Political News

షాకింగ్: `పోల‌వ‌రం పోరు`పై తెలంగాణ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. గోదావ‌రి నుంచి స‌ముద్రంలోకి వృథా పోతున్న జ‌లాల‌ను తాము వాడుకుంటామ‌ని ఏపీ చెబుతున్నా.. కేటాయింపుల‌కు మించి చుక్క నీటిని కూడావాడుకోరాద‌న్న‌ది తెలంగాణ ప్ర‌భుత్వ వాద‌న‌. ఈ నేప‌థ్యంలోనే ఇరు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి. సుప్రీంకోర్టు వ‌రకు చేరాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ స‌ర్కారు సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ వేసింది.

ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేద‌ని.. గోదావ‌రి జలాల్లో ఏపీకి కేటాయించిన 484టీఎంసీల‌కు మించి వాడుకోరాద‌ని పేర్కొంటూ.. న్యాయ పోరాటం ప్రారంభించింది. గ‌తంలోనే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య స‌యోధ్య అవ‌స‌ర‌మ‌ని.. మీడియేష‌న్ ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని గ‌త విచార‌ణ‌లో పేర్కొంది. దీనికి ఇరు ప్ర‌భుత్వం తొలుత మొగ్గు చూపినా.. త‌ర్వాత‌.. మ‌ళ్లీ న్యాయ‌పోరాటానికే ప్రాధాన్యం ఇచ్చాయి. ఈ క్ర‌మంలో సోమవారం మ‌రోసారి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్ర‌భుత్వం వేసిన పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగింది.

తొలుత తెలంగాణ త‌ర‌ఫున న్యాయ‌వాది అభిషేక్ సింఘ్వీ వాద‌న‌లు వినిపించారు. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టులో ఏకంగా మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సైతం హాజ‌రు కావ‌డం విశేషం. అయితే.. సుప్రీంకోర్టులో ఏపీ వాద‌న‌లు బ‌లంగా వినిపించ‌డంతోపాటు.. సుప్రీంకోర్టు కూడా.. సివిల్ వివాదాల రూపంంలో సూట్ వేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 131 ప్ర‌కారం.. వ్య‌వ‌హ‌రించాల‌ని పేర్కొంది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం ఈ విష‌యంలో వెనక్కి త‌గ్గి.. ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ‌లో ఉన్న రిట్ పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకుంది.

త్వ‌ర‌లోనే మ‌రో రూపంలో కోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్టు తెలంగాణ స‌ర్కారు తెలిపింది. ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి అనుమ‌తులు లేకుండా.. ప్రాజెక్టులు చేప‌డుతోంద‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందుకే వివాదం ఏర్ప‌డింద‌న్నారు. సుప్రీంకోర్టు సూచ‌న‌ల‌తో తిరిగి మ‌రో రూపంలో పిటిష‌న్ వేయ‌నున్న‌ట్టు వివ‌రించారు. అయితే.. తెలంగాణ ఎలాంటి రూపంలో ఈ విష‌యాన్ని తీసుకువెళ్లినా.. తమ‌దే విజ‌య‌మ‌ని ఏపీ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు వ్యాఖ్యానించారు.

This post was last modified on January 12, 2026 8:37 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

2 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

7 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

8 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

9 hours ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

9 hours ago

సింగర్ చిన్మ‌యిపై కేసు

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే త‌మిళ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యిపై కేసు న‌మోదైంది. ఎక్స్‌లో ఆమె చేసిన…

10 hours ago