సంక్రాంతి పండుగ…తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ. అందుకే, ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో పండుగ చేసుకునేందుకు సొంతూళ్లకు పయనమవుతుంటారు.
ముఖ్యంగా, హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు లక్షలాది మంది వెళుతుంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతి సమయంలో హైదరాబాద్ ఖాళీ అయిందా అన్న రీతిలో ట్రాఫిక్ అంతా విజయవాడవైపు మళ్లుతుంది.
దీంతో, ఎల్బీ నగర్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాలతో పాటు విజయవాడ వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. వేల కొద్దీ వాహనాలు గంటల కొద్దీ బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది.
ట్రాఫిక్ ను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పండుగ రోజుల్లో రోడ్లపై భారీ యంత్రాలతో చేపట్టే పనులు, లేన్ లు మూసివేసే పనులు నిలిపివేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆయన సూచించారు.
ఒకవేళ అత్యవసరంగా చేయవలసిన మరమ్మతులు, పనులు ఉంటే ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో చేసుకోవాలని ఆదేశించారు. దాంతోపాటు రోడ్లపై హై విజిబిలిటీ కోన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి పనులు జరిగే ప్రాంతం, వాహనాలు వెళ్లవలసిన దారిని స్పష్టంగా చూపించాలని చెప్పారు.
పండుగ మొదలవ్వడానికి ముందే రోడ్లపై మట్టి, మెటీరియల్, నిర్మాణ సామాగ్రి, యంత్రాలను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. కీలకమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులను మోహరించాలని, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
This post was last modified on December 30, 2025 5:03 pm
ఏపీ రాజధాని అమరావతికి 2025 ఓ మహత్తర సంవత్సరమేనని చెప్పాలి. 2014-19 మధ్య ఏపీ రాజధానిగా ఏర్పడిన అమరావతి.. తర్వాత…
దర్శకుడు అనిల్ రావిపూడి లుక్స్, చలాకీతనం హీరోగా చేయడానికి పనికొచ్చేలా ఉంటాయి. పైగా డాన్స్ కూడా బాగా వచ్చు. రియాలిటీ…
చాలా ఏళ్ల నుంచి గీతా ఆర్ట్స్ సంస్థలో అంతర్భాగంగా ఉంటూ.. ‘జీఏ2’ బేనర్ మీద సినిమాలు నిర్మిస్తున్న బన్నీ వాసు.. ఈ…
నలభై సంవత్సరాలుగా కుదరని కాంబినేషన్ దర్శకుడు అనిల్ రావిపూడి సాధ్యం చేశారు. మన శంకరవరప్రసాద్ గారులో చిరంజీవి, వెంకటేష్ ని…
మోహన్ లాల్ తల్లి శాంతకుమారి అనారోగ్య సమస్యలతో మరణించారు. ఆమె వయసు 90 ఏళ్లు. శాంతకుమారి కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో…
తిరుమల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. కుల, మత, రాజకీయ భేదాలు…