నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాలు సహా.. ఉమ్మడి కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కోడి పందేల జోరు పెరిగింది. అయితే.. ఒకప్పుడు కేవలం ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితం అయిన కోడి పందేలు.. ఇప్పుడు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణా, గుంటూరు, తాజాగా నెల్లూరు జిల్లాలకు కూడా ఈ పందేలు పాకడం విశేషం.
ఇదిలావుంటే.. తాజాగా జరుగుతున్న పందేల్లో వైసీపీ నాయకులు, టీడీపీ నేతలు.. మంత్రులు కూడా జోడీ కట్టడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. దీనికి వారు సంప్రదాయాలు అనే ముద్దు పేరు పెట్టడం మరో విశేషం. అంతేకాదు.. కలసి కట్టుగా బరులు వేశారు. పందెల్లో ఎలాంటి పోలీసులు, రెవెన్యూ ఇబ్బందులు రాకుండా.. సమష్టిగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇలా.. నాయకులు కలిసిపోవడం గమనార్హం.
వాస్తవానికి గతంలోనూ నాయకులు కలసి ముందుకు సాగినా.. ఈ ఏడాది ఉన్నట్టుగా అయితే.. గతంలో వాతావరణం కనిపించలేదు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేవారు. పోలీసులకు ఉప్పందించేవారు. కానీ.. ఈ సారి మాత్రం ఉమ్మడిగా బరులు నిర్వహిస్తున్నారు. ప్రతి విషయాన్నీ చక్కగా పంచుకుంటున్నారు. అంతేకాదు.. కలసి కట్టుగా కలివిడిగా ముందుకు సాగుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ తరహా సామరస్యం అందరికీ తెలిసిందే.
కానీ ఉమ్మడికృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా.. నిన్నటి వరకు రాజకీయ విమర్శలు చేసుకున్న నాయకులు తాజాగా కలిసిపోయారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన వారిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయాలను కాపాడుకునేందుకు కలిస్తే తప్పేంటని.. ఇరు పార్టీల నాయకులు ప్రశ్నించడం కొసమెరుపు. మొత్తంగా.. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ.. నాయకులు ఈ దఫా కలిసి కట్టుగా ముందుకు సాగడం.. పందేలకు సిద్ధం కావడం.. అందరనీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
This post was last modified on January 13, 2026 5:42 pm
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…