Political News

ఇండిగో సంక్షోభంపై చంద్ర‌బాబు ఫ‌స్ట్ రియాక్ష‌న్‌!

దేశాన్ని కుదిపేస్తున్న ఇండిగో విమానాల సంక్షోభంపై ఏపీ సీఎం చంద్ర‌బాబు తొలిసారి స్పందించారు. సోమ‌వారం రాత్రి ఆయ‌న అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విష‌యంలో ఏపీ సీఎంగా కానీ.. టీడీపీ అధినేత‌గా కానీ.. త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. అస‌లు ఇది ఇండిగో సృష్టించిన స‌మ‌స్య‌గా ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం, డీజీసీఏ(డైరెక్ట‌రేట్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్‌) విధించిన నిబంధ‌న‌లను ఇండిగో పాటించ‌లేద‌న్నారు. వాస్త‌వానికి గ‌త ఏడాది న‌వంబ‌రులోనే ఈ నిబంధ‌న‌లు పాటించాల‌ని కేంద్రం చెప్పింద‌న్నారు.

కానీ, ఈ విష‌యంలో ఇండిగో సంస్థ త‌ప్పులు చేసింద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఎలాంటి సంస్థ అయినా.. నిబంధ‌న‌లు పాటించాల్సిందేన‌ని చెప్పారు. కేంద్రం నిర్దేశించిన నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌కుండా.. ప్ర‌యాణికుల‌ను ఇబ్బంది పెట్టిన వ్య‌వ‌హారం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్రం స‌హా పౌర విమాన‌యాన శాఖ మంత్రి చూసుకుంటార‌ని చెప్పారు. దీనిలో త‌న పాత్ర కానీ.. త‌న స‌ల‌హాలు కానీ అవస‌రం లేద‌న్నారు. ఇక‌, కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడిపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను చంద్ర‌బాబు తోసిపుచ్చారు. ఇది స‌రికాదన్నారు.

రాష్ట్రంలో కొంద‌రు ప‌నిలేని వారే ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రిగా రామ్మోహ‌న్ నాయుడికి పార్ల‌మెంటుకు, ప్ర‌ధానికి స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త ఉంటుంద‌న్నారు. ఇంకెవ‌రికీ స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. టీడీపీ పార్ల‌మెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు, ఆ పార్టీ ఎంపీలు డిల్లీలో సోమ‌వారం రాత్రి మీడియాతో మాట్లాడారు. రామ్మోహ‌న్ నాయుడు స‌మ‌ర్థ‌వంతంగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు చెప్పారు.

అయితే..ఏపీలో వైసీపీ స‌హా కొన్ని చానెళ్లు దీనిని రాద్ధాంతం చేస్తున్నాయ‌ని.. రామ్మోహ‌న్ నాయుడిపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇలాంటి విమ‌ర్శ‌లు స‌రికావ‌ని.. రామ్మోహ‌న్ నాయుడు నిరంత‌రం.. ప‌నిచేస్తున్నార‌ని చెప్పారు. కొత్త టెర్మిన‌ళ్ల నిర్మాణం, కొత్త విమానయాన సంస్థ‌ల‌కు అనుమ‌తి కూడా ఇచ్చార‌ని తెలిపారు. ఆయన ప‌నితీరు తెలిసిన వారు ఎవ‌రూ విమ‌ర్శించ‌ర‌ని, ఒక సంక్షోభాన్ని కూడా రాజ‌కీయాల‌కు వినియోగించుకోవ‌డం స‌రికాద‌ని ఎంపీలు వ్యాఖ్యానించారు.

This post was last modified on December 9, 2025 11:32 am

Share

Recent Posts

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

24 minutes ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

1 hour ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

2 hours ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

2 hours ago

సూర్య పాత్రలో షాకింగ్ ట్విస్టుందా?

తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…

2 hours ago

విజయవాడ మేయర్ రేసుకు పోటాపోటీ

విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…

3 hours ago