Political News

కూటమి ప్రభుత్వం పై రఘురామ అసంతృప్తి?

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును వైసీపీ ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్‌కు గురి చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2019–24 మధ్య కాలంలో వైసీపీ రెబల్ ఎంపీ అయిన రఘురామను సీఐడీ అధికారులు రాజద్రోహం కేసు పెట్టి కస్టడీలో హింసించిన ఘటన షాకింగ్‌గా మారింది.

ఈ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 16న ఆయనను దర్యాప్తు అధికారులు ఐదు గంటల పాటు విచారణ జరిపారు. అయినా సరే ఆయన నుంచి ఎటువంటి సమాధానాలు రాబట్టలేకపోయారు.

ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై రఘురామ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన రఘురామ వ్యాఖ్యలు చూస్తుంటే అదే స్పష్టంగా కనిపిస్తోంది. సునీల్ కుమార్‌పై దర్యాప్తు వేగవంతం చేసి కఠిన చర్యలు తీసుకోకుంటే తనకు వ్యక్తిగతంగా జరిగే నష్టమేమీ లేదని అన్నారు. కానీ ప్రభుత్వానికే నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, తనకు ఏ పార్టీ సహకారం అవసరం లేదని స్పష్టం చేశారు.

ఆధారాలు, సాక్షాలు చూపించినా… సంవత్సరంన్నర గడిచినా పీవీ సునీల్ కుమార్‌పై కేసు ముందుకు వెళ్లలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఎవరి సానుభూతి అవసరం లేదని చెప్పారు. వీలైనంత త్వరగా న్యాయం చేయాలని, అప్పుడే ప్రజలకు పాలనపై, పోలీసు వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని అన్నారు. లేదంటే భవిష్యత్తులో ప్రభుత్వానికే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు.

శిశుపాలుడు వంద తప్పులు చేస్తేగానీ శ్రీకృష్ణుడు సంహరించలేదని… అదే తరహాలో తమ ప్రభుత్వానికి పీవీ సునీల్ కుమార్‌ను శిక్షించే సాచురేషన్ పాయింట్ ఇంకా రాలేదేమోనని అసహనం వ్యక్తం చేశారు.

ఈ కేసులో తనకు సత్వర న్యాయం జరగకపోతే తన ఇమేజ్‌కు ఎలాంటి నష్టం లేదని, కానీ ప్రభుత్వానికే నష్టం ఉంటుందని చెప్పారు. తనకు గ్రాము నష్టం జరిగితే ప్రభుత్వానికి టన్నుల్లో నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. తాను ప్రభుత్వానికి దూరంగా, రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో గౌరవంగా ఉన్నానని చెప్పారు. తాను ఎంత సంతోషంగా ఉన్నానో తన ముఖం చూస్తేనే తెలుస్తుందన్నారు.

మొత్తానికి పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందన్న భావనలో రఘురామ అసహనం వ్యక్తం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on December 26, 2025 5:02 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

18 minutes ago

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

2 hours ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

3 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

3 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

5 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

6 hours ago