Political News

షాకింగ్: `పోల‌వ‌రం పోరు`పై తెలంగాణ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. గోదావ‌రి నుంచి స‌ముద్రంలోకి వృథా పోతున్న జ‌లాల‌ను తాము వాడుకుంటామ‌ని ఏపీ చెబుతున్నా.. కేటాయింపుల‌కు మించి చుక్క నీటిని కూడావాడుకోరాద‌న్న‌ది తెలంగాణ ప్ర‌భుత్వ వాద‌న‌. ఈ నేప‌థ్యంలోనే ఇరు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి. సుప్రీంకోర్టు వ‌రకు చేరాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ స‌ర్కారు సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ వేసింది.

ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేద‌ని.. గోదావ‌రి జలాల్లో ఏపీకి కేటాయించిన 484టీఎంసీల‌కు మించి వాడుకోరాద‌ని పేర్కొంటూ.. న్యాయ పోరాటం ప్రారంభించింది. గ‌తంలోనే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య స‌యోధ్య అవ‌స‌ర‌మ‌ని.. మీడియేష‌న్ ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని గ‌త విచార‌ణ‌లో పేర్కొంది. దీనికి ఇరు ప్ర‌భుత్వం తొలుత మొగ్గు చూపినా.. త‌ర్వాత‌.. మ‌ళ్లీ న్యాయ‌పోరాటానికే ప్రాధాన్యం ఇచ్చాయి. ఈ క్ర‌మంలో సోమవారం మ‌రోసారి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్ర‌భుత్వం వేసిన పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగింది.

తొలుత తెలంగాణ త‌ర‌ఫున న్యాయ‌వాది అభిషేక్ సింఘ్వీ వాద‌న‌లు వినిపించారు. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టులో ఏకంగా మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సైతం హాజ‌రు కావ‌డం విశేషం. అయితే.. సుప్రీంకోర్టులో ఏపీ వాద‌న‌లు బ‌లంగా వినిపించ‌డంతోపాటు.. సుప్రీంకోర్టు కూడా.. సివిల్ వివాదాల రూపంంలో సూట్ వేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 131 ప్ర‌కారం.. వ్య‌వ‌హ‌రించాల‌ని పేర్కొంది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం ఈ విష‌యంలో వెనక్కి త‌గ్గి.. ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ‌లో ఉన్న రిట్ పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకుంది.

త్వ‌ర‌లోనే మ‌రో రూపంలో కోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్టు తెలంగాణ స‌ర్కారు తెలిపింది. ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి అనుమ‌తులు లేకుండా.. ప్రాజెక్టులు చేప‌డుతోంద‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందుకే వివాదం ఏర్ప‌డింద‌న్నారు. సుప్రీంకోర్టు సూచ‌న‌ల‌తో తిరిగి మ‌రో రూపంలో పిటిష‌న్ వేయ‌నున్న‌ట్టు వివ‌రించారు. అయితే.. తెలంగాణ ఎలాంటి రూపంలో ఈ విష‌యాన్ని తీసుకువెళ్లినా.. తమ‌దే విజ‌య‌మ‌ని ఏపీ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు వ్యాఖ్యానించారు.

Kumar

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

18 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

24 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

38 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago