Political News

రిజైన్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ యూట‌ర్న్‌… ఏంటి కథ?

వైసీపీ హ‌యాంలో ఎమ్మెల్సీ ప‌ద‌విని ద‌క్కించుకున్న కొంద‌రు.. కూట‌మి ప్ర‌భుత్వం రాగానే.. త‌మ త‌మ ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో వీరి రాజీనామాలు గ‌త ఏడెనిమిది నెల‌లుగా చైర్మ‌న్ మోషేన్ రాజు ద‌గ్గ‌ర పెండింగులో ఉన్నాయి. అయితే.. ఎప్ప‌టికీ వీటిపై ఒక నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంతో ఇటీవ‌ల ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ కోర్టును ఆశ్ర‌యించారు. తమ రాజీనామాల‌ను త‌క్ష‌ణ‌మే ఆమోదించేలా చైర్మ‌న్‌ను ఆదేశించాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు. దీంతో కోర్టు చైర్మ‌న్‌ను ఉద్దేశించి.. కీల‌క వ్యాఖ్య‌లు చేస్తూ.. నాలుగు వారాల గ‌డువు ఇచ్చింది.

వ‌చ్చే నాలుగు వారాల్లో ఇప్ప‌టికే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన వారివి ఆమోదించ‌డ‌మో.. తిర‌స్క‌రించ‌డ‌మో.. చేయాల‌ని కోర్టు ఆదేశించింది. దీంతో చైర్మ‌న్ మోషేన్ రాజు.. జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ స‌హా.. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల నుంచి సోమవారం వివ‌రణ తీసుకున్నారు. వీరిలో క‌ర్రి ప‌ద్మ‌శ్రీ, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, బ‌ల్లి క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, జ‌కియా ఖానుం, జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ‌, పోతుల సునీత ఉన్నారు. వీరిని ఒక్కొక్క‌రిగా త‌న ఛాంబ‌ర్‌లోకి ఆహ్వానించిన చైర్మ‌న్‌.. వారి నుంచి వివ‌ర‌ణ తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధానంగా వారిని 3 ప్ర‌శ్న‌లు అడిగారు.

1) రాజీనామా చేయ‌డానికి గ‌ల కార‌ణం?

2) రాజీనామా చేయాల‌ని ఏ వ్య‌క్తి అయినా.. ఏ పార్టీ అయినా ప్రోత్స‌హించిందా?

3) రాజీనామా స్వ‌చ్ఛంద‌మా..? ఎవ‌రైనా వ‌త్తిడి చేశారా?

అనే ఈ మూడు ప్ర‌శ్న‌ల‌ను ఎమ్మెల్సీల‌కు సంధించారు. దీనికి వారంతా స్వ‌చ్ఛందంగానే రాజీనామాలు చేశామ‌ని.. ఎవ‌రి ప్రోద్బలం లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే.. క‌ర్నూలు జిల్లాకు చెందిన మండ‌లి వైస్ చైర్మ‌న్ జ‌కియా ఖానుం మాత్రం.. తొలుత త‌న రాజీనామా వ్య‌వ‌హారంలో ఎవ‌రి ప్రోత్బ‌లం లేద‌ని.. తాను స్వ‌చ్ఛందంగానే రాజీనామా స‌మ‌ర్పించాన‌ని చెప్పారు. అయితే.. ఆ వెంట‌నే త‌న రాజీనామాను వెంటనే వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు జ‌కియా ఖానుం ప్ర‌క‌టించారు. చైర్మ‌న్ ఛాంబ‌ర్‌లోకి వెళ్లి.. త‌న రాజీనామా ప‌త్రాన్ని వెన‌క్కి ఇచ్చేయాల‌ని కోరారు. అయితే.. ఇలా ఆమె ఎందుకు యూట‌ర్న్ తీసుకున్నార‌న్న‌ది తెలియ‌రాలేదు.

మిగిలిన వారంతా.. స్వ‌చ్ఛందంగా రాజీనామా చేశామ‌ని.. ఆమోదించాల‌ని కోరారు. కాగా.. వీరిలో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, బ‌ల్లి క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ‌లు.. టీడీపీలో చేరారు. పోతుల సునీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక‌, జ‌కియా ఖానుం ప‌రిస్థితి ఏంట‌న్న‌ది తెలియాల్సి ఉంది. కాగా.. చైర్మ‌న్‌.. మోషేన్‌రాజు వీరి రాజీనామాల‌ను ఆమోదించ‌కుండా.. అన‌ర్హ‌త వేటు వేసే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే జ‌కియా ఖానుం త‌న రాజీనామాను వెనక్కి తీసుకుని ఉంటార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

This post was last modified on December 2, 2025 7:38 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కాంతార కవ్వింపు క్షమాపణ దాకా తెచ్చింది

ఇటీవలే గోవాలో జరిగిన వేడుకలో రణ్వీర్ సింగ్ హీరో రిషబ్ శెట్టిని ఉద్దేశించి మాట్లాడుతూ కాంతార ఎక్స్ ప్రెషన్ ని…

3 minutes ago

హైదరాబాద్‌లో రెండు కొత్త ఫిలిం సిటీలు

ప్రపంచంలో ఎన్నో ఫిలిం సిటీలు ఉన్నప్పటికీ.. అందులో రామోజీ ఫిలిం సిటీ చాలా ప్రత్యేకంగా. ఏకంగా 1600 ఎకరాల్లో విస్తరించిన…

3 minutes ago

సమంత భర్త… సొంతూరు ఏదో తెలుసా?

వ్యక్తిగత జీవితంలో కొన్నేళ్ల పాటు ఒడుదొడుకులు ఎదుర్కొంది సమంత. నాగచైతన్య నుంచి నాలుగేళ్ల ముందు విడిపోయిన ఆమె.. మళ్లీ వ్యక్తిగత…

1 hour ago

పవన్ సారీ చెప్పకపోతే… సినిమాటోగ్రఫీ మినిస్టర్ వార్నింగ్

తెలంగాణ నాయకులు పదే పదే గోదారి పచ్చదనం గురించి మాట్లాడడం, దిష్టి తగలడం వల్లే పచ్చటి కోనసీమ కొబ్బరి తోటలు…

3 hours ago

ఏపీలో ఫిల్మ్ టూరిజం… కూటమి మాస్టర్ ప్లాన్

ఏపీలో ఫిల్మ్ టూరిజానికి ప్రోత్సాహం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. దేశంలోనే సినిమా షూటింగ్‌ లకు…

3 hours ago

ల్యాగ్ అంటూనే బండి లాగేస్తోంది

ధనుష్ కొత్త హిందీ సినిమా తేరే ఇష్క్ మే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాగానే బండి లాగేస్తోంది. ట్రేడ్ నుంచి…

3 hours ago