సంక్రాంతి పండుగ…తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ. అందుకే, ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో పండుగ చేసుకునేందుకు సొంతూళ్లకు పయనమవుతుంటారు.
ముఖ్యంగా, హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు లక్షలాది మంది వెళుతుంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతి సమయంలో హైదరాబాద్ ఖాళీ అయిందా అన్న రీతిలో ట్రాఫిక్ అంతా విజయవాడవైపు మళ్లుతుంది.
దీంతో, ఎల్బీ నగర్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాలతో పాటు విజయవాడ వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. వేల కొద్దీ వాహనాలు గంటల కొద్దీ బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది.
ట్రాఫిక్ ను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పండుగ రోజుల్లో రోడ్లపై భారీ యంత్రాలతో చేపట్టే పనులు, లేన్ లు మూసివేసే పనులు నిలిపివేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆయన సూచించారు.
ఒకవేళ అత్యవసరంగా చేయవలసిన మరమ్మతులు, పనులు ఉంటే ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో చేసుకోవాలని ఆదేశించారు. దాంతోపాటు రోడ్లపై హై విజిబిలిటీ కోన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి పనులు జరిగే ప్రాంతం, వాహనాలు వెళ్లవలసిన దారిని స్పష్టంగా చూపించాలని చెప్పారు.
పండుగ మొదలవ్వడానికి ముందే రోడ్లపై మట్టి, మెటీరియల్, నిర్మాణ సామాగ్రి, యంత్రాలను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. కీలకమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులను మోహరించాలని, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
This post was last modified on December 30, 2025 5:03 pm
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…