ఔను! నిజం. మీరు చదివింది అక్షరాలా కరెక్టే!. సెకను అంటే రెప్పపాటు కాలం. ఈ రెప్పపాటు కాలంలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 8 మందిని అనుమతిస్తున్నారు. ఇది సాధ్యమేనా? కనీసం.. శ్రీనివాసుని రూపు రేఖలైనా కనిపిస్తాయా? కనీసం ఆయన తిరునామం అయినా గోచరిస్తుందా? అంటే.. అది `భక్తికి` సంబంధించిన విషయం. ఎవరి అదృష్టం వారిది. ఈ నెల 30వ తేదీ నుంచి 8 రోజుల పాటు తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ వేకాదశి పర్వదినం సందర్భంగా.. శ్రీవారిని దర్శించుకునేందుకు అధికారులు పలువిధాలుగా అవకాశం కల్పించారు.
ఈ క్రమంలో భక్తుల సంఖ్య.. అధికారులు శ్రీవారిని దర్శించుకునేందుకు.. కేటాయించిన గంటలను పరిశీలిస్తే.. సెకనుకు 8 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక, మరో చిత్రమైన విషయం ఏంటంటే.. శ్రీవారికి ఇస్తున్న రెస్టు సమయం(విశ్రాంతి సమయం) ఆ వారం రోజుల్లో కేవలం 2 నుంచి 2.30 గంటలు మాత్రమే. సాధారణ రోజుల్లో 4 గంటల పాటు శ్రీవారికి రెస్టు ఇస్తుండగా.. ఇప్పుడు దానిని బాగా కుదించారు. అంటే.. అటు శ్రీవారు కూడా తన భక్తుల కోసం.. రెస్టు సమయాన్ని త్యాగం చేస్తున్నారనే చెప్పాలి.
ఇవీ వేళలు..
+ వైకుంఠ ఏకాదశికి సంబంధించి తొలి మూడు రోజులపాటు భక్తులకు కేటాయించిన టికెట్లు, దర్శన సమయాన్ని టీటీడీ వెల్లడించింది.
+ తొలిరోజు 30వ తేదీ స్వామి 20 గంటల పాటు భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు ఏకంగా 57 వేల మందిని దర్శనానికి అనుమతిస్తున్నారు. అంటే.. గంటకు 2850 మంది, నిముషానికి 48 మంది, సెకనుకు 8 మంది చొప్పున శ్రీవారిని దర్శించుకుంటారు.
+ ఇదే రోజు(30న) వీపీఐలకు 4.30 గంటలు కేటాయించారు. అంటే..ఆ సమయంలో సామాన్యులు వేచి ఉండక తప్పదు.
+ 31వ తేదీనాడు.. ఏకంగా 64 వేల మందికి టికెట్లు ఇచ్చారు. ఈ రోజు కూడా 20గంటల చొప్పున స్వామిదర్శనమిస్తారు. కానీ, సెకనుకు 10 మంది చొప్పున దర్శనం చేసుకోవాలి.
+ జనవరి 1న దర్శనానికి 55 వేల మందికి టికెట్లు ఇచ్చారు. ఆరోజు కూడా సెకనుకు 8 మంది చొప్పునే దర్శనం చేసుకోవాలి.
+ అదృష్టం ఏంటంటే.. ఈ మూడు రోజులపాటు అన్ని వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాలను రద్దు చేశారు. కానీ.. మధ్యలో నైవేద్య విరామ దర్శనాల సమయంలో వీఐపీలను అనుమతిస్తారు.
This post was last modified on December 3, 2025 9:13 am
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…
ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య…