Political News

శ్రీవారి వైకుంఠ ద‌ర్శ‌నం… సెక‌నుకు 8 మంది!

ఔను! నిజం. మీరు చ‌దివింది అక్ష‌రాలా క‌రెక్టే!. సెక‌ను అంటే రెప్ప‌పాటు కాలం. ఈ రెప్ప‌పాటు కాలంలోనే అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు 8 మందిని అనుమ‌తిస్తున్నారు. ఇది సాధ్య‌మేనా? క‌నీసం.. శ్రీనివాసుని రూపు రేఖ‌లైనా క‌నిపిస్తాయా? క‌నీసం ఆయ‌న తిరునామం అయినా గోచ‌రిస్తుందా? అంటే.. అది `భ‌క్తికి` సంబంధించిన విష‌యం. ఎవ‌రి అదృష్టం వారిది. ఈ నెల 30వ తేదీ నుంచి 8 రోజుల పాటు తిరుమ‌ల‌లో నిర్వ‌హించ‌నున్న వైకుంఠ వేకాద‌శి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా.. శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు అధికారులు ప‌లువిధాలుగా అవ‌కాశం క‌ల్పించారు.

ఈ క్ర‌మంలో భ‌క్తుల సంఖ్య‌.. అధికారులు శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు.. కేటాయించిన గంట‌ల‌ను ప‌రిశీలిస్తే.. సెక‌నుకు 8 మంది భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక‌, మ‌రో చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. శ్రీవారికి ఇస్తున్న రెస్టు స‌మ‌యం(విశ్రాంతి స‌మ‌యం) ఆ వారం రోజుల్లో కేవ‌లం 2 నుంచి 2.30 గంట‌లు మాత్ర‌మే. సాధార‌ణ రోజుల్లో 4 గంట‌ల పాటు శ్రీవారికి రెస్టు ఇస్తుండ‌గా.. ఇప్పుడు దానిని బాగా కుదించారు. అంటే.. అటు శ్రీవారు కూడా త‌న భ‌క్తుల కోసం.. రెస్టు స‌మ‌యాన్ని త్యాగం చేస్తున్నార‌నే చెప్పాలి.

ఇవీ వేళ‌లు..

+ వైకుంఠ ఏకాద‌శికి సంబంధించి తొలి మూడు రోజుల‌పాటు భ‌క్తుల‌కు కేటాయించిన టికెట్లు, ద‌ర్శ‌న స‌మ‌యాన్ని టీటీడీ వెల్ల‌డించింది.

+ తొలిరోజు 30వ తేదీ స్వామి 20 గంట‌ల పాటు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఆ రోజు ఏకంగా 57 వేల మందిని ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్నారు. అంటే.. గంట‌కు 2850 మంది, నిముషానికి 48 మంది, సెక‌నుకు 8 మంది చొప్పున శ్రీవారిని ద‌ర్శించుకుంటారు.

+ ఇదే రోజు(30న‌) వీపీఐల‌కు 4.30 గంట‌లు కేటాయించారు. అంటే..ఆ స‌మ‌యంలో సామాన్యులు వేచి ఉండ‌క త‌ప్ప‌దు.

+ 31వ తేదీనాడు.. ఏకంగా 64 వేల మందికి టికెట్లు ఇచ్చారు. ఈ రోజు కూడా 20గంట‌ల చొప్పున స్వామిద‌ర్శ‌న‌మిస్తారు. కానీ, సెక‌నుకు 10 మంది చొప్పున ద‌ర్శ‌నం చేసుకోవాలి.

+ జనవరి 1న దర్శనానికి 55 వేల మందికి టికెట్లు ఇచ్చారు. ఆరోజు కూడా సెక‌నుకు 8 మంది చొప్పునే ద‌ర్శ‌నం చేసుకోవాలి.

+ అదృష్టం ఏంటంటే.. ఈ మూడు రోజుల‌పాటు అన్ని వీఐపీ, ప్రొటోకాల్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేశారు. కానీ.. మ‌ధ్య‌లో నైవేద్య విరామ ద‌ర్శ‌నాల స‌మ‌యంలో వీఐపీల‌ను అనుమ‌తిస్తారు.

This post was last modified on December 3, 2025 9:13 am

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

1 hour ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

2 hours ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

3 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

4 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

8 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

9 hours ago