Political News

శ్రీవారి వైకుంఠ ద‌ర్శ‌నం… సెక‌నుకు 8 మంది!

ఔను! నిజం. మీరు చ‌దివింది అక్ష‌రాలా క‌రెక్టే!. సెక‌ను అంటే రెప్ప‌పాటు కాలం. ఈ రెప్ప‌పాటు కాలంలోనే అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు 8 మందిని అనుమ‌తిస్తున్నారు. ఇది సాధ్య‌మేనా? క‌నీసం.. శ్రీనివాసుని రూపు రేఖ‌లైనా క‌నిపిస్తాయా? క‌నీసం ఆయ‌న తిరునామం అయినా గోచ‌రిస్తుందా? అంటే.. అది `భ‌క్తికి` సంబంధించిన విష‌యం. ఎవ‌రి అదృష్టం వారిది. ఈ నెల 30వ తేదీ నుంచి 8 రోజుల పాటు తిరుమ‌ల‌లో నిర్వ‌హించ‌నున్న వైకుంఠ వేకాద‌శి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా.. శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు అధికారులు ప‌లువిధాలుగా అవ‌కాశం క‌ల్పించారు.

ఈ క్ర‌మంలో భ‌క్తుల సంఖ్య‌.. అధికారులు శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు.. కేటాయించిన గంట‌ల‌ను ప‌రిశీలిస్తే.. సెక‌నుకు 8 మంది భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక‌, మ‌రో చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. శ్రీవారికి ఇస్తున్న రెస్టు స‌మ‌యం(విశ్రాంతి స‌మ‌యం) ఆ వారం రోజుల్లో కేవ‌లం 2 నుంచి 2.30 గంట‌లు మాత్ర‌మే. సాధార‌ణ రోజుల్లో 4 గంట‌ల పాటు శ్రీవారికి రెస్టు ఇస్తుండ‌గా.. ఇప్పుడు దానిని బాగా కుదించారు. అంటే.. అటు శ్రీవారు కూడా త‌న భ‌క్తుల కోసం.. రెస్టు స‌మ‌యాన్ని త్యాగం చేస్తున్నార‌నే చెప్పాలి.

ఇవీ వేళ‌లు..

+ వైకుంఠ ఏకాద‌శికి సంబంధించి తొలి మూడు రోజుల‌పాటు భ‌క్తుల‌కు కేటాయించిన టికెట్లు, ద‌ర్శ‌న స‌మ‌యాన్ని టీటీడీ వెల్ల‌డించింది.

+ తొలిరోజు 30వ తేదీ స్వామి 20 గంట‌ల పాటు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఆ రోజు ఏకంగా 57 వేల మందిని ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్నారు. అంటే.. గంట‌కు 2850 మంది, నిముషానికి 48 మంది, సెక‌నుకు 8 మంది చొప్పున శ్రీవారిని ద‌ర్శించుకుంటారు.

+ ఇదే రోజు(30న‌) వీపీఐల‌కు 4.30 గంట‌లు కేటాయించారు. అంటే..ఆ స‌మ‌యంలో సామాన్యులు వేచి ఉండ‌క త‌ప్ప‌దు.

+ 31వ తేదీనాడు.. ఏకంగా 64 వేల మందికి టికెట్లు ఇచ్చారు. ఈ రోజు కూడా 20గంట‌ల చొప్పున స్వామిద‌ర్శ‌న‌మిస్తారు. కానీ, సెక‌నుకు 10 మంది చొప్పున ద‌ర్శ‌నం చేసుకోవాలి.

+ జనవరి 1న దర్శనానికి 55 వేల మందికి టికెట్లు ఇచ్చారు. ఆరోజు కూడా సెక‌నుకు 8 మంది చొప్పునే ద‌ర్శ‌నం చేసుకోవాలి.

+ అదృష్టం ఏంటంటే.. ఈ మూడు రోజుల‌పాటు అన్ని వీఐపీ, ప్రొటోకాల్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేశారు. కానీ.. మ‌ధ్య‌లో నైవేద్య విరామ ద‌ర్శ‌నాల స‌మ‌యంలో వీఐపీల‌ను అనుమ‌తిస్తారు.

This post was last modified on December 3, 2025 9:13 am

Share
Show comments
Published by
Kumar
Tags: Tirumala

Recent Posts

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

4 minutes ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

39 minutes ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

1 hour ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

5 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

6 hours ago