వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్న కొందరు.. కూటమి ప్రభుత్వం రాగానే.. తమ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరి రాజీనామాలు గత ఏడెనిమిది నెలలుగా చైర్మన్ మోషేన్ రాజు దగ్గర పెండింగులో ఉన్నాయి. అయితే.. ఎప్పటికీ వీటిపై ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో ఇటీవల ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన జయమంగళ వెంకటరమణ కోర్టును ఆశ్రయించారు. తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించేలా చైర్మన్ను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో కోర్టు చైర్మన్ను ఉద్దేశించి.. కీలక వ్యాఖ్యలు చేస్తూ.. నాలుగు వారాల గడువు ఇచ్చింది.
వచ్చే నాలుగు వారాల్లో ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసిన వారివి ఆమోదించడమో.. తిరస్కరించడమో.. చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో చైర్మన్ మోషేన్ రాజు.. జయమంగళ వెంకటరమణ సహా.. వైసీపీ నుంచి బయటకు వచ్చి తమ పదవులకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల నుంచి సోమవారం వివరణ తీసుకున్నారు. వీరిలో కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, బల్లి కల్యాణ్ చక్రవర్తి, జకియా ఖానుం, జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత ఉన్నారు. వీరిని ఒక్కొక్కరిగా తన ఛాంబర్లోకి ఆహ్వానించిన చైర్మన్.. వారి నుంచి వివరణ తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా వారిని 3 ప్రశ్నలు అడిగారు.
1) రాజీనామా చేయడానికి గల కారణం?
2) రాజీనామా చేయాలని ఏ వ్యక్తి అయినా.. ఏ పార్టీ అయినా ప్రోత్సహించిందా?
3) రాజీనామా స్వచ్ఛందమా..? ఎవరైనా వత్తిడి చేశారా?
అనే ఈ మూడు ప్రశ్నలను ఎమ్మెల్సీలకు సంధించారు. దీనికి వారంతా స్వచ్ఛందంగానే రాజీనామాలు చేశామని.. ఎవరి ప్రోద్బలం లేదని వివరణ ఇచ్చారు. అయితే.. కర్నూలు జిల్లాకు చెందిన మండలి వైస్ చైర్మన్ జకియా ఖానుం మాత్రం.. తొలుత తన రాజీనామా వ్యవహారంలో ఎవరి ప్రోత్బలం లేదని.. తాను స్వచ్ఛందంగానే రాజీనామా సమర్పించానని చెప్పారు. అయితే.. ఆ వెంటనే తన రాజీనామాను వెంటనే వెనక్కి తీసుకుంటున్నట్టు జకియా ఖానుం ప్రకటించారు. చైర్మన్ ఛాంబర్లోకి వెళ్లి.. తన రాజీనామా పత్రాన్ని వెనక్కి ఇచ్చేయాలని కోరారు. అయితే.. ఇలా ఆమె ఎందుకు యూటర్న్ తీసుకున్నారన్నది తెలియరాలేదు.
మిగిలిన వారంతా.. స్వచ్ఛందంగా రాజీనామా చేశామని.. ఆమోదించాలని కోరారు. కాగా.. వీరిలో మర్రి రాజశేఖర్, బల్లి కల్యాణ్ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణలు.. టీడీపీలో చేరారు. పోతుల సునీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, జకియా ఖానుం పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది. కాగా.. చైర్మన్.. మోషేన్రాజు వీరి రాజీనామాలను ఆమోదించకుండా.. అనర్హత వేటు వేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జకియా ఖానుం తన రాజీనామాను వెనక్కి తీసుకుని ఉంటారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on December 2, 2025 7:38 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…