Political News

షాకింగ్: `పోల‌వ‌రం పోరు`పై తెలంగాణ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. గోదావ‌రి నుంచి స‌ముద్రంలోకి వృథా పోతున్న జ‌లాల‌ను తాము వాడుకుంటామ‌ని ఏపీ చెబుతున్నా.. కేటాయింపుల‌కు మించి చుక్క నీటిని కూడావాడుకోరాద‌న్న‌ది తెలంగాణ ప్ర‌భుత్వ వాద‌న‌. ఈ నేప‌థ్యంలోనే ఇరు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి. సుప్రీంకోర్టు వ‌రకు చేరాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ స‌ర్కారు సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ వేసింది.

ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేద‌ని.. గోదావ‌రి జలాల్లో ఏపీకి కేటాయించిన 484టీఎంసీల‌కు మించి వాడుకోరాద‌ని పేర్కొంటూ.. న్యాయ పోరాటం ప్రారంభించింది. గ‌తంలోనే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య స‌యోధ్య అవ‌స‌ర‌మ‌ని.. మీడియేష‌న్ ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని గ‌త విచార‌ణ‌లో పేర్కొంది. దీనికి ఇరు ప్ర‌భుత్వం తొలుత మొగ్గు చూపినా.. త‌ర్వాత‌.. మ‌ళ్లీ న్యాయ‌పోరాటానికే ప్రాధాన్యం ఇచ్చాయి. ఈ క్ర‌మంలో సోమవారం మ‌రోసారి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్ర‌భుత్వం వేసిన పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగింది.

తొలుత తెలంగాణ త‌ర‌ఫున న్యాయ‌వాది అభిషేక్ సింఘ్వీ వాద‌న‌లు వినిపించారు. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టులో ఏకంగా మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సైతం హాజ‌రు కావ‌డం విశేషం. అయితే.. సుప్రీంకోర్టులో ఏపీ వాద‌న‌లు బ‌లంగా వినిపించ‌డంతోపాటు.. సుప్రీంకోర్టు కూడా.. సివిల్ వివాదాల రూపంంలో సూట్ వేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 131 ప్ర‌కారం.. వ్య‌వ‌హ‌రించాల‌ని పేర్కొంది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం ఈ విష‌యంలో వెనక్కి త‌గ్గి.. ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ‌లో ఉన్న రిట్ పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకుంది.

త్వ‌ర‌లోనే మ‌రో రూపంలో కోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్టు తెలంగాణ స‌ర్కారు తెలిపింది. ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి అనుమ‌తులు లేకుండా.. ప్రాజెక్టులు చేప‌డుతోంద‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందుకే వివాదం ఏర్ప‌డింద‌న్నారు. సుప్రీంకోర్టు సూచ‌న‌ల‌తో తిరిగి మ‌రో రూపంలో పిటిష‌న్ వేయ‌నున్న‌ట్టు వివ‌రించారు. అయితే.. తెలంగాణ ఎలాంటి రూపంలో ఈ విష‌యాన్ని తీసుకువెళ్లినా.. తమ‌దే విజ‌య‌మ‌ని ఏపీ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు వ్యాఖ్యానించారు.

This post was last modified on January 12, 2026 8:37 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రేక్షకులు కన్విన్స్ అవుతారా సూర్యా

నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…

18 minutes ago

ఇక్కడ మాత్రం శ్రీలీలపై రాశిదే పైచేయి

ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…

1 hour ago

ఎల‌క్ష‌న్ మూడ్‌: మోడీ మ్యానియా ఫ‌లించేనా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల మూడ్ నెల‌కొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…

2 hours ago

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

3 hours ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

4 hours ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

4 hours ago