తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూసీ నదీ ప్రక్షాళనపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభాధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ నదీ ప్రక్షాళన జరిగి తీరాల్సిందేనని అన్నారు.
సంవత్సరానికి 365 రోజులు మూసీ నదిలో నీరు ప్రవహించాల్సిందేనని తేల్చి చెప్పారు. అందుకే, ప్రపంచ స్థాయిలో కన్సల్టెన్సీ నిపుణులతో చర్చించి, మూసీ వంటి ప్రాజెక్టులను పరిశీలించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించామని అన్నారు.
గత పాలకులకు నిజాం మీద కోపం ఉంటే అభ్యంతరం లేదని, కానీ, వాళ్లు చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారని అన్నారు. నిజాం కట్టిన చారిత్రక కట్టడాలను, అభివృద్ధిని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల కిందటే నిజాం నదీ పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్దారని, అప్పట్లోనే ప్రపంచ దేశాలతో పోటీ పడేలా హైదరాబాద్ రాష్ట్రాన్ని డెవలప్ చేశారని గుర్తు చేశారు.
అయితే, రేవంత్ మాట్లాడిన తర్వాత తమకు మాట్లాడే అవకాశమివ్వాలని బీఆర్ఎస్ సభ్యులు కోరారు. అందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అనుమతించలేదు. ఆ అంశానికి సంబంధించి మాట్లాడతానంటేనే మైక్ ఇస్తానని, ముఖ్యమంత్రిని విమర్శిస్తానంటే మైక్ ఇవ్వబోనని తేల్చి చెప్పేశారు. దీంతో, స్పీకర్ గడ్డం ప్రసాద్ తీరుకు నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.
This post was last modified on January 2, 2026 3:20 pm
అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం…
స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…
ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జనసేన నాయకుడు, సీనియర్ నేత ఆరణి శ్రీనివాసులు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర…
కొందరు నటనలోకి రావాలని ముందే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేస్తారు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి అడుగు పెడతారు.…