Political News

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ చేపట్టారు. ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వందేమాతరం స్ఫూర్తిని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తి కర పరిణామం జరిగింది. వందేమాతరం రూపకర్త బంకిమ్ చంద్ర ఛటర్జీని పలుమార్లు ప్రధాని మోదీ.. బంకిమ్ దా అంటూ సంబోధించారు. దీనిపై సభలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ అభ్యంతరం చెప్పారు.

ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలోనే బంకిమ్ దా.. అని కాదంటూ తెలిపారు. దీంతో ఒక్కసారిగా ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ఆపివేశారు. ‘బంకిమ్ దా కాదు.. బంకిమ్ బాబు అనాలి,” అన్నారు. బెంగాళీలో ‘దా’ అనేది సాధారణంగా అన్న, స్నేహితుడు లేదా పరిచయస్తులకు వినియోగించే పదమని ఎంపీ సౌగత్ రాయ్ వివరించారు. వెంటనే సరిచేసుకున్న మోదీ ఇక నుంచి బంకిమ్ బాబు అని సంబోధిస్తానని అన్నారు.

‘సరే, బంకిమ్ బాబు అని చెబుతాను. మీ భావాలను గౌరవిస్తున్నాను..’ అని అన్నారు. ఆ క్రమంలోనే మిమ్మల్ని కూడా నేను దాదా అని పిలిస్తే అభ్యంతరం ఏమైనా ఉందా అని చమత్కరించారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. మోదీ ప్రసంగం చేస్తుండగా జరిగిన ఈ ఘటన ఆసక్తిని రేకెత్తించింది. మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వందే మాతరం కేవలం ఒక మంత్రం కాదు, నినాదం కాదన్నారు.

భారతమాతను వలస పాలన నుంచి విముక్తి చేయాలనే పవిత్ర యుద్ధ పిలుపు అని అన్నారు. వందే మాతరం స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాదు. అది రాజకీయ స్వాతంత్ర్యాన్ని దాటి, దేశాన్ని బానిసత్వం నుంచి విముక్తం చేయాలనే మహోన్నత లక్ష్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ 150 ఏళ్ల సంబరాలను మనం సాక్ష్యులుగా చూడడం గర్వకారణం అని ప్రధాని పేర్కొన్నారు. కాగా ఈరోజు పార్లమెంటు సమావేశాలకు ప్రతిపక్ష నేత రాహుల్, సోనియా గాంధీ హాజరు కాకపోవడం గమనార్హం.

This post was last modified on December 8, 2025 5:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

48 minutes ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

2 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

2 hours ago

‘జగన్ దెబ్బకు ఏపీ బ్రాండ్ కదలిపోయింది’

వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ తీవ్రంగా కుదుపునకు గురైందని సీఎం చంద్రబాబు చెప్పారు. జగన్ దెబ్బకు ఏపీ బ్రాండ్ కదిలిపోయింది.…

4 hours ago

మీ ఆవిడ ఇండియన్ కాదా? US వైస్ ప్రెసిడెంట్ కు షాక్

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ వలసదారుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.…

7 hours ago

డిసెంబర్ 12 – పోటీ గట్టిగానే ఉంది గురూ

మొన్న శుక్రవారం రావాల్సిన అఖండ 2 వాయిదా పడటంతో థియేటర్లు బోసిపోతున్నాయి. ఉన్నంతలో ఆంధ్రకింగ్ తాలూకా, రాజు వెడ్స్ రాంబాయి,…

7 hours ago