రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అడ్డంగా దొరికిపోయింది. అతను పార్టీకి ఏమాత్రం సంబంధం లేదంటూ ప్రకటన చేసిన వెంటనే..“జగనన్న నా దేవుడు… ఆయన లేకపోతే నేను ఇప్పటికీ జైలులో ఉండేవాడిని” అని అనిల్ చేసిన వ్యాఖ్యలు, గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమ కోసం వైసీపీ లాయర్లు పనిచేశారని, తన వెనక వైయస్ జగన్ నూటికి నూరు శాతం నిలబడ్డారని ఆయన తెలిపిన పాత వీడియోలు బయటకు రావడంతో, అనిల్–వైసీపీ మధ్య ఉన్న అనుబంధంపై నెటిజన్లు చర్చిస్తున్నారు.
రెండు వారాల కిందట హైదరాబాదులో జరిగిన జగన్ కోర్టు హాజరు ర్యాలీలో అనిల్ ప్రత్యక్షమై, వైసీపీ తరఫున మాట్లాడినట్లు వ్యాఖ్యానించడం అందరికీ గుర్తుండగానే, తాజాగా సంబంధం లేదని చెప్పడం రాజకీయ వర్గాల్లో హాస్యాస్పదంగా మారింది. ఈ నిర్ణయం రెండు మూడు ఏళ్ల కిందట తీసుకుని ఉంటే మంచిదని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి.
బోరుగడ్డ అనిల్ వ్యవహారం కారణంగా వైసీపీకి జరిగిన నష్టం ఎక్కువే అని విమర్శకులు అంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ఒక్క ప్రకటనతో అతనితో సంబంధం లేదని చెప్పుకోవడం పార్టీకి మాత్రమే సాధ్యమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులపై ఇతర పార్టీల్లో వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకునేవారన్నారు రాజకీయ పరిశీలకులు.
గత వైసీపీ ప్రభుత్వంలో అనిల్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఏకంగా చంద్రబాబునే చంపేస్తా అంటూ బెదిరించాడు. జగన్ ఓడిపోయిన తర్వాత కొంతకాలం అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత కూడా వార్తల్లో నిలిచారు.
బెయిలు కోసం తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారని కేసు కూడా నమోదయింది. అతనికి పోలీస్ స్టేషన్లో రాచ మర్యాదలు చేశారనే వీడియో బయటకు రావడంతో ఆ ఘటనకు సంబంధించిన పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. ఎన్ని జరుగుతున్నా మౌనంగా ఉన్న వైసిపి.. ఇప్పుడు అతనిపై ప్రకటన చేయటం వెనుక ఆంతర్యం ఏమిటో అనే చర్చ ఏపీలో జరుగుతోంది.
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…