జగన్ హయాంలో ప్రభుత్వ సలహారులను లెక్కకు మించి నియమించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా నియమించిన సలహాదారుల్లో మెజారిటీ సలహాదారులు రాజకీయాలకు సంబంధించిన వారే ఉన్నారని, జగన్ సన్నిహితులను సలహాదారులుగా నియమించుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
అయితే, కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సమాజ హితం కోరి ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులను ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తోంది.
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావును ఏపీ ప్రభుత్వ విద్యార్థులు, నైతిక విలువల సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. అంతేకాదు, ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ కోవలోనే తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డా.మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వం నియమించింది.
ఏపీ ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు నేచురోపతి సలహాదుడి పదవిలో డా.మంతెన సత్యనారాయణ రాజు కొనసాగనున్నారు. ప్రకృతి వైద్యం, యోగాసనాల ద్వారా ప్రజలకు నేచురోపతి వైద్యాన్ని మంతెన రెండు దశాబ్దాలుగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఎండోమెంట్స్ సలహాదారుడిగా పోచంపల్లి శ్రీనివాస్ ను ప్రభుత్వం నియమించింది.
This post was last modified on December 29, 2025 10:58 pm
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…