సంక్రాంతి పండుగ…తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ. అందుకే, ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో పండుగ చేసుకునేందుకు సొంతూళ్లకు పయనమవుతుంటారు.
ముఖ్యంగా, హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు లక్షలాది మంది వెళుతుంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతి సమయంలో హైదరాబాద్ ఖాళీ అయిందా అన్న రీతిలో ట్రాఫిక్ అంతా విజయవాడవైపు మళ్లుతుంది.
దీంతో, ఎల్బీ నగర్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాలతో పాటు విజయవాడ వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. వేల కొద్దీ వాహనాలు గంటల కొద్దీ బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది.
ట్రాఫిక్ ను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పండుగ రోజుల్లో రోడ్లపై భారీ యంత్రాలతో చేపట్టే పనులు, లేన్ లు మూసివేసే పనులు నిలిపివేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆయన సూచించారు.
ఒకవేళ అత్యవసరంగా చేయవలసిన మరమ్మతులు, పనులు ఉంటే ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో చేసుకోవాలని ఆదేశించారు. దాంతోపాటు రోడ్లపై హై విజిబిలిటీ కోన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి పనులు జరిగే ప్రాంతం, వాహనాలు వెళ్లవలసిన దారిని స్పష్టంగా చూపించాలని చెప్పారు.
పండుగ మొదలవ్వడానికి ముందే రోడ్లపై మట్టి, మెటీరియల్, నిర్మాణ సామాగ్రి, యంత్రాలను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. కీలకమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులను మోహరించాలని, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
This post was last modified on December 30, 2025 5:03 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…