వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ తీవ్రంగా కుదుపునకు గురైందని సీఎం చంద్రబాబు చెప్పారు. జగన్ దెబ్బకు ఏపీ బ్రాండ్ కదిలిపోయింది. దీనిని మళ్లీ పునరుద్ధరిస్తున్నాం. ఒక వ్యవస్థను ఎంతగా ధ్వంసం చేయాలో అంతా చేశారు. అదే వ్యవస్థను బాగు చేసేందుకు తిరిగి గాడిలో పెట్టేందుకు ఎంతో శ్రమిస్తున్నాం అని వ్యాఖ్యానించారు.
ఒకవైపు గత పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను బాగు చేస్తూనే మరోవైపు కొత్త వ్యవస్థలను తీసుకువస్తున్నామని తెలిపారు. అదే సమయంలో ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రం ఇంకా క్లిష్ట పరిస్థితిలోనే ఉందన్న చంద్రబాబు వైసీపీ హయాంలో జరిగిన దోపిడి నిధుల విధ్వంసం వంటి వాటిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని వివరించారు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికి పదిహేడు నెలలుగా వ్యవస్థలను చక్కదిద్దే పనిలో ఉన్నాం. అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అంటే వ్యవస్థలను ఎంతగా దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు అని తెలిపారు.
ఐదు సంవత్సరాల విధ్వంసం కారణంగా రాష్ట్రానికి ఆదాయం ఆగిపోయిందని దీంతో ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెప్పారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పిన చంద్రబాబు ఇదే సమయంలో కేంద్ర ప్రాయోజిత పథకాలను కూడా సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఇంకా కొంత సమయం వేచి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు అనుకున్నవి అన్నీ జరిగిపోవని గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వమే ఉన్నా పరిస్థితి ఇలా ఉండేది కాదని తెలిపారు. రాష్ట్రం ఈ దేశానికే ఒక ఆదర్శంగా నిలిచేది అని చెప్పారు.
ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చి అన్ని వ్యవస్థలను భగ్నం చేశారని వైసీపీపై మండిపడ్డారు.
This post was last modified on December 8, 2025 7:00 pm
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…