Political News

షాకింగ్: `పోల‌వ‌రం పోరు`పై తెలంగాణ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. గోదావ‌రి నుంచి స‌ముద్రంలోకి వృథా పోతున్న జ‌లాల‌ను తాము వాడుకుంటామ‌ని ఏపీ చెబుతున్నా.. కేటాయింపుల‌కు మించి చుక్క నీటిని కూడావాడుకోరాద‌న్న‌ది తెలంగాణ ప్ర‌భుత్వ వాద‌న‌. ఈ నేప‌థ్యంలోనే ఇరు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి. సుప్రీంకోర్టు వ‌రకు చేరాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ స‌ర్కారు సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ వేసింది.

ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేద‌ని.. గోదావ‌రి జలాల్లో ఏపీకి కేటాయించిన 484టీఎంసీల‌కు మించి వాడుకోరాద‌ని పేర్కొంటూ.. న్యాయ పోరాటం ప్రారంభించింది. గ‌తంలోనే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య స‌యోధ్య అవ‌స‌ర‌మ‌ని.. మీడియేష‌న్ ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని గ‌త విచార‌ణ‌లో పేర్కొంది. దీనికి ఇరు ప్ర‌భుత్వం తొలుత మొగ్గు చూపినా.. త‌ర్వాత‌.. మ‌ళ్లీ న్యాయ‌పోరాటానికే ప్రాధాన్యం ఇచ్చాయి. ఈ క్ర‌మంలో సోమవారం మ‌రోసారి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్ర‌భుత్వం వేసిన పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగింది.

తొలుత తెలంగాణ త‌ర‌ఫున న్యాయ‌వాది అభిషేక్ సింఘ్వీ వాద‌న‌లు వినిపించారు. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టులో ఏకంగా మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సైతం హాజ‌రు కావ‌డం విశేషం. అయితే.. సుప్రీంకోర్టులో ఏపీ వాద‌న‌లు బ‌లంగా వినిపించ‌డంతోపాటు.. సుప్రీంకోర్టు కూడా.. సివిల్ వివాదాల రూపంంలో సూట్ వేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 131 ప్ర‌కారం.. వ్య‌వ‌హ‌రించాల‌ని పేర్కొంది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం ఈ విష‌యంలో వెనక్కి త‌గ్గి.. ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ‌లో ఉన్న రిట్ పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకుంది.

త్వ‌ర‌లోనే మ‌రో రూపంలో కోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్టు తెలంగాణ స‌ర్కారు తెలిపింది. ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి అనుమ‌తులు లేకుండా.. ప్రాజెక్టులు చేప‌డుతోంద‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందుకే వివాదం ఏర్ప‌డింద‌న్నారు. సుప్రీంకోర్టు సూచ‌న‌ల‌తో తిరిగి మ‌రో రూపంలో పిటిష‌న్ వేయ‌నున్న‌ట్టు వివ‌రించారు. అయితే.. తెలంగాణ ఎలాంటి రూపంలో ఈ విష‌యాన్ని తీసుకువెళ్లినా.. తమ‌దే విజ‌య‌మ‌ని ఏపీ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు వ్యాఖ్యానించారు.

Kumar

Recent Posts

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

13 minutes ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

1 hour ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

1 hour ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

2 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

2 hours ago

తెలంగాణ పాలిటిక్స్‌: ప‌వ‌న్ భ‌య‌మా… ఓట్ల భ‌య‌మా?

తెలంగాణ రాజ‌కీయాలు వ్యూహాత్మ‌క మ‌లుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్‌, టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఒక్క‌సారిగా జ‌న‌సేన పార్టీపై…

2 hours ago