ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె కుమారుడు, అదేవిధంగా ఆమె ప్రైవేటు వ్యక్తిగత కార్యదర్శిగా చెబుతున్న సతీష్పై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తనను లైంగికంగా వేధిస్తున్నారనీ, వేరే వ్యక్తులతో ఉండాలని ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారనీ ఆమె గత నాలుగు రోజులుగా మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
కానీ మంత్రి గారి కుమారుడి కేసు కావడంతో పోలీసులు దూరంగా ఉండిపోయారు. ఈ క్రమంలో తాజాగా ఆమె ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. మంత్రి పీఏను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించడం తో పాటు, బాధితురాలిపై కూడా కేసు పెట్టి విచారించాలని ఆదేశించింది. ఆమె చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంటే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆమెపైనే చర్యలు తీసుకోవాలని సూచించింది.
విషయం ఏంటి?
విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ భర్త కరోనా సమయంలో మరణించారు. అయితే ఆయన ప్రభుత్వ ఉద్యోగి. ఈ క్రమంలో కారుణ్య కోటాలో ఉద్యోగం కోసం ఆమె ప్రయత్నించినప్పుడు మంత్రి పీఏ సతీష్ పరిచయం అయి, ఆమె నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారని బాధితురాలు చెబుతున్నారు.
మొత్తానికి ఉద్యోగం వచ్చింది. కానీ తర్వాత అధికారులు, తోటి సిబ్బంది నుంచి సదరు మొత్తం ఎవరు తీసుకోలేదని, సతీషే తీసుకుని ఉంటాడని ఆమెకు చెప్పారు. దీంతో ఆమె నేరుగా సతీష్ను సంప్రదించి, తన సొమ్మును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే మంత్రి కుమారుడు పృథ్వీ ఎంటర్ అయ్యారు. ఆయన సెటిల్ చేస్తానని చెప్పినట్టు బాధితురాలు చెబుతున్నారు.
తర్వాత సెటిల్ చేయకపోవడంతో పాటు, తనను లైంగికంగా వేధిస్తున్నారనీ, తన ఫ్రెండ్స్తో ఉండాలని ఒత్తిడి చేస్తున్నారనీ బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు గత నాలుగైదు రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. తాజాగా ప్రభుత్వం దీనిపై చర్యలకు ఆదేశించింది.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…