ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె కుమారుడు, అదేవిధంగా ఆమె ప్రైవేటు వ్యక్తిగత కార్యదర్శిగా చెబుతున్న సతీష్పై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తనను లైంగికంగా వేధిస్తున్నారనీ, వేరే వ్యక్తులతో ఉండాలని ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారనీ ఆమె గత నాలుగు రోజులుగా మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
కానీ మంత్రి గారి కుమారుడి కేసు కావడంతో పోలీసులు దూరంగా ఉండిపోయారు. ఈ క్రమంలో తాజాగా ఆమె ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. మంత్రి పీఏను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించడం తో పాటు, బాధితురాలిపై కూడా కేసు పెట్టి విచారించాలని ఆదేశించింది. ఆమె చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంటే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆమెపైనే చర్యలు తీసుకోవాలని సూచించింది.
విషయం ఏంటి?
విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ భర్త కరోనా సమయంలో మరణించారు. అయితే ఆయన ప్రభుత్వ ఉద్యోగి. ఈ క్రమంలో కారుణ్య కోటాలో ఉద్యోగం కోసం ఆమె ప్రయత్నించినప్పుడు మంత్రి పీఏ సతీష్ పరిచయం అయి, ఆమె నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారని బాధితురాలు చెబుతున్నారు.
మొత్తానికి ఉద్యోగం వచ్చింది. కానీ తర్వాత అధికారులు, తోటి సిబ్బంది నుంచి సదరు మొత్తం ఎవరు తీసుకోలేదని, సతీషే తీసుకుని ఉంటాడని ఆమెకు చెప్పారు. దీంతో ఆమె నేరుగా సతీష్ను సంప్రదించి, తన సొమ్మును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే మంత్రి కుమారుడు పృథ్వీ ఎంటర్ అయ్యారు. ఆయన సెటిల్ చేస్తానని చెప్పినట్టు బాధితురాలు చెబుతున్నారు.
తర్వాత సెటిల్ చేయకపోవడంతో పాటు, తనను లైంగికంగా వేధిస్తున్నారనీ, తన ఫ్రెండ్స్తో ఉండాలని ఒత్తిడి చేస్తున్నారనీ బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు గత నాలుగైదు రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. తాజాగా ప్రభుత్వం దీనిపై చర్యలకు ఆదేశించింది.
This post was last modified on November 30, 2025 4:37 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…