ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు ‘ఫ్రీ బీస్’ ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది. ప్రజలు అలవాటు పడ్డారని చెప్పలేం కానీ.. నాయకులకు ఇలా ఉచితాలు ప్రకటించడం.. హాబీగా.. అంతకుమించి భరోసాగా మారిపోయింది. దీంతో ఇప్పుడు ఎన్నికల స్థాయితో సంబంధం లేకుండా.. నాయకులు హామీలు గుప్పిస్తున్నారు.
తాజాగా తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో చిత్రమైన హామీ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో వార్డు స్థానానికి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి భర్త ఇక్కడి ప్రజలకు విచిత్ర హామీ ఇచ్చారు. ‘నా భార్యను వార్డు మెంబర్ గా గెలిపిస్తే నా వార్డు పరిధిలోని పురుషులందరికీ ఐదేళ్లపాటు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తా. అలాగే వార్డును అభివృద్ధి చేస్తా’ అని చెప్పారు. ఆయన హామీ చుట్టుపక్కల గ్రామాల్లో తెగ వైరల్ అవుతోంది.
ఇదొక్కటే కాదు.. ఇదే జిల్లాలోని దుబ్బాక మండలంలో ఉన్న మరో వార్డులో సభ్యురాలిగా పోటీ చేస్తున్న మహిళ ఒకరు.. ప్రతి ఇంటికీ కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఇది పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ, చర్చ అయితే జరుగుతోంది. మరోవైపు ఏకగ్రీవాల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పోటీ లేకుండా.. గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇక, మరికొన్ని చోట్ల వేలం పాటలు పెట్టుకుని సర్పంచులను ఎన్నుకున్నారు. ఇలా.. ఎవరికి వారు.. ప్రయత్నాలుముమ్మరం చేస్తున్నారు. అయితే.. పంచాయతీ ఎన్నికల్లో హామీలు ఏమేరకు వర్కువుట్ అవుతాయన్నది ప్రశ్న. ఎందుకంటే సామాజిక వర్గాలు, కుల సమీకరణలు, పార్టీల మద్దతు ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న దరిమిలా.. ఇలాంటి హామీలు వర్కవుట్ అవుతాయా? అనేది చూడాలి.
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…