ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను మరో రెండు జిల్లాలు కలుపుతూ.. 28 జిల్లాలుగా ఏర్పాటు చేయనుంది. ఈ నిర్ణయం నూతన సంవత్సరం 2026, జనవరి 1వ తేదీ నుంచే అమలులోకి రానుంది. వీటిలో మదనపల్లె, పోలవరం రెండు కొత్త జిల్లాలను జోడిస్తున్నారు.
మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేయడం వరకు బాగానే ఉంది. ఎందుకంటే.. దీనిలో మొత్తం 22 మండలాలు రానున్నాయి. పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె, రాయచోటి, మదనపల్లె నియోజకవర్గాలలోని 20 మండలాలను మరో రెండు మండలాలతో కలిపి కొత్తగా మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు.
అయితే.. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలవరంపైనే అందరికీ పలు సందేహాలు వున్నాయి. దీనికి కారణం.. ఇది ఏర్పాటు కావడంతో రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా పోలవరం గుర్తింపు తెచ్చుకోనుంది. ఇప్పటి వరకు ఉన్న జిల్లాల్లో పోలవరమే అతి చిన్న జిల్లా కానుంది.
దీనిలో పోలవరంలోని కొన్ని మండలాలు సహా.. ప్రస్తుతం ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గాన్ని విభజించి.. కొన్ని మండలాలను కలుపుతూ.. మొత్తంగా 12 మండలాలతో పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం జనాభా 3 లక్షల 24 వేల మంది మాత్రమే ఉంటారు. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే.. ఇది చాలా చిన్న జిల్లాగా మారనుంది.
రీజనేంటి?
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నందున.. కొత్తగా జిల్లా ఏర్పాటు చేస్తున్నారన్న వాదన ఉన్నప్పటికీ.. ప్రభుత్వం దీనిని తోసిపుచ్చింది. అందుకే.. పొరుగున ఉన్న రంపచోడవరం నియోజకవర్గంలోని మండలాలు తీసుకువచ్చి.. దీనిలో కలుపుతూ.. కొత్తగా జిల్లాను ఏర్పాటు చేసింది.
తద్వారా.. గిరిజన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లాగా ఇది ఏర్పడుతుంది. దీంతో కేంద్రం నుంచినిధులు తెచ్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అదేసమయంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు ఇస్తుంది.
ప్రస్తుతం పోలవరం.. జిల్లాగా ఏర్పడితే.. వెనుకబడి జిల్లాల జాబితాలో పోలవరం ముందు వరుసలోకి వస్తుంది. దీంతో కేంద్రం నుంచి నిధులు మరిన్ని వస్తాయన్న అంచనా ఉంది. ఈ కారణాలతోనే.. పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు.
ఒకవైపు ప్రాజక్టును పరుగులు పెట్టించడంతోపాటు.. ఇక్కడ అభివృధ్ధి పనులు చేపట్టేందుకు కూడా అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే.. కొందరు మంత్రులు ఇంత చిన్న జిల్లా ఏర్పాటు అవసరమా? అని ప్రశ్నించినప్పటికీ.. చంద్రబాబు జిల్లా ఏర్పాటుకే మొగ్గు చూపించారు. ఇవి.. జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…