Political News

అయ్యప్ప ఆలయానికి రాజకీయ రంగు? వైసీపీపై తీవ్ర ఆరోపణలు

వైసీపీలో రాజకీయాలు నానాటికీ దిగజారుతున్నాయ‌ని పరిశీలకులు అంటున్నారు. పార్టీ నేతలపై పట్టుకోల్పోవడంతో పాటు, కార్యకర్తలపై కూడా జగన్ నియంత్రణ కోల్పోతున్నార‌ని చెబుతున్నారు. దీంతో కొత్త కొత్త సమస్యలు తెరమీదికి వస్తున్నాయ‌ని అభిప్రాయపడుతున్నారు. తాజాగా జగన్ క్షమాపణలు చెప్పాలంటూ విశ్వహిందూ పరిషత్‌కు చెందిన కేరళ కార్యకర్తలు డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయ‌ని హెచ్చరించారు.

ఏం జరిగింది?

హిందూ భక్తులు పరమపవిత్రంగా భావించే అయ్యప్ప స్వామి ఆరాధన, దీక్ష స్వీకరణ అందరికీ తెలిసిందే. చిన్నా పెద్దా అందరూ ఈ మాల ధరించి కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని దర్శిస్తారు. ఇది ఎప్పటికీ రాజకీయాలకు అతీతం. ఎవరూ ఈ భక్తి సంప్రదాయాన్ని రాజకీయాల్లోకి లాగలేకపోయారు. గతంలో బీజేపీ ప్రయత్నించినప్పుడు కూడా తీవ్ర ప్రతికూలతను చవిచూసింది.

కట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కొందరు అయ్యప్ప దీక్షను, శబరిమల యాత్రను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు కానీ ప‌దేప‌దే ఇదే చేయడం ఎవరికైనా ఇబ్బంది కలిగించే పని.

గత వారం విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటకు చెందిన కొందరు వైసీపీ మద్దతుదారులు అయ్యప్ప దీక్షలో ఉన్న సమయంలో పంబా నది ఒడ్డున ‘జగన్ 2.0’ బేనర్లు పెట్టి జై జగన్ నినాదాలు చేశారు. దీనిపై అప్పుడే విమర్శలు వచ్చాయి.

అప్పట్లోనే జగన్ స్పందించి ఇలా చేయొద్దని చెప్పి ఉండి ఉంటే సమస్య ఇంతవరకు రాకపోయేది. కానీ ఆయన స్పందించకపోవడం వల్ల ఇప్పుడు పెందుర్తి సహా ఇతర ప్రాంతాల నుంచి వెళ్లిన భక్తులు కూడా ఇలాంటి బ్యానర్లు ప్రదర్శించారు.

దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ విశ్వహిందూ పరిషత్ కేరళ కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. అయ్యప్ప స్వామివారికి ఇది అవమానం అని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే శబరిమల ప్రవేశం కూడా ఆపేస్తామని హెచ్చరించారు.

ఈ వివాదం మరింత ముదరకముందే జగన్ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Satya

Recent Posts

ఆంధ్రాలో గద్దర్ విగ్రహం: పవన్ కల్యాణ్

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…

17 minutes ago

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్

తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…

23 minutes ago

తెలంగాణ ప్రభుత్వానికి పవన్ సవాల్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్‌పల్లి…

38 minutes ago

హైద‌రాబాద్‌లో ఐమాక్స్… ఒక‌టి కాదు

దేశంలో అత్య‌ధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. గ‌తంలో…

1 hour ago

తెలంగాణ మీ అయ్య జాగీరా?.. పవన్ ఫైర్

ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…

2 hours ago

ఒక్కడు పోలికకు సైనికుడే దొరికిందా

దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…

3 hours ago