ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. గోదావరి నుంచి సముద్రంలోకి వృథా పోతున్న జలాలను తాము వాడుకుంటామని ఏపీ చెబుతున్నా.. కేటాయింపులకు మించి చుక్క నీటిని కూడావాడుకోరాదన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాలు తెరమీదికి వచ్చాయి. సుప్రీంకోర్టు వరకు చేరాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది.
ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలను పాటించడం లేదని.. గోదావరి జలాల్లో ఏపీకి కేటాయించిన 484టీఎంసీలకు మించి వాడుకోరాదని పేర్కొంటూ.. న్యాయ పోరాటం ప్రారంభించింది. గతంలోనే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య అవసరమని.. మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవాలని గత విచారణలో పేర్కొంది. దీనికి ఇరు ప్రభుత్వం తొలుత మొగ్గు చూపినా.. తర్వాత.. మళ్లీ న్యాయపోరాటానికే ప్రాధాన్యం ఇచ్చాయి. ఈ క్రమంలో సోమవారం మరోసారి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ జరిగింది.
తొలుత తెలంగాణ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో ఏకంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం హాజరు కావడం విశేషం. అయితే.. సుప్రీంకోర్టులో ఏపీ వాదనలు బలంగా వినిపించడంతోపాటు.. సుప్రీంకోర్టు కూడా.. సివిల్ వివాదాల రూపంంలో సూట్ వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం.. వ్యవహరించాలని పేర్కొంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గి.. ఇప్పటి వరకు విచారణలో ఉన్న రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకుంది.
త్వరలోనే మరో రూపంలో కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలంగాణ సర్కారు తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా.. ప్రాజెక్టులు చేపడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందుకే వివాదం ఏర్పడిందన్నారు. సుప్రీంకోర్టు సూచనలతో తిరిగి మరో రూపంలో పిటిషన్ వేయనున్నట్టు వివరించారు. అయితే.. తెలంగాణ ఎలాంటి రూపంలో ఈ విషయాన్ని తీసుకువెళ్లినా.. తమదే విజయమని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.
This post was last modified on January 12, 2026 8:37 pm
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…