ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు ‘ఫ్రీ బీస్’ ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది. ప్రజలు అలవాటు పడ్డారని చెప్పలేం కానీ.. నాయకులకు ఇలా ఉచితాలు ప్రకటించడం.. హాబీగా.. అంతకుమించి భరోసాగా మారిపోయింది. దీంతో ఇప్పుడు ఎన్నికల స్థాయితో సంబంధం లేకుండా.. నాయకులు హామీలు గుప్పిస్తున్నారు.
తాజాగా తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో చిత్రమైన హామీ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో వార్డు స్థానానికి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి భర్త ఇక్కడి ప్రజలకు విచిత్ర హామీ ఇచ్చారు. ‘నా భార్యను వార్డు మెంబర్ గా గెలిపిస్తే నా వార్డు పరిధిలోని పురుషులందరికీ ఐదేళ్లపాటు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తా. అలాగే వార్డును అభివృద్ధి చేస్తా’ అని చెప్పారు. ఆయన హామీ చుట్టుపక్కల గ్రామాల్లో తెగ వైరల్ అవుతోంది.
ఇదొక్కటే కాదు.. ఇదే జిల్లాలోని దుబ్బాక మండలంలో ఉన్న మరో వార్డులో సభ్యురాలిగా పోటీ చేస్తున్న మహిళ ఒకరు.. ప్రతి ఇంటికీ కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఇది పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ, చర్చ అయితే జరుగుతోంది. మరోవైపు ఏకగ్రీవాల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పోటీ లేకుండా.. గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇక, మరికొన్ని చోట్ల వేలం పాటలు పెట్టుకుని సర్పంచులను ఎన్నుకున్నారు. ఇలా.. ఎవరికి వారు.. ప్రయత్నాలుముమ్మరం చేస్తున్నారు. అయితే.. పంచాయతీ ఎన్నికల్లో హామీలు ఏమేరకు వర్కువుట్ అవుతాయన్నది ప్రశ్న. ఎందుకంటే సామాజిక వర్గాలు, కుల సమీకరణలు, పార్టీల మద్దతు ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న దరిమిలా.. ఇలాంటి హామీలు వర్కవుట్ అవుతాయా? అనేది చూడాలి.
This post was last modified on December 5, 2025 1:51 pm
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…