ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. గోదావరి నుంచి సముద్రంలోకి వృథా పోతున్న జలాలను తాము వాడుకుంటామని ఏపీ చెబుతున్నా.. కేటాయింపులకు మించి చుక్క నీటిని కూడావాడుకోరాదన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాలు తెరమీదికి వచ్చాయి. సుప్రీంకోర్టు వరకు చేరాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది.
ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలను పాటించడం లేదని.. గోదావరి జలాల్లో ఏపీకి కేటాయించిన 484టీఎంసీలకు మించి వాడుకోరాదని పేర్కొంటూ.. న్యాయ పోరాటం ప్రారంభించింది. గతంలోనే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య అవసరమని.. మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవాలని గత విచారణలో పేర్కొంది. దీనికి ఇరు ప్రభుత్వం తొలుత మొగ్గు చూపినా.. తర్వాత.. మళ్లీ న్యాయపోరాటానికే ప్రాధాన్యం ఇచ్చాయి. ఈ క్రమంలో సోమవారం మరోసారి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ జరిగింది.
తొలుత తెలంగాణ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో ఏకంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం హాజరు కావడం విశేషం. అయితే.. సుప్రీంకోర్టులో ఏపీ వాదనలు బలంగా వినిపించడంతోపాటు.. సుప్రీంకోర్టు కూడా.. సివిల్ వివాదాల రూపంంలో సూట్ వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం.. వ్యవహరించాలని పేర్కొంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గి.. ఇప్పటి వరకు విచారణలో ఉన్న రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకుంది.
త్వరలోనే మరో రూపంలో కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలంగాణ సర్కారు తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా.. ప్రాజెక్టులు చేపడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందుకే వివాదం ఏర్పడిందన్నారు. సుప్రీంకోర్టు సూచనలతో తిరిగి మరో రూపంలో పిటిషన్ వేయనున్నట్టు వివరించారు. అయితే.. తెలంగాణ ఎలాంటి రూపంలో ఈ విషయాన్ని తీసుకువెళ్లినా.. తమదే విజయమని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.
This post was last modified on January 12, 2026 8:37 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…