తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచి ఒక లెక్క…ఇకపై ఒక లెక్క అని కేసీఆర్ చెప్పడంతో నేటి నుంచి జరగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని ప్రచారం జరిగింది.
ఆ ప్రచారానికి తగ్గట్లుగానే దాదాపు రెండేళ్ల తర్వాత కేసీఆర్ శాసన సభలో అడుగుపెట్టారు. అయితే, సమావేశాలు మొదలైన 10 నిమిషాలకే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు.
ఈ రోజు అసెంబ్లీలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న రీతిలో మాటల యుద్ధం ఉంటుందని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టి సభ మొదలైన10 నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అంతకుముందు, కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్ ఇచ్చి మర్యాదపూర్వకంగా పలకరించారని తెలుస్తోంది. కేసీఆర్ ఆరోగ్య, యోగక్షేమాలను రేవంత్ అడిగి తెలుసుకున్నారట.
అంతకుముందు సభలో దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మా రెడ్డిలకు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. సభ్యులంతా వారికి సంతాపం తెలిపారు. సంతాప తీర్మానాలు అయిపోయిన వెంటనే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు.
అయితే, రేపు లేదా ఈ శీతాకాల సమావేశాలు ముగిసేలోపు మరోసారి సభకు కేసీఆర్ వస్తారా? లేక డైరెక్ట్ గా వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. అయితే, అటెండెన్స్ కోసం మాత్రమే అసెంబ్లీకి వచ్చే ట్రెండ్ ను ఏపీ మాజీ సీఎం జగన్ స్టార్ట్ చేశారని, అదే రీతిలో జగన్ ను కేసీఆర్ ఫాలో అయ్యారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates