Political News

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ చేపట్టారు. ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వందేమాతరం స్ఫూర్తిని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తి కర పరిణామం జరిగింది. వందేమాతరం రూపకర్త బంకిమ్ చంద్ర ఛటర్జీని పలుమార్లు ప్రధాని మోదీ.. బంకిమ్ దా అంటూ సంబోధించారు. దీనిపై సభలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ అభ్యంతరం చెప్పారు.

ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలోనే బంకిమ్ దా.. అని కాదంటూ తెలిపారు. దీంతో ఒక్కసారిగా ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ఆపివేశారు. ‘బంకిమ్ దా కాదు.. బంకిమ్ బాబు అనాలి,” అన్నారు. బెంగాళీలో ‘దా’ అనేది సాధారణంగా అన్న, స్నేహితుడు లేదా పరిచయస్తులకు వినియోగించే పదమని ఎంపీ సౌగత్ రాయ్ వివరించారు. వెంటనే సరిచేసుకున్న మోదీ ఇక నుంచి బంకిమ్ బాబు అని సంబోధిస్తానని అన్నారు.

‘సరే, బంకిమ్ బాబు అని చెబుతాను. మీ భావాలను గౌరవిస్తున్నాను..’ అని అన్నారు. ఆ క్రమంలోనే మిమ్మల్ని కూడా నేను దాదా అని పిలిస్తే అభ్యంతరం ఏమైనా ఉందా అని చమత్కరించారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. మోదీ ప్రసంగం చేస్తుండగా జరిగిన ఈ ఘటన ఆసక్తిని రేకెత్తించింది. మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వందే మాతరం కేవలం ఒక మంత్రం కాదు, నినాదం కాదన్నారు.

భారతమాతను వలస పాలన నుంచి విముక్తి చేయాలనే పవిత్ర యుద్ధ పిలుపు అని అన్నారు. వందే మాతరం స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాదు. అది రాజకీయ స్వాతంత్ర్యాన్ని దాటి, దేశాన్ని బానిసత్వం నుంచి విముక్తం చేయాలనే మహోన్నత లక్ష్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ 150 ఏళ్ల సంబరాలను మనం సాక్ష్యులుగా చూడడం గర్వకారణం అని ప్రధాని పేర్కొన్నారు. కాగా ఈరోజు పార్లమెంటు సమావేశాలకు ప్రతిపక్ష నేత రాహుల్, సోనియా గాంధీ హాజరు కాకపోవడం గమనార్హం.

This post was last modified on December 8, 2025 5:02 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

33 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

49 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago