Political News

సంక్రాంతి వేళ అయినా… సమస్యలపై సీఎం అలర్ట్

సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన బిజీ షెడ్యూల్లో గడపనున్నారు. బంధుమిత్రులు, తనను ఎన్నుకున్న ప్రజలతో మమేకం కానున్నారు. ఈ సమయంలోనూ ఆయన రాష్ట్రంలోని ప్రజల సమస్యలపై చాలా అలెర్ట్గా ఉన్నారు.

పండుగ వేళలో గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో 38 తాటాకు ఇళ్లు కాలిపోయాయి. దీనిపై చంద్రబాబు నాయుడు సత్వరం స్పందించారు. కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో అగ్నిప్రమాదంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.

సంక్రాంతి పండుగ సమయంలో సార్లంకపల్లెలో అగ్ని ప్రమాదం పెను విషాదం తెచ్చిందని సీఎం విచారం వ్యక్తం చేశారు. ఊరిలో ఉన్న మొత్తం 38 తాటాకు ఇళ్లు కాలిపోయిన ఘటనలో బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని హోం మంత్రి అనిత, ఇతర అధికారులు వివరించారు.

ఏపీలో ఏమూల చిన్న సంఘటన జరిగినా తాను అప్రమత్తం అవడమే కాకుండా మంత్రులను, అధికారులను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటారు. మొన్నటికి మొన్న విశాఖ జగదాంబ సెంటర్లో మహిళపై దాడి ఘటనపై సీఎం వెంటనే స్పందించారు. ఈ దాడి కేసును ఛేదించిన పోలీసులను ప్రశంసించారు.

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజల సమస్యలపై స్పందిస్తున్న తీరును చూసిన అధికారులు, మంత్రులు సైతం తమ నియోజకవర్గంలో జరుగుతున్న ఘటలపై అప్రమత్తంగానే ఉంటున్నారు. ముఖ్యంగా ప్రకృతి విపత్తుల సమయంలో కూటమి నేతలు స్పందిస్తున్న తీరు ప్రజల నమ్మకాన్ని చూరగొంటున్నాయనడంలో సందేహం లేదు.

This post was last modified on January 13, 2026 11:03 am

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

1 hour ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

2 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

3 hours ago

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

8 hours ago

జ‌మిలికి జై కొట్టాలా?.. కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం!

దేశంలో రెండు కీల‌క అంశాల‌ను తేల్చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారు సిద్ధ‌మైంది. 1) జ‌మిలి ఎన్నిక‌లు. 2) పార్ల‌మెంటు…

12 hours ago