ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు సందర్భాల్లో మోడీ.. పవన్ కల్యాణ్ను ప్రశంసించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మ దీక్ష చేపట్టినప్పుడు.. పల్లె పండుగ ప్రారంభించి.. పల్లెల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు కూడా మోడీ పవన్ కల్యాణ్ను ప్రశంసించారు. ముఖ్యంగా కర్నూలులో నిర్వహించిన జీఎస్టీ బచత్ ఉత్సవం వేడుకల్లో మరింతగా పొగడ్తల వర్షం కురిపించారు.
తాజాగా మరోసారి ప్రధాని నుంచి పవన్ కల్యాణ్కు ప్రశంసలు లభించాయి. ఇటీవల పవన్ కల్యాణ్.. జపనీస్ కత్తి సాము.. కెంజుట్స్లోకి ప్రవేశం పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో `టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్` బిరుదు కూడా పొందారు. ముఖ్యంగా.. ప్రాచీన కత్తిసాములో పవన్ కల్యాణ్ ప్రవేశ పొంది.. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ను కూడా సొంతం చేసుకున్నారు. ఇలా.. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు పొందిన ఏకైక తెలుగు వ్యక్తి పవన్ కల్యాణే కావడం విశేషం.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా.. పవన్ కల్యాణ్ను అభినందించారు. కెంజుట్సులో ప్రవేశం పొందడం అరుదైన ఘనతగా ఆయన పేర్కొన్నారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్(యుద్ధ విద్య)లో పవన్ కల్యాణ్ మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు.
మూడు దశాబ్దాలుగా పవన్ సాధన చేస్తున్నారని తెలిసి తాను ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. పవన్ కల్యాణ్ నేటి యువతకు అద్భుత సందేశం ఇచ్చారని కొనియాడారు. పవన్ కల్యాణ్.. తన రికార్డుతోపాటు కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న `ఫిట్ ఇండియా`కు కూడా స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
`పవన్ జీ.. యూఆర్ భేష్` అంటూ.. ప్రధాని కొనియాడారు. పవన్ కల్యాణ్ ఇటు నటన పరంగాను.. అటు రాజకీయాల్లోనూ.. మరోవైపు మార్షల్ ఆర్ట్స్లోనూ రాణించడం.. గర్వించదగిన విషయమని ప్రధాని పేర్కొ న్నారు. కాగా.. తనను అభినందించిన ప్రధానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…