ఔను! నిజం. మీరు చదివింది అక్షరాలా కరెక్టే!. సెకను అంటే రెప్పపాటు కాలం. ఈ రెప్పపాటు కాలంలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 8 మందిని అనుమతిస్తున్నారు. ఇది సాధ్యమేనా? కనీసం.. శ్రీనివాసుని రూపు రేఖలైనా కనిపిస్తాయా? కనీసం ఆయన తిరునామం అయినా గోచరిస్తుందా? అంటే.. అది `భక్తికి` సంబంధించిన విషయం. ఎవరి అదృష్టం వారిది. ఈ నెల 30వ తేదీ నుంచి 8 రోజుల పాటు తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ వేకాదశి పర్వదినం సందర్భంగా.. శ్రీవారిని దర్శించుకునేందుకు అధికారులు పలువిధాలుగా అవకాశం కల్పించారు.
ఈ క్రమంలో భక్తుల సంఖ్య.. అధికారులు శ్రీవారిని దర్శించుకునేందుకు.. కేటాయించిన గంటలను పరిశీలిస్తే.. సెకనుకు 8 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక, మరో చిత్రమైన విషయం ఏంటంటే.. శ్రీవారికి ఇస్తున్న రెస్టు సమయం(విశ్రాంతి సమయం) ఆ వారం రోజుల్లో కేవలం 2 నుంచి 2.30 గంటలు మాత్రమే. సాధారణ రోజుల్లో 4 గంటల పాటు శ్రీవారికి రెస్టు ఇస్తుండగా.. ఇప్పుడు దానిని బాగా కుదించారు. అంటే.. అటు శ్రీవారు కూడా తన భక్తుల కోసం.. రెస్టు సమయాన్ని త్యాగం చేస్తున్నారనే చెప్పాలి.
ఇవీ వేళలు..
+ వైకుంఠ ఏకాదశికి సంబంధించి తొలి మూడు రోజులపాటు భక్తులకు కేటాయించిన టికెట్లు, దర్శన సమయాన్ని టీటీడీ వెల్లడించింది.
+ తొలిరోజు 30వ తేదీ స్వామి 20 గంటల పాటు భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు ఏకంగా 57 వేల మందిని దర్శనానికి అనుమతిస్తున్నారు. అంటే.. గంటకు 2850 మంది, నిముషానికి 48 మంది, సెకనుకు 8 మంది చొప్పున శ్రీవారిని దర్శించుకుంటారు.
+ ఇదే రోజు(30న) వీపీఐలకు 4.30 గంటలు కేటాయించారు. అంటే..ఆ సమయంలో సామాన్యులు వేచి ఉండక తప్పదు.
+ 31వ తేదీనాడు.. ఏకంగా 64 వేల మందికి టికెట్లు ఇచ్చారు. ఈ రోజు కూడా 20గంటల చొప్పున స్వామిదర్శనమిస్తారు. కానీ, సెకనుకు 10 మంది చొప్పున దర్శనం చేసుకోవాలి.
+ జనవరి 1న దర్శనానికి 55 వేల మందికి టికెట్లు ఇచ్చారు. ఆరోజు కూడా సెకనుకు 8 మంది చొప్పునే దర్శనం చేసుకోవాలి.
+ అదృష్టం ఏంటంటే.. ఈ మూడు రోజులపాటు అన్ని వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాలను రద్దు చేశారు. కానీ.. మధ్యలో నైవేద్య విరామ దర్శనాల సమయంలో వీఐపీలను అనుమతిస్తారు.
This post was last modified on December 3, 2025 9:13 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…