Political News

షాకింగ్: `పోల‌వ‌రం పోరు`పై తెలంగాణ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. గోదావ‌రి నుంచి స‌ముద్రంలోకి వృథా పోతున్న జ‌లాల‌ను తాము వాడుకుంటామ‌ని ఏపీ చెబుతున్నా.. కేటాయింపుల‌కు మించి చుక్క నీటిని కూడావాడుకోరాద‌న్న‌ది తెలంగాణ ప్ర‌భుత్వ వాద‌న‌. ఈ నేప‌థ్యంలోనే ఇరు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి. సుప్రీంకోర్టు వ‌రకు చేరాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ స‌ర్కారు సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ వేసింది.

ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేద‌ని.. గోదావ‌రి జలాల్లో ఏపీకి కేటాయించిన 484టీఎంసీల‌కు మించి వాడుకోరాద‌ని పేర్కొంటూ.. న్యాయ పోరాటం ప్రారంభించింది. గ‌తంలోనే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య స‌యోధ్య అవ‌స‌ర‌మ‌ని.. మీడియేష‌న్ ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని గ‌త విచార‌ణ‌లో పేర్కొంది. దీనికి ఇరు ప్ర‌భుత్వం తొలుత మొగ్గు చూపినా.. త‌ర్వాత‌.. మ‌ళ్లీ న్యాయ‌పోరాటానికే ప్రాధాన్యం ఇచ్చాయి. ఈ క్ర‌మంలో సోమవారం మ‌రోసారి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్ర‌భుత్వం వేసిన పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగింది.

తొలుత తెలంగాణ త‌ర‌ఫున న్యాయ‌వాది అభిషేక్ సింఘ్వీ వాద‌న‌లు వినిపించారు. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టులో ఏకంగా మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సైతం హాజ‌రు కావ‌డం విశేషం. అయితే.. సుప్రీంకోర్టులో ఏపీ వాద‌న‌లు బ‌లంగా వినిపించ‌డంతోపాటు.. సుప్రీంకోర్టు కూడా.. సివిల్ వివాదాల రూపంంలో సూట్ వేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 131 ప్ర‌కారం.. వ్య‌వ‌హ‌రించాల‌ని పేర్కొంది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం ఈ విష‌యంలో వెనక్కి త‌గ్గి.. ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ‌లో ఉన్న రిట్ పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకుంది.

త్వ‌ర‌లోనే మ‌రో రూపంలో కోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్టు తెలంగాణ స‌ర్కారు తెలిపింది. ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి అనుమ‌తులు లేకుండా.. ప్రాజెక్టులు చేప‌డుతోంద‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందుకే వివాదం ఏర్ప‌డింద‌న్నారు. సుప్రీంకోర్టు సూచ‌న‌ల‌తో తిరిగి మ‌రో రూపంలో పిటిష‌న్ వేయ‌నున్న‌ట్టు వివ‌రించారు. అయితే.. తెలంగాణ ఎలాంటి రూపంలో ఈ విష‌యాన్ని తీసుకువెళ్లినా.. తమ‌దే విజ‌య‌మ‌ని ఏపీ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు వ్యాఖ్యానించారు.

This post was last modified on January 12, 2026 8:37 pm

Share

Recent Posts

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

1 hour ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

4 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

7 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

7 hours ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

7 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

8 hours ago