ఔను! నిజం. మీరు చదివింది అక్షరాలా కరెక్టే!. సెకను అంటే రెప్పపాటు కాలం. ఈ రెప్పపాటు కాలంలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 8 మందిని అనుమతిస్తున్నారు. ఇది సాధ్యమేనా? కనీసం.. శ్రీనివాసుని రూపు రేఖలైనా కనిపిస్తాయా? కనీసం ఆయన తిరునామం అయినా గోచరిస్తుందా? అంటే.. అది `భక్తికి` సంబంధించిన విషయం. ఎవరి అదృష్టం వారిది. ఈ నెల 30వ తేదీ నుంచి 8 రోజుల పాటు తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ వేకాదశి పర్వదినం సందర్భంగా.. శ్రీవారిని దర్శించుకునేందుకు అధికారులు పలువిధాలుగా అవకాశం కల్పించారు.
ఈ క్రమంలో భక్తుల సంఖ్య.. అధికారులు శ్రీవారిని దర్శించుకునేందుకు.. కేటాయించిన గంటలను పరిశీలిస్తే.. సెకనుకు 8 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక, మరో చిత్రమైన విషయం ఏంటంటే.. శ్రీవారికి ఇస్తున్న రెస్టు సమయం(విశ్రాంతి సమయం) ఆ వారం రోజుల్లో కేవలం 2 నుంచి 2.30 గంటలు మాత్రమే. సాధారణ రోజుల్లో 4 గంటల పాటు శ్రీవారికి రెస్టు ఇస్తుండగా.. ఇప్పుడు దానిని బాగా కుదించారు. అంటే.. అటు శ్రీవారు కూడా తన భక్తుల కోసం.. రెస్టు సమయాన్ని త్యాగం చేస్తున్నారనే చెప్పాలి.
ఇవీ వేళలు..
+ వైకుంఠ ఏకాదశికి సంబంధించి తొలి మూడు రోజులపాటు భక్తులకు కేటాయించిన టికెట్లు, దర్శన సమయాన్ని టీటీడీ వెల్లడించింది.
+ తొలిరోజు 30వ తేదీ స్వామి 20 గంటల పాటు భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు ఏకంగా 57 వేల మందిని దర్శనానికి అనుమతిస్తున్నారు. అంటే.. గంటకు 2850 మంది, నిముషానికి 48 మంది, సెకనుకు 8 మంది చొప్పున శ్రీవారిని దర్శించుకుంటారు.
+ ఇదే రోజు(30న) వీపీఐలకు 4.30 గంటలు కేటాయించారు. అంటే..ఆ సమయంలో సామాన్యులు వేచి ఉండక తప్పదు.
+ 31వ తేదీనాడు.. ఏకంగా 64 వేల మందికి టికెట్లు ఇచ్చారు. ఈ రోజు కూడా 20గంటల చొప్పున స్వామిదర్శనమిస్తారు. కానీ, సెకనుకు 10 మంది చొప్పున దర్శనం చేసుకోవాలి.
+ జనవరి 1న దర్శనానికి 55 వేల మందికి టికెట్లు ఇచ్చారు. ఆరోజు కూడా సెకనుకు 8 మంది చొప్పునే దర్శనం చేసుకోవాలి.
+ అదృష్టం ఏంటంటే.. ఈ మూడు రోజులపాటు అన్ని వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాలను రద్దు చేశారు. కానీ.. మధ్యలో నైవేద్య విరామ దర్శనాల సమయంలో వీఐపీలను అనుమతిస్తారు.
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…