తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొత్తంగా మూడు దశల్లో జరగనున్న ఈ ఎన్నికలలో తొలి విడత పోలింగ్ జరగనున్న పంచాయతీలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. అయితే.. అనుకున్న విధంగా నామినేషన్లు రాకపోవడం గమనార్హం. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది.
తీరా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యాక పెద్దగా ఆ ఊసు కనిపించడం లేదు. ఆ ఊపు కూడా లేకుండా పోయింది. దీనికి కారణం.. ఎక్కువగా ఏకగ్రీవాలు చేసుకునే విషయంపైనే అధికార పార్టీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాలతో పాటు.. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ , మహబూబ్నగర్ తదితర ప్రాంతాలలోని గ్రామాల్లో కూడా.. ఏకగ్రీవాలకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. దీంతో నామినేషన్ల సందడి పెద్దగా కనిపించడం లేదు.
అయితే.. నామినేషన్లు అసలు లేవని కాదు.. కానీ, ఆశించిన స్థాయిలో అయితే కనిపించడం లేదు. తొలి రోజు గురువారం రాష్ట్రవ్యాప్తంగా సర్పంచి పదవుల కోసం 4,900 నామినేషన్లు దాఖలయ్యాయి. వాస్తవానికి ఈ సంఖ్య 10 వేలు ఉంటుందని ముందుగానే అంచనా వేసుకున్నా.. అది చేరలేదు. ఇక, రెండో రోజు శుక్రవారం కూడా ఈ ప్రక్రియ మందకొడిగానే సాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు శనివారంతో తొలి దశ పోలింగ్ జరగనున్న గ్రామాలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తి కానుంది.
దీంతో ఆశించిన విధంగా అయితే.. నామినేషన్లు దాఖలు చేయడం లేదని తెలుస్తోంది. పంచయతీ పరిధి లో ఏకగ్రీవాలను చేయడం ద్వారా కాంగ్రెస్ నాయకులు పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు పంచాయతీ సర్పంచ్ పదవులకు వేలం వేస్తున్న విషయం తెలిసిందే. దీంతో నామినేషన్ల హడావుడి ఆశించిన మేరకు కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 29, 2025 7:18 pm
ఉత్తరాదిలో బలంగా పాతుకుపోయిన బీజేపీ దక్షిణాదిలో పాగా వేయాలని చాలాకాలంగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రయత్నాలు కర్ణాటకలో కొంతవరకు సఫలమైనప్పటికీ…
షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ చాలా ఒత్తిడిలో ఉంది కానీ ప్యారడైజ్ మీద క్షేత్ర స్థాయిలో ఎంత బజ్…
గత కొన్ని నెలలుగా తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి గురించి జోరుగా ఊహాగానాలు నడుస్తున్న సంగతి తెలిసిందే.…
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన అభిలాష చిత్రం ‘ఉరిశిక్ష’పై ఎంత పెద్ద డిబేట్ కు తెరలేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.…
చట్టసభలను గతంలో చాలామంది నేతలు దేవాలయాలుగా భావించేవారు. ప్రజల జీవితాలను మార్చగలిగే చట్టాలను చేసేందుకు తమకు అధికారం ఇచ్చారని జవాబుదారీతనంగా…
గత కొన్ని రోజులుగా మలయాళ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. తన పాస్ట్ లవ్ స్టోరీ…