చంద్రబాబు గవర్నమెంట్ లో అన్నింటికీ ఒక లెక్క ఉంటుంది… అది పక్కాగా ఉంటుంది. కేవలం నోటిమాటలు కాకుండా ప్రతిదానికి డేటా బేస్డ్ సమాచారంతో సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన సాగుతుంది అనేది ప్రజలు అధికారులలో ఉన్న నానుడి. అంకెలతో సహా ఆయన వివరిస్తుంటే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. నిన్నటి సమావేశంలో కూడా చంద్రబాబు మంత్రులు శాఖల వద్ద ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి డేటాను రిలీజ్ చేశారు. అందులో సీఎం సహా 25 మంది మంత్రుల పనితీరును అంచనా వేశారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఆయన అంకెలతో సహా వివరించారు.
పైళ్ల క్లియరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఆరో స్థానంలో ఉండటం, ఆ తర్వాత తొమ్మిదో స్థానంలో నారా లోకేష్, 11వ స్థానంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండడం గమనార్హం. వీరి ముగ్గురిని కాదని ఐదుగురు మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్ లో ముందున్నారు. డోలా బాల వీరాంజనేయ స్వామి ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. ఆయన ప్రజల సమస్యల ఫైళ్ళ ను పరిశీలించిన సగటు సమయం రెండు రోజుల 41 నిమిషాలు. మొత్తం 651 ఆయన క్లియర్ చేశారు. ఆ తర్వాత స్థానాల్లో మంత్రులు నిమ్మల రామానాయుడు, ఎన్ ఎస్ డి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, పొంగూరు నారాయణ ఉన్నారు . చివరి ఐదు స్థానాల్లో మంత్రులు కొలుసు పార్థసారధి, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సంక్రాంతి నుంచి ప్రజలకు అన్ని సేవలు ఆన్ లైన్లోనే అందజేయాలన్నారు. ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలందిస్తున్నాయని అలాంటి శాఖలు వెంటనే తమ పంథా మార్చుకుని ప్రజలకు ఆన్లైన్లో సేవలందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలన్నీ, ప్రభుత్వ కార్యాలయాలకు తిరగనవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం చెప్పారు.
This post was last modified on December 11, 2025 10:20 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…