Political News

చాగంటి తర్వాత మంతెన… చంద్రబాబు మార్క్

జగన్ హయాంలో ప్రభుత్వ సలహారులను లెక్కకు మించి నియమించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా నియమించిన సలహాదారుల్లో మెజారిటీ సలహాదారులు రాజకీయాలకు సంబంధించిన వారే ఉన్నారని, జగన్ సన్నిహితులను సలహాదారులుగా నియమించుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

అయితే, కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సమాజ హితం కోరి ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులను ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తోంది. 

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావును ఏపీ ప్రభుత్వ విద్యార్థులు, నైతిక విలువల సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. అంతేకాదు, ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ కోవలోనే తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డా.మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వం నియమించింది.

ఏపీ ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు నేచురోపతి సలహాదుడి పదవిలో డా.మంతెన సత్యనారాయణ రాజు కొనసాగనున్నారు. ప్రకృతి వైద్యం, యోగాసనాల ద్వారా ప్రజలకు నేచురోపతి వైద్యాన్ని మంతెన రెండు దశాబ్దాలుగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఎండోమెంట్స్ సలహాదారుడిగా పోచంపల్లి శ్రీనివాస్ ను ప్రభుత్వం నియమించింది.

This post was last modified on December 29, 2025 10:58 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Ap advisors

Recent Posts

2025: జ‌న‌సేన గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా?

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ ఏర్పాటుకు కీల‌క పాత్ర పోషించిన జ‌న‌సేన పార్టీ 2025లో ఏ విధంగా ముందుకు సాగింది? 2024లో…

1 hour ago

ప్రమోషన్లు చేయకపోవడంపై యువ హీరో రెస్సాన్స్

నూతన సంవత్సర కానుకగా రాబోయే గురువారం ‘వనవీర’ అనే సినిమా రిలీజ్ కాబోతోంది. ముందు ‘వానర’ అనే పేరుతో ఉన్న…

1 hour ago

రీ రిలీజులకు గ్యాప్ ఇవ్వడం అవసరం

ఈ వారం రెండు రీ రిలీజులు వస్తున్నాయి. ఒకటి మహేష్ బాబు మురారి. రెండు పవన్ కళ్యాణ్ జల్సా. ఇవి…

3 hours ago

టాక్: విజయ్ కు రాజ్యసభ ఎంపీ సీటు?

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చింతకాయ‌ల అయ్య‌న్న పాత్రుడి కుమారుడు.. యువ నేత‌, సీబీఎన్ ఆర్మీ,…

4 hours ago

ఆ ఐటెం సాంగ్ తమన్నా చేసి ఉంటే..?

ఒకప్పుడు వివిధ భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగింది తమన్నా. కానీ కొన్నేళ్లుగా ఆమె ఐటెం సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది.…

4 hours ago

ప్ర‌భాస్- హీరోయిన్… చీర వెనుక క‌థ‌

రాజాసాబ్‌లో ప్ర‌భాస్‌కు జోడీగా ముగ్గురు హీరోయిన్లు న‌టించారు. అందులో రిద్ధి కుమార్‌పై మొన్న అంద‌రి దృష్టీ నిలిచింది. రాజాసాబ్ ప్రి…

5 hours ago