తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొత్తంగా మూడు దశల్లో జరగనున్న ఈ ఎన్నికలలో తొలి విడత పోలింగ్ జరగనున్న పంచాయతీలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. అయితే.. అనుకున్న విధంగా నామినేషన్లు రాకపోవడం గమనార్హం. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది.
తీరా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యాక పెద్దగా ఆ ఊసు కనిపించడం లేదు. ఆ ఊపు కూడా లేకుండా పోయింది. దీనికి కారణం.. ఎక్కువగా ఏకగ్రీవాలు చేసుకునే విషయంపైనే అధికార పార్టీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాలతో పాటు.. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ , మహబూబ్నగర్ తదితర ప్రాంతాలలోని గ్రామాల్లో కూడా.. ఏకగ్రీవాలకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. దీంతో నామినేషన్ల సందడి పెద్దగా కనిపించడం లేదు.
అయితే.. నామినేషన్లు అసలు లేవని కాదు.. కానీ, ఆశించిన స్థాయిలో అయితే కనిపించడం లేదు. తొలి రోజు గురువారం రాష్ట్రవ్యాప్తంగా సర్పంచి పదవుల కోసం 4,900 నామినేషన్లు దాఖలయ్యాయి. వాస్తవానికి ఈ సంఖ్య 10 వేలు ఉంటుందని ముందుగానే అంచనా వేసుకున్నా.. అది చేరలేదు. ఇక, రెండో రోజు శుక్రవారం కూడా ఈ ప్రక్రియ మందకొడిగానే సాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు శనివారంతో తొలి దశ పోలింగ్ జరగనున్న గ్రామాలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తి కానుంది.
దీంతో ఆశించిన విధంగా అయితే.. నామినేషన్లు దాఖలు చేయడం లేదని తెలుస్తోంది. పంచయతీ పరిధి లో ఏకగ్రీవాలను చేయడం ద్వారా కాంగ్రెస్ నాయకులు పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు పంచాయతీ సర్పంచ్ పదవులకు వేలం వేస్తున్న విషయం తెలిసిందే. దీంతో నామినేషన్ల హడావుడి ఆశించిన మేరకు కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 29, 2025 7:18 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…