Political News

కూటమి ప్రభుత్వం పై రఘురామ అసంతృప్తి?

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును వైసీపీ ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్‌కు గురి చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2019–24 మధ్య కాలంలో వైసీపీ రెబల్ ఎంపీ అయిన రఘురామను సీఐడీ అధికారులు రాజద్రోహం కేసు పెట్టి కస్టడీలో హింసించిన ఘటన షాకింగ్‌గా మారింది.

ఈ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 16న ఆయనను దర్యాప్తు అధికారులు ఐదు గంటల పాటు విచారణ జరిపారు. అయినా సరే ఆయన నుంచి ఎటువంటి సమాధానాలు రాబట్టలేకపోయారు.

ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై రఘురామ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన రఘురామ వ్యాఖ్యలు చూస్తుంటే అదే స్పష్టంగా కనిపిస్తోంది. సునీల్ కుమార్‌పై దర్యాప్తు వేగవంతం చేసి కఠిన చర్యలు తీసుకోకుంటే తనకు వ్యక్తిగతంగా జరిగే నష్టమేమీ లేదని అన్నారు. కానీ ప్రభుత్వానికే నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, తనకు ఏ పార్టీ సహకారం అవసరం లేదని స్పష్టం చేశారు.

ఆధారాలు, సాక్షాలు చూపించినా… సంవత్సరంన్నర గడిచినా పీవీ సునీల్ కుమార్‌పై కేసు ముందుకు వెళ్లలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఎవరి సానుభూతి అవసరం లేదని చెప్పారు. వీలైనంత త్వరగా న్యాయం చేయాలని, అప్పుడే ప్రజలకు పాలనపై, పోలీసు వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని అన్నారు. లేదంటే భవిష్యత్తులో ప్రభుత్వానికే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు.

శిశుపాలుడు వంద తప్పులు చేస్తేగానీ శ్రీకృష్ణుడు సంహరించలేదని… అదే తరహాలో తమ ప్రభుత్వానికి పీవీ సునీల్ కుమార్‌ను శిక్షించే సాచురేషన్ పాయింట్ ఇంకా రాలేదేమోనని అసహనం వ్యక్తం చేశారు.

ఈ కేసులో తనకు సత్వర న్యాయం జరగకపోతే తన ఇమేజ్‌కు ఎలాంటి నష్టం లేదని, కానీ ప్రభుత్వానికే నష్టం ఉంటుందని చెప్పారు. తనకు గ్రాము నష్టం జరిగితే ప్రభుత్వానికి టన్నుల్లో నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. తాను ప్రభుత్వానికి దూరంగా, రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో గౌరవంగా ఉన్నానని చెప్పారు. తాను ఎంత సంతోషంగా ఉన్నానో తన ముఖం చూస్తేనే తెలుస్తుందన్నారు.

మొత్తానికి పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందన్న భావనలో రఘురామ అసహనం వ్యక్తం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on December 26, 2025 5:02 pm

Share
Show comments
Published by
Satya
Tags: RRR

Recent Posts

అర‌వింద స‌మేత తరువాత బాధపడ్డ హీరోయిన్

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అత్యుత్త‌మమైన‌, విభిన్న‌మైన చిత్రాల్లో అర‌వింద స‌మేత ఒక‌టి. అందులో కీల‌క పాత్ర‌లు పోషించిన ఆర్టిస్టులంద‌రికీ మంచి…

43 minutes ago

ఎవ‌రా హీరోయిన్… ద‌ర్శ‌కుడికి మినిస్ట‌ర్ల ఫోన్లు

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ కెరీర్లో చూడాల‌ని ఉంది, ఒక్క‌డు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో పాటు సైనికుడు, వ‌రుడు, నిప్పు లాంటి దారుణ‌మైన…

3 hours ago

10 వేల కెపాసిటీ బ్యాటరీతో ఫోన్ వచ్చేసింది

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రియల్‌మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్‌ను విడుదల చేసింది.…

8 hours ago

వెండి కూడా బంగారానికి చేరువయ్యేలా..

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…

9 hours ago

కూతురు కాదు కసాయి… షాకింగ్ ఘటన

అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…

9 hours ago

జగన్ పాదయాత్రపై షర్మిల సంచలన వ్యాఖలు

ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…

12 hours ago