Political News

జగన్ కోటి సంతకాల కృషి ఫలించేనా?

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ దానిని పూర్తి చేసింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఏపీ మాజీ సీఎం జగన్ కలిశారు. వైసీపీ నేతలు సేకరించిన కోటి సంతకాల ప్రతులను లోక భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు జగన్ అందించారు.

మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని జగన్ అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే జరిగే నష్టాలను గవర్నర్ కు వివరించామన్నారు. ప్రజల నిరసనలకు సంబంధించిన ఆధారాలతోపాటు కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందించామన్నారు. ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య విద్యను అందించాలని, వ్యవస్థలను ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు.

అంతకుముందు, కోటి సంతకాల ప్రతులతో అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాహనాలు తాడేపల్లి చేరుకోగా…వాటికి జగన్ పచ్చజెండా ఊపారు. అయితే, ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంపై కూటమి పార్టీల నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులే సంతకాలు చేసి కార్యక్రమం ముగించారని ఆరోపిస్తున్నారు.

ప్రజలు సంతకాలు చేసిన శాతం చాలా తక్కువ అని అంటున్నారు. ప్రజల నుంచి మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించడంపై వ్యతిరేకత లేదని, వైసీపీ కృత్రిమంగా క్రియేట్ చేసిన వ్యతిరేకత మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విషయంపై ఎటువంటి అభ్యంతరం తెలపని విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. దీంతో, జగన్ కోటి సంతకాల కృషి ఫలిస్తుందా? ఈ కార్యక్రమం ముగిసింది కాబట్టి..ఆయన తదుపరి కార్యచరణ ఏంటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

This post was last modified on December 18, 2025 6:37 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Jagan

Recent Posts

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

2 hours ago

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

3 hours ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

3 hours ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

4 hours ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

4 hours ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

4 hours ago