభించాయి. ఇటీవల పవన్ కల్యాణ్.. జపనీస్ కత్తి సాము.. కెంజుట్స్లోకి ప్రవేశం పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో `టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్` బిరుదు కూడా పొందారు. ముఖ్యంగా.. ప్రాచీన కత్తిసాములో పవన్ కల్యాణ్ ప్రవేశ పొంది.. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ను కూడా సొంతం చేసుకున్నారు. ఇలా.. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు పొందిన ఏకైక తెలుగు వ్యక్తి పవన్ కల్యాణే కావడం విశేషం.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా.. పవన్ కల్యాణ్ను అభినందించారు. కెంజుట్సులో ప్రవేశం పొందడం అరుదైన ఘనతగా ఆయన పేర్కొన్నారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్(యుద్ధ విద్య)లో పవన్ కల్యాణ్ మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు.
మూడు దశాబ్దాలుగా పవన్ సాధన చేస్తున్నారని తెలిసి తాను ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. పవన్ కల్యాణ్ నేటి యువతకు అద్భుత సందేశం ఇచ్చారని కొనియాడారు. పవన్ కల్యాణ్.. తన రికార్డుతోపాటు కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న `ఫిట్ ఇండియా`కు కూడా స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
`పవన్ జీ.. యూఆర్ భేష్` అంటూ.. ప్రధాని కొనియాడారు. పవన్ కల్యాణ్ ఇటు నటన పరంగాను.. అటు రాజకీయాల్లోనూ.. మరోవైపు మార్షల్ ఆర్ట్స్లోనూ రాణించడం.. గర్వించదగిన విషయమని ప్రధాని పేర్కొ న్నారు. కాగా.. తనను అభినందించిన ప్రధానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
This post was last modified on January 14, 2026 10:11 am
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…