Political News

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2 కోట్లను విడుదల చేసింది. రాజధాని ప్రాంతం ఒకప్పుడు బౌద్ధులకు ఆరామంగా ఉండేది. అనేక బౌద్ధ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరిగాయి.

ఈ నేపథ్యంలో 2014 నుంచి 2018 మధ్య అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ‘జ్ఞాన బుద్ధ’ పేరుతో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో బౌద్ధ ఆరామానికి సంబంధించిన అనేక విశేషాలతో పాటు బుద్ధుని భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చుట్టూ హరిత హారాన్ని నిర్మించాలని కూడా ప్రణాళిక వేశారు.

జ్ఞాన బుద్ధ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ స్థాయి బౌద్ధులను ఆకర్షించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. అప్పట్లోనే ఈ ప్రాజెక్టుకు ఐదు ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ప్రస్తుతం ఉన్న 125 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగానే నిర్మించబడింది.

అయితే, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కనపెట్టడంతో ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. జ్ఞాన బుద్ధ ప్రాజెక్టు కూడా మూలన పడింది. అయినప్పటికీ ఈ ప్రాంతానికి పర్యాటకులు వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనిని పూర్తిస్థాయిలో విస్తరించాలని రాష్ట్ర పర్యాటక శాఖ నిర్ణయించింది.

ఇటీవల దీనికి సంబంధించిన విధి విధానాలను పర్యాటక శాఖ రూపొందించింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా జ్ఞాన బుద్ధ ప్రాజెక్టు అభివృద్ధికి రూ. 1.85 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ప్రాంగణాన్ని పునరుద్ధరించనున్నారు.

అదేవిధంగా ప్రత్యేక ధ్యాన మందిరం, గ్రంథాలయం, బౌద్ధుని స్మృతులతో కూడిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. దీనిని ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఏటా సుమారు ఐదు లక్షల మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా జ్ఞాన బుద్ధ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.

This post was last modified on January 9, 2026 10:26 pm

Share
Show comments
Published by
Satya
Tags: Gnan Buddha

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

7 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

7 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

8 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

11 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

12 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

14 hours ago