2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రతి పైసాను ఆచితూచి ఖర్చు చేయాలని చూస్తున్నారు. పన్నుల తగ్గింపు వల్ల వచ్చే ఆదాయంలో కొంత లోటు కనిపిస్తున్నా ఆర్థిక క్రమశిక్షణను కాపాడుకుంటూ వృద్ధిని ఎలా పెంచుతారనేదే ఇక్కడ మెయిన్ పాయింట్.
ప్రస్తుత పరిస్థితుల్లో పన్నుల వసూళ్లు అనుకున్నంత స్పీడ్ గా లేవు. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో ఆర్థిక లోటు సుమారు రూ.9.76 లక్షల కోట్లుగా ఉంది.. ఇది ఏడాది టార్గెట్ లో 62.3 శాతానికి సమానం. జీడీపీ వృద్ధి రేటు కొంత నెమ్మదించడం వల్ల కంపెనీల లాభాలు తగ్గి అది నేరుగా పన్నుల వసూళ్లపై ప్రభావం చూపుతోంది. దీనివల్ల దాదాపు 50,000 కోట్ల ఆదాయం తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇలాంటి టైమ్ లో ఆర్బీఐ నుంచి వచ్చే డివిడెండ్ ప్రభుత్వానికి ఒక పెద్ద రిలీఫ్ ఇస్తోంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గినా ఆర్బీఐ ఇచ్చే 2.69 లక్షల కోట్ల లాభాలు బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి హెల్ప్ అవుతున్నాయి. ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ వల్ల ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక రకంగా ఖజానాకు ఆక్సిజన్ లాంటిదని చెప్పవచ్చు.
అప్పుల విషయంలో కూడా ప్రభుత్వం చాలా ప్లానింగ్ తో ఉంది. మార్కెట్ నుంచి చేసే అప్పులను 14.5 లక్షల కోట్లకే పరిమితం చేయాలని చూస్తున్నారు. ఒకవేళ అప్పులు 15 లక్షల కోట్లు దాటితే ప్రైవేట్ ఇన్వెస్టర్లకు ఇబ్బందిగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఆర్థిక లోటును 4.0 శాతం నుండి 4.2 శాతం మధ్యలో ఉంచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదేమైనా 2026 బడ్జెట్ అనేది కేవలం అంకెల లెక్క మాత్రమే కాదు. ఇది భవిష్యత్ భారత్ కు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ లాంటిది. అనవసర ఖర్చులకు చెక్ పెడుతూ మౌలిక సదుపాయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడమే వికసిత భారత్ లక్ష్యానికి సరైన దారి అని ప్రభుత్వం భావిస్తోంది. మరి నిర్మలమ్మ తన బడ్జెట్ మ్యాజిక్ తో వృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…