సంక్రాంతి పండుగ…తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ. అందుకే, ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో పండుగ చేసుకునేందుకు సొంతూళ్లకు పయనమవుతుంటారు.
ముఖ్యంగా, హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు లక్షలాది మంది వెళుతుంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతి సమయంలో హైదరాబాద్ ఖాళీ అయిందా అన్న రీతిలో ట్రాఫిక్ అంతా విజయవాడవైపు మళ్లుతుంది.
దీంతో, ఎల్బీ నగర్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాలతో పాటు విజయవాడ వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. వేల కొద్దీ వాహనాలు గంటల కొద్దీ బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది.
ట్రాఫిక్ ను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పండుగ రోజుల్లో రోడ్లపై భారీ యంత్రాలతో చేపట్టే పనులు, లేన్ లు మూసివేసే పనులు నిలిపివేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆయన సూచించారు.
ఒకవేళ అత్యవసరంగా చేయవలసిన మరమ్మతులు, పనులు ఉంటే ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో చేసుకోవాలని ఆదేశించారు. దాంతోపాటు రోడ్లపై హై విజిబిలిటీ కోన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి పనులు జరిగే ప్రాంతం, వాహనాలు వెళ్లవలసిన దారిని స్పష్టంగా చూపించాలని చెప్పారు.
పండుగ మొదలవ్వడానికి ముందే రోడ్లపై మట్టి, మెటీరియల్, నిర్మాణ సామాగ్రి, యంత్రాలను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. కీలకమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులను మోహరించాలని, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…