Political News

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని తక్కువ చేసి మాట్లాడడంతో పాటు, దీనిని నదీ గర్భంలో నిర్మిస్తున్నారని, దీని వెనుక మాఫియా ఉందని ఆయన ఆరోపించారు. అదే సమయంలో ఇంత భూమి, రెండు లక్షల కోట్ల రూపాయల వ్యయం అవసరమా అని కూడా ప్రశ్నించారు.

మొత్తంగా తన మనస్తత్వాన్ని ఆయన రెండు రోజుల కిందట జాతీయ మీడియా ముందు ఆవిష్కరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో 48 గంటలు కూడా గడవకముందే వైసీపీ టోన్ మార్చింది. వైసీపీకి అమరావతి అంటే గౌరవం ఉందని, దాని ప్రాధాన్యాన్ని గుర్తించామని పార్టీ కీలక నాయకుడు, రాష్ట్ర వైసీపీ ఇంచార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ కు అమరావతి అంటే ఎనలేని అభిమానం ఉందన్నారు. అంతేకాదు, జగన్ నివాసం కూడా అమరావతి పరిధిలోనే ఉందని చెప్పారు.

అయితే అమరావతిలో ప్రజాధనం వృథా చేస్తున్నారని, అవసరం లేని భారీ భవనాలు నిర్మిస్తున్నారన్నదే జగన్ అభ్యంతరమని సజ్జల తెలిపారు. ఈ విషయాన్ని ఒక వర్గం మీడియా వ్యతిరేకంగా ప్రచారం చేసిందని ఆయన ఆరోపించారు.

జగన్ పై విమర్శలు చేస్తున్న వారు ఆయన సంధించిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబు అనుకూల వర్గాలకు రాజధానిలో భూములు కేటాయిస్తున్నారని జగన్ చెప్పారని, దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ముఖ్యంగా చంద్రబాబు మీద ఉందన్నారు.

జగన్ ఎప్పుడూ రాష్ట్రానికి ద్రోహం చేయలేదని సజ్జల స్పష్టం చేశారు. కేవలం రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతినే ఆయన ప్రశ్నించారని తెలిపారు. ఈ క్రమంలో మరోసారి గ్రాఫిక్స్ వరకే రాజధానిని పరిమితం చేస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించడం గమనార్హం.

రాజధానికి సంబంధించి చంద్రబాబు అనేక వాగ్దానాలు చేశారని, రైతులకు న్యాయం చేస్తామని చెప్పారని, కానీ ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదని సజ్జల వ్యాఖ్యానించారు. ఇప్పటికీ రాజధాని రైతులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. కేవలం భ్రమలు కల్పించడం ద్వారా ప్రజలను మోసం చేయలేరన్నారు.

కేవలం అమరావతిలో జరుగుతున్న అన్యాయాన్ని మాత్రమే జగన్ ప్రశ్నించారని, ఇది అభివృద్ధిని అడ్డుకోవడంగా పరిగణించరాదన్నారు. కాగా 48 గంటల్లోనే వైసీపీ తన వైఖరిని మార్చుకుందా అంటే, స్పష్టంగా రాజధానిగా అమరావతిని పూర్తిగా అంగీకరించడం లేదన్న విషయం మాత్రం స్పష్టమైంది. అయితే ప్రజాగ్రహాన్ని గుర్తించడం మాత్రం విశేషంగా మారింది.

This post was last modified on January 11, 2026 4:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..

మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…

46 minutes ago

రోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారు

న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…

1 hour ago

కల్కి 2 ప్లానింగ్… ఒక పద్ధతి ఒక ప్రణాళిక

ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…

2 hours ago

తిరుమలలో పాము కాటు… నిజమెంత?

తిరుమ‌ల‌పై మ‌రో దుష్ప్ర‌చారం జ‌ర‌గ‌డంపై ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కార‌ణం ఎవ‌రు? ఎక్క‌డ నుంచి జ‌రిగింది?…

5 hours ago

అసెంబ్లీలో ల‌డ్డూపై చ‌ర్చ‌.. కానీ జగన్…

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. దానికి త‌గిన విధంగా ప‌నిచే స్తున్నారా? అనేది…

8 hours ago

జగన్ వస్తే లోకేష్ టికెట్ ఇస్తారట

త‌న‌పై వైసీపీ నాయ‌కులు స‌హా.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…

9 hours ago