ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె కుమారుడు, అదేవిధంగా ఆమె ప్రైవేటు వ్యక్తిగత కార్యదర్శిగా చెబుతున్న సతీష్పై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తనను లైంగికంగా వేధిస్తున్నారనీ, వేరే వ్యక్తులతో ఉండాలని ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారనీ ఆమె గత నాలుగు రోజులుగా మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
కానీ మంత్రి గారి కుమారుడి కేసు కావడంతో పోలీసులు దూరంగా ఉండిపోయారు. ఈ క్రమంలో తాజాగా ఆమె ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. మంత్రి పీఏను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించడం తో పాటు, బాధితురాలిపై కూడా కేసు పెట్టి విచారించాలని ఆదేశించింది. ఆమె చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంటే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆమెపైనే చర్యలు తీసుకోవాలని సూచించింది.
విషయం ఏంటి?
విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ భర్త కరోనా సమయంలో మరణించారు. అయితే ఆయన ప్రభుత్వ ఉద్యోగి. ఈ క్రమంలో కారుణ్య కోటాలో ఉద్యోగం కోసం ఆమె ప్రయత్నించినప్పుడు మంత్రి పీఏ సతీష్ పరిచయం అయి, ఆమె నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారని బాధితురాలు చెబుతున్నారు.
మొత్తానికి ఉద్యోగం వచ్చింది. కానీ తర్వాత అధికారులు, తోటి సిబ్బంది నుంచి సదరు మొత్తం ఎవరు తీసుకోలేదని, సతీషే తీసుకుని ఉంటాడని ఆమెకు చెప్పారు. దీంతో ఆమె నేరుగా సతీష్ను సంప్రదించి, తన సొమ్మును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే మంత్రి కుమారుడు పృథ్వీ ఎంటర్ అయ్యారు. ఆయన సెటిల్ చేస్తానని చెప్పినట్టు బాధితురాలు చెబుతున్నారు.
తర్వాత సెటిల్ చేయకపోవడంతో పాటు, తనను లైంగికంగా వేధిస్తున్నారనీ, తన ఫ్రెండ్స్తో ఉండాలని ఒత్తిడి చేస్తున్నారనీ బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు గత నాలుగైదు రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. తాజాగా ప్రభుత్వం దీనిపై చర్యలకు ఆదేశించింది.
This post was last modified on November 30, 2025 4:37 pm
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…