Political News

‘నిజాం చేసిన అభివృద్ధిని నాశనం చేశారు’

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూసీ నదీ ప్రక్షాళనపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభాధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ నదీ ప్రక్షాళన జరిగి తీరాల్సిందేనని అన్నారు.

సంవత్సరానికి 365 రోజులు మూసీ నదిలో నీరు ప్రవహించాల్సిందేనని తేల్చి చెప్పారు. అందుకే, ప్రపంచ స్థాయిలో కన్సల్టెన్సీ నిపుణులతో చర్చించి, మూసీ వంటి ప్రాజెక్టులను పరిశీలించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించామని అన్నారు.

గత పాలకులకు నిజాం మీద కోపం ఉంటే అభ్యంతరం లేదని, కానీ, వాళ్లు చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారని అన్నారు. నిజాం కట్టిన చారిత్రక కట్టడాలను, అభివృద్ధిని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల కిందటే నిజాం నదీ పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్దారని, అప్పట్లోనే ప్రపంచ దేశాలతో పోటీ పడేలా హైదరాబాద్ రాష్ట్రాన్ని డెవలప్ చేశారని గుర్తు చేశారు.

అయితే, రేవంత్ మాట్లాడిన తర్వాత తమకు మాట్లాడే అవకాశమివ్వాలని బీఆర్ఎస్ సభ్యులు కోరారు. అందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అనుమతించలేదు. ఆ అంశానికి సంబంధించి మాట్లాడతానంటేనే మైక్ ఇస్తానని, ముఖ్యమంత్రిని విమర్శిస్తానంటే మైక్ ఇవ్వబోనని తేల్చి చెప్పేశారు. దీంతో, స్పీకర్ గడ్డం ప్రసాద్ తీరుకు నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.

This post was last modified on January 2, 2026 3:20 pm

Share

Recent Posts

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

1 hour ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

2 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

2 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

4 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

5 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

12 hours ago