ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి ప్రయత్నానికి అడ్డుకట్ట వేయాలని కుయుక్తులు పన్నుతోందంటూ టీడీపీ నేతలు అంటున్నారు.
వారి వాదనలకు బలాన్ని చేకూర్చేలా విశాఖపట్నంలో ఐటీ పార్క్ అభివృద్ధి కోసం రహేజా కార్ప్కు కేటాయించిన భూములపై ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అధ్యక్షుడు జి. శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయగా, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ ఘాటుగానే స్పందించారు. యువత భవిష్యత్తుపై ఇంత ద్వేషం ఎందుకు జగన్? రాష్ట్ర అభివృద్ధిని, పెట్టుబడులను ప్రతి అడుగులోనూ అడ్డుకోవాలనే ప్రయత్నం ఎందుకు? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా కలిపి లక్షకు పైగా ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ యువతకు అందే అవకాశం ఉందన్నారు. టీ సీఎస్, కాగ్నిజెంట్, సత్వా, తాజాగా రహేజా ఐటీ పార్కులపై వైసీపీ పిల్లు దాఖలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఏపీ అభివృద్ధిని, కూటమి ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకునేలా కేసులు వేయడం వైసీపీకి మొదటి నుంచి అలవాటు అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. డీఎస్సీ పై, పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లపై కేసులు వేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లక్షలాదిమందికి ఉపాధిని చేకూర్చే ఐటి కంపెనీలకు భూముల కేటాయింపు పై కేసులు వేయటం వారి దుర్మార్గపు చర్యకు నిదర్శనమని అంటున్నారు.
వారికి అభివృద్ధి చేయటం చేతకాదు, పైగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని వారి భావన. దీనిపైనే.. అభివృద్ధికి ఆటంకాలు తగునా జగన్ అంటూ లోకేష్ ప్రశ్నించారు.
This post was last modified on December 19, 2025 10:34 am
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…