Political News

అయ్యప్ప ఆలయానికి రాజకీయ రంగు? వైసీపీపై తీవ్ర ఆరోపణలు

వైసీపీలో రాజకీయాలు నానాటికీ దిగజారుతున్నాయ‌ని పరిశీలకులు అంటున్నారు. పార్టీ నేతలపై పట్టుకోల్పోవడంతో పాటు, కార్యకర్తలపై కూడా జగన్ నియంత్రణ కోల్పోతున్నార‌ని చెబుతున్నారు. దీంతో కొత్త కొత్త సమస్యలు తెరమీదికి వస్తున్నాయ‌ని అభిప్రాయపడుతున్నారు. తాజాగా జగన్ క్షమాపణలు చెప్పాలంటూ విశ్వహిందూ పరిషత్‌కు చెందిన కేరళ కార్యకర్తలు డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయ‌ని హెచ్చరించారు.

ఏం జరిగింది?

హిందూ భక్తులు పరమపవిత్రంగా భావించే అయ్యప్ప స్వామి ఆరాధన, దీక్ష స్వీకరణ అందరికీ తెలిసిందే. చిన్నా పెద్దా అందరూ ఈ మాల ధరించి కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని దర్శిస్తారు. ఇది ఎప్పటికీ రాజకీయాలకు అతీతం. ఎవరూ ఈ భక్తి సంప్రదాయాన్ని రాజకీయాల్లోకి లాగలేకపోయారు. గతంలో బీజేపీ ప్రయత్నించినప్పుడు కూడా తీవ్ర ప్రతికూలతను చవిచూసింది.

కట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కొందరు అయ్యప్ప దీక్షను, శబరిమల యాత్రను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు కానీ ప‌దేప‌దే ఇదే చేయడం ఎవరికైనా ఇబ్బంది కలిగించే పని.

గత వారం విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటకు చెందిన కొందరు వైసీపీ మద్దతుదారులు అయ్యప్ప దీక్షలో ఉన్న సమయంలో పంబా నది ఒడ్డున ‘జగన్ 2.0’ బేనర్లు పెట్టి జై జగన్ నినాదాలు చేశారు. దీనిపై అప్పుడే విమర్శలు వచ్చాయి.

అప్పట్లోనే జగన్ స్పందించి ఇలా చేయొద్దని చెప్పి ఉండి ఉంటే సమస్య ఇంతవరకు రాకపోయేది. కానీ ఆయన స్పందించకపోవడం వల్ల ఇప్పుడు పెందుర్తి సహా ఇతర ప్రాంతాల నుంచి వెళ్లిన భక్తులు కూడా ఇలాంటి బ్యానర్లు ప్రదర్శించారు.

దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ విశ్వహిందూ పరిషత్ కేరళ కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. అయ్యప్ప స్వామివారికి ఇది అవమానం అని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే శబరిమల ప్రవేశం కూడా ఆపేస్తామని హెచ్చరించారు.

ఈ వివాదం మరింత ముదరకముందే జగన్ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

This post was last modified on November 30, 2025 4:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

30 minutes ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

2 hours ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

2 hours ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

4 hours ago

తమిళంలో అదరగొట్టిన చంద్రబాబు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…

4 hours ago

ధనుష్ కూడా ఇలా చేస్తే ఎలా?

పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్‌గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…

10 hours ago