బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు వరకు ఒక కథ.. రేపటి నుంచి మరో కథ.. అంటూ .. ఏకకాలంలో అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును కూడా హెచ్చరించారు. జలాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. “రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. దద్మమ్మ ప్రభుత్వం(కాంగ్రెస్) మాదిరి మేం చూస్తూ కూర్చోలేం. ఉద్యమిస్తాం. ఊరూ వాడా ఏకం చేస్తాం. అందరినీ కదిలిస్తాం.“ అంటూ.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు గుప్పించారు. తాజాగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
ప్రధానంగా పాలమూరు జిల్లాపై ఫోకస్ చేసిన ఆయన.. తాజాగా పార్టీ నాయకులతోనూ ఇదే విషయంపై చర్చించానన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణకు ద్రోహం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి వచ్చే నీళ్లలో వాటాను తెగ్గోసుకుంటూ.. అన్యాయం చేయడం లేదా? అని నిలదీశారు. గోదావరిలో 40టీఎంసీల వాటా చాలని కేంద్రానికి ఎలా లేఖ రాస్తారని పేరు ఎత్తకుండానే సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కారును దద్దమ్మ ప్రభుత్వంగా అభివర్ణించిన కేసీఆర్.. తెలంగాణ ప్రజల గొంతులు ఎండుతున్నా.. పొలాలు బీళ్లవుతున్నా.. సోయిలేకుండా పోయిందని దుయ్యబట్టారు.
సమయం ఇచ్చాం..
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కానీ, రాష్ట్ర ప్రయోజనాలకు గండికొట్టేలా వ్యవహరిస్తుంటే.. కడుపు రగిలిపోతోందన్నారు. “పాలమూరు ప్రజలు ఏం అన్యాయం చేశారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇక, ఉద్యమం చేపట్టక తప్పదు. ఇప్పటి వరకు చాలానే సమయం ఇచ్చాం. ఇక, వేచి చూసేది లేదు. మౌనంగా ఉండేది కూడా లేదు“ అని కేసీఆర్ స్పష్టం చేశారు. “ఇవాళ్టి వరకూ ఒక కథ..రేపటి నుంచి మరో కథ.“ అంటూ.. తనదైన శైలిలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం.. ప్రజల కోసం ఎందాకైనా పోరాడుతామన్న ఆయన వెనక్కి తగ్గేదేలేదన్నారు. ఎవరితోనూ.. మొహమాటాలు కూడా పోయేది లేదని చెప్పారు.
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…