తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూసీ నదీ ప్రక్షాళనపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభాధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ నదీ ప్రక్షాళన జరిగి తీరాల్సిందేనని అన్నారు.
సంవత్సరానికి 365 రోజులు మూసీ నదిలో నీరు ప్రవహించాల్సిందేనని తేల్చి చెప్పారు. అందుకే, ప్రపంచ స్థాయిలో కన్సల్టెన్సీ నిపుణులతో చర్చించి, మూసీ వంటి ప్రాజెక్టులను పరిశీలించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించామని అన్నారు.
గత పాలకులకు నిజాం మీద కోపం ఉంటే అభ్యంతరం లేదని, కానీ, వాళ్లు చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారని అన్నారు. నిజాం కట్టిన చారిత్రక కట్టడాలను, అభివృద్ధిని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల కిందటే నిజాం నదీ పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్దారని, అప్పట్లోనే ప్రపంచ దేశాలతో పోటీ పడేలా హైదరాబాద్ రాష్ట్రాన్ని డెవలప్ చేశారని గుర్తు చేశారు.
అయితే, రేవంత్ మాట్లాడిన తర్వాత తమకు మాట్లాడే అవకాశమివ్వాలని బీఆర్ఎస్ సభ్యులు కోరారు. అందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అనుమతించలేదు. ఆ అంశానికి సంబంధించి మాట్లాడతానంటేనే మైక్ ఇస్తానని, ముఖ్యమంత్రిని విమర్శిస్తానంటే మైక్ ఇవ్వబోనని తేల్చి చెప్పేశారు. దీంతో, స్పీకర్ గడ్డం ప్రసాద్ తీరుకు నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.
This post was last modified on January 2, 2026 3:20 pm
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…