Political News

రిజైన్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ యూట‌ర్న్‌… ఏంటి కథ?

వైసీపీ హ‌యాంలో ఎమ్మెల్సీ ప‌ద‌విని ద‌క్కించుకున్న కొంద‌రు.. కూట‌మి ప్ర‌భుత్వం రాగానే.. త‌మ త‌మ ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో వీరి రాజీనామాలు గ‌త ఏడెనిమిది నెల‌లుగా చైర్మ‌న్ మోషేన్ రాజు ద‌గ్గ‌ర పెండింగులో ఉన్నాయి. అయితే.. ఎప్ప‌టికీ వీటిపై ఒక నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంతో ఇటీవ‌ల ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ కోర్టును ఆశ్ర‌యించారు. తమ రాజీనామాల‌ను త‌క్ష‌ణ‌మే ఆమోదించేలా చైర్మ‌న్‌ను ఆదేశించాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు. దీంతో కోర్టు చైర్మ‌న్‌ను ఉద్దేశించి.. కీల‌క వ్యాఖ్య‌లు చేస్తూ.. నాలుగు వారాల గ‌డువు ఇచ్చింది.

వ‌చ్చే నాలుగు వారాల్లో ఇప్ప‌టికే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన వారివి ఆమోదించ‌డ‌మో.. తిర‌స్క‌రించ‌డ‌మో.. చేయాల‌ని కోర్టు ఆదేశించింది. దీంతో చైర్మ‌న్ మోషేన్ రాజు.. జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ స‌హా.. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల నుంచి సోమవారం వివ‌రణ తీసుకున్నారు. వీరిలో క‌ర్రి ప‌ద్మ‌శ్రీ, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, బ‌ల్లి క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, జ‌కియా ఖానుం, జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ‌, పోతుల సునీత ఉన్నారు. వీరిని ఒక్కొక్క‌రిగా త‌న ఛాంబ‌ర్‌లోకి ఆహ్వానించిన చైర్మ‌న్‌.. వారి నుంచి వివ‌ర‌ణ తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధానంగా వారిని 3 ప్ర‌శ్న‌లు అడిగారు.

1) రాజీనామా చేయ‌డానికి గ‌ల కార‌ణం?

2) రాజీనామా చేయాల‌ని ఏ వ్య‌క్తి అయినా.. ఏ పార్టీ అయినా ప్రోత్స‌హించిందా?

3) రాజీనామా స్వ‌చ్ఛంద‌మా..? ఎవ‌రైనా వ‌త్తిడి చేశారా?

అనే ఈ మూడు ప్ర‌శ్న‌ల‌ను ఎమ్మెల్సీల‌కు సంధించారు. దీనికి వారంతా స్వ‌చ్ఛందంగానే రాజీనామాలు చేశామ‌ని.. ఎవ‌రి ప్రోద్బలం లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే.. క‌ర్నూలు జిల్లాకు చెందిన మండ‌లి వైస్ చైర్మ‌న్ జ‌కియా ఖానుం మాత్రం.. తొలుత త‌న రాజీనామా వ్య‌వ‌హారంలో ఎవ‌రి ప్రోత్బ‌లం లేద‌ని.. తాను స్వ‌చ్ఛందంగానే రాజీనామా స‌మ‌ర్పించాన‌ని చెప్పారు. అయితే.. ఆ వెంట‌నే త‌న రాజీనామాను వెంటనే వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు జ‌కియా ఖానుం ప్ర‌క‌టించారు. చైర్మ‌న్ ఛాంబ‌ర్‌లోకి వెళ్లి.. త‌న రాజీనామా ప‌త్రాన్ని వెన‌క్కి ఇచ్చేయాల‌ని కోరారు. అయితే.. ఇలా ఆమె ఎందుకు యూట‌ర్న్ తీసుకున్నార‌న్న‌ది తెలియ‌రాలేదు.

మిగిలిన వారంతా.. స్వ‌చ్ఛందంగా రాజీనామా చేశామ‌ని.. ఆమోదించాల‌ని కోరారు. కాగా.. వీరిలో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, బ‌ల్లి క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ‌లు.. టీడీపీలో చేరారు. పోతుల సునీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక‌, జ‌కియా ఖానుం ప‌రిస్థితి ఏంట‌న్న‌ది తెలియాల్సి ఉంది. కాగా.. చైర్మ‌న్‌.. మోషేన్‌రాజు వీరి రాజీనామాల‌ను ఆమోదించ‌కుండా.. అన‌ర్హ‌త వేటు వేసే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే జ‌కియా ఖానుం త‌న రాజీనామాను వెనక్కి తీసుకుని ఉంటార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Kumar

Recent Posts

మావిగనా?… మాయా జగనా..?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…

1 hour ago

అంత అత్యాశ ఎందుకు ట్రంప్?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…

8 hours ago

అవమానంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ‘అల్ఫా’

మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…

9 hours ago

సంయుక్త హాట్ మోడ్ అదిరింది

సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…

9 hours ago

నాగార్జున నోట‌… చింటు మాట‌

టాలీవుడ్ నిర్మాతల్లో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీకి సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంత‌మంది అత‌ణ్ని అభిమానిస్తే.. కొంత‌మంది త‌న‌ను అదే…

9 hours ago

చింతమనేని Vs పవన్… ఎలా ముగిసింది?

టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…

10 hours ago