తనపై వచ్చిన అసత్య కథనంపై ఏపీ మంత్రి నారా లోకేష్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. విశాఖలోని 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో సాక్షి పత్రికపై దాఖలు చేసిన పరువునష్టం దావా కేసుకు సంబంధించి ఈరోజు ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే రెండు దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తికాగా, మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్కు తన న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు.
‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ అనే శీర్షికతో 2019 అక్టోబర్ 22న సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అసత్యాలు, కల్పితాలతో ఉందని మంత్రి లోకేష్ ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తన పరువుకు భంగం కలిగించేలా కథనం రాశారని పేర్కొంటూ సాక్షి పత్రికకు రిజిస్టర్ నోటీసు పంపించినప్పటికీ సరైన సమాధానం రాకపోవడంతో పరువునష్టం దావా వేశారని తెలిపారు.
ఆ కథనంలో పేర్కొన్న తేదీల్లో తాను విశాఖలోనే లేనని, ప్రభుత్వ అతిథుల కోసం చేసిన ఖర్చును తనకు ఆపాదిస్తూ తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో మంత్రిగా అనేకసార్లు విశాఖ వచ్చినప్పటికీ ఎయిర్పోర్టులో ఎలాంటి ప్రొటోకాల్ సౌకర్యాలు స్వీకరించలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో మంత్రి లోకేష్ తరపున సీనియర్ న్యాయవాదులు దొద్దాల కోటేశ్వరరావు, ఎస్వీ రమణ హాజరయ్యారు.
This post was last modified on January 7, 2026 12:28 pm
దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కలయికలో రూపొందిన స్లమ్ డాగ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అదిగో ఇదిగో…
మెగా ఫ్యాన్స్ మహా అయోమయంలో ఉన్నారు. పెద్ది పోస్ట్ పోన్ అయ్యింది కానీ జూన్ నెలలో ఏ డేట్ కి…
స్టార్ హీరోలు డిజాస్టర్లు ఇచ్చినప్పుడు దాని తాలూకు పరిణామాలు కేవలం బాక్సాఫీస్ నష్టాలకే పరిమితం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా…
గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ‘సైయారా’ ఒకటి. సంగీత ప్రధానంగా సాగే ఈ ప్రేమకథ.. దేశవ్యాప్తంగా…
ఒక భారీ చిత్రం విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం గత కొద్ది కాలంలో తొలిసారిగా…
గాడ్ ఆఫ్ వార్.. ఏడాది కిందట్నుంచి టాలీవుడ్లో విపరీతంగా చర్చనీయాంశం అవుతున్న ప్రాజెక్టు. ఇప్పటిదాకా ఎక్కువగా ఫ్యామిలీ, మాస్, యాక్షన్…