వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్న కొందరు.. కూటమి ప్రభుత్వం రాగానే.. తమ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరి రాజీనామాలు గత ఏడెనిమిది నెలలుగా చైర్మన్ మోషేన్ రాజు దగ్గర పెండింగులో ఉన్నాయి. అయితే.. ఎప్పటికీ వీటిపై ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో ఇటీవల ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన జయమంగళ వెంకటరమణ కోర్టును ఆశ్రయించారు. తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించేలా చైర్మన్ను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో కోర్టు చైర్మన్ను ఉద్దేశించి.. కీలక వ్యాఖ్యలు చేస్తూ.. నాలుగు వారాల గడువు ఇచ్చింది.
వచ్చే నాలుగు వారాల్లో ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసిన వారివి ఆమోదించడమో.. తిరస్కరించడమో.. చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో చైర్మన్ మోషేన్ రాజు.. జయమంగళ వెంకటరమణ సహా.. వైసీపీ నుంచి బయటకు వచ్చి తమ పదవులకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల నుంచి సోమవారం వివరణ తీసుకున్నారు. వీరిలో కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, బల్లి కల్యాణ్ చక్రవర్తి, జకియా ఖానుం, జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత ఉన్నారు. వీరిని ఒక్కొక్కరిగా తన ఛాంబర్లోకి ఆహ్వానించిన చైర్మన్.. వారి నుంచి వివరణ తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా వారిని 3 ప్రశ్నలు అడిగారు.
1) రాజీనామా చేయడానికి గల కారణం?
2) రాజీనామా చేయాలని ఏ వ్యక్తి అయినా.. ఏ పార్టీ అయినా ప్రోత్సహించిందా?
3) రాజీనామా స్వచ్ఛందమా..? ఎవరైనా వత్తిడి చేశారా?
అనే ఈ మూడు ప్రశ్నలను ఎమ్మెల్సీలకు సంధించారు. దీనికి వారంతా స్వచ్ఛందంగానే రాజీనామాలు చేశామని.. ఎవరి ప్రోద్బలం లేదని వివరణ ఇచ్చారు. అయితే.. కర్నూలు జిల్లాకు చెందిన మండలి వైస్ చైర్మన్ జకియా ఖానుం మాత్రం.. తొలుత తన రాజీనామా వ్యవహారంలో ఎవరి ప్రోత్బలం లేదని.. తాను స్వచ్ఛందంగానే రాజీనామా సమర్పించానని చెప్పారు. అయితే.. ఆ వెంటనే తన రాజీనామాను వెంటనే వెనక్కి తీసుకుంటున్నట్టు జకియా ఖానుం ప్రకటించారు. చైర్మన్ ఛాంబర్లోకి వెళ్లి.. తన రాజీనామా పత్రాన్ని వెనక్కి ఇచ్చేయాలని కోరారు. అయితే.. ఇలా ఆమె ఎందుకు యూటర్న్ తీసుకున్నారన్నది తెలియరాలేదు.
మిగిలిన వారంతా.. స్వచ్ఛందంగా రాజీనామా చేశామని.. ఆమోదించాలని కోరారు. కాగా.. వీరిలో మర్రి రాజశేఖర్, బల్లి కల్యాణ్ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణలు.. టీడీపీలో చేరారు. పోతుల సునీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, జకియా ఖానుం పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది. కాగా.. చైర్మన్.. మోషేన్రాజు వీరి రాజీనామాలను ఆమోదించకుండా.. అనర్హత వేటు వేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జకియా ఖానుం తన రాజీనామాను వెనక్కి తీసుకుని ఉంటారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on December 2, 2025 7:38 am
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…