ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను మరో రెండు జిల్లాలు కలుపుతూ.. 28 జిల్లాలుగా ఏర్పాటు చేయనుంది. ఈ నిర్ణయం నూతన సంవత్సరం 2026, జనవరి 1వ తేదీ నుంచే అమలులోకి రానుంది. వీటిలో మదనపల్లె, పోలవరం రెండు కొత్త జిల్లాలను జోడిస్తున్నారు.
మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేయడం వరకు బాగానే ఉంది. ఎందుకంటే.. దీనిలో మొత్తం 22 మండలాలు రానున్నాయి. పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె, రాయచోటి, మదనపల్లె నియోజకవర్గాలలోని 20 మండలాలను మరో రెండు మండలాలతో కలిపి కొత్తగా మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు.
అయితే.. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలవరంపైనే అందరికీ పలు సందేహాలు వున్నాయి. దీనికి కారణం.. ఇది ఏర్పాటు కావడంతో రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా పోలవరం గుర్తింపు తెచ్చుకోనుంది. ఇప్పటి వరకు ఉన్న జిల్లాల్లో పోలవరమే అతి చిన్న జిల్లా కానుంది.
దీనిలో పోలవరంలోని కొన్ని మండలాలు సహా.. ప్రస్తుతం ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గాన్ని విభజించి.. కొన్ని మండలాలను కలుపుతూ.. మొత్తంగా 12 మండలాలతో పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం జనాభా 3 లక్షల 24 వేల మంది మాత్రమే ఉంటారు. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే.. ఇది చాలా చిన్న జిల్లాగా మారనుంది.
రీజనేంటి?
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నందున.. కొత్తగా జిల్లా ఏర్పాటు చేస్తున్నారన్న వాదన ఉన్నప్పటికీ.. ప్రభుత్వం దీనిని తోసిపుచ్చింది. అందుకే.. పొరుగున ఉన్న రంపచోడవరం నియోజకవర్గంలోని మండలాలు తీసుకువచ్చి.. దీనిలో కలుపుతూ.. కొత్తగా జిల్లాను ఏర్పాటు చేసింది.
తద్వారా.. గిరిజన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లాగా ఇది ఏర్పడుతుంది. దీంతో కేంద్రం నుంచినిధులు తెచ్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అదేసమయంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు ఇస్తుంది.
ప్రస్తుతం పోలవరం.. జిల్లాగా ఏర్పడితే.. వెనుకబడి జిల్లాల జాబితాలో పోలవరం ముందు వరుసలోకి వస్తుంది. దీంతో కేంద్రం నుంచి నిధులు మరిన్ని వస్తాయన్న అంచనా ఉంది. ఈ కారణాలతోనే.. పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు.
ఒకవైపు ప్రాజక్టును పరుగులు పెట్టించడంతోపాటు.. ఇక్కడ అభివృధ్ధి పనులు చేపట్టేందుకు కూడా అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే.. కొందరు మంత్రులు ఇంత చిన్న జిల్లా ఏర్పాటు అవసరమా? అని ప్రశ్నించినప్పటికీ.. చంద్రబాబు జిల్లా ఏర్పాటుకే మొగ్గు చూపించారు. ఇవి.. జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
This post was last modified on December 31, 2025 7:46 am
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించే సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో ఎంత తలనొప్పి ఎదురైందో…
టాలీవుడ్లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో పాటు నాని, విజయ్…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…
ఏపీ సీఎం చంద్రబాబు గత 2024లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత..…
బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…