Political News

అసలు సంగతి దాచి మీడియా ముందు చిరునవ్వులు

కర్ణాటక రాజకీయాల్లో గత నెల రోజులుగా తీవ్ర ప్రతిష్టంభనం నెలకొన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సీటు కోసం ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యాపారవేత్త మరియు పార్టీ కీలక నాయకుడు డీకే శివకుమార్ భారీ ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం ఆయన చేసిన శ్రమ అందరికీ తెలిసిందే. దీంతో అసలు సీఎం సీటు కోసం అప్పట్లోనే ఆయన ప్రయత్నించారు.

కానీ, కుల సమీకరణలు మరియు డీకేపై అప్పట్లో ఉన్న కేసుల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మౌనంగా ఉంది. ఈ క్రమంలోనే సీనియర్ నేత సిద్దరామయ్యకు పట్టంకట్టింది. ఆ సమయంలో రెండున్నరేళ్ల ఒప్పందం జరిగిందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. అంటే రెండున్నరేళ్ల తర్వాత సిద్దరామయ్య పదవి విడిచి డీకేకు అప్పగిస్తారన్న వాదనను శివకుమార్ వర్గం ప్రచారం చేసింది. ఈ క్రమంలో రెండున్నరేళ్లు పూర్తయిన వెంటనే ఈ వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది.

గత నెల రోజులుగా రాష్ట్ర పరిస్థితి కూడా ఇలాగే ఉద్రిక్తంగా ఉంది. దీనిపై అధిష్టానం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సిద్దరామయ్యను మారిస్తే ఇబ్బందులు తటస్థం కావన్న భావనతో అధిష్టానం ఆయనకే మొగ్గు చూపింది. ఈ క్రమంలో ఇరు వర్గాలను రాజీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తాజాగా సీఎం సిద్దరామయ్య తన నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. దీనికి డీకేతో పాటు ఆయన మద్దతుదారులు, మంత్రులు హాజరయ్యారు. లోపల ఏం మాట్లాడుకున్నారో అధికారికంగా వెల్లడించలేదు. కానీ మీడియా ముందు మాత్రం సిద్దరామయ్య, శివకుమార్‌లు పరస్పరం నవ్వుతూ కనిపించారు. ఇద్దరూ ఒకరంటే ఒకరు ఆప్యాయంగా ఉన్నామని చెప్పారు. కలిసి పనిచేస్తామని, 2028 ఎన్నికలపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు.

విందు కూడా అదే ఉద్దేశ్యంతో నిర్వహించామని సిద్దరామయ్య చెప్పగా, తన ఆలోచన కూడా అదే అని డీకే తెలిపారు. కానీ ఈ విందు వెనుక అసలు రాజకీయాలు వేరే ఉన్నాయన్నది వాస్తవం. అయితే ఇద్దరూ ఆ అంశాన్ని వ్యూహాత్మకంగా దాటవేయడం గమనార్హం.

This post was last modified on November 29, 2025 6:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ మహిళ తో వీడియోలు వ్యక్తిగత విషయమంటోన్న MLA

తనపై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తొలిసారి మీడియా ముందు స్పందించారు. అది…

4 minutes ago

ఆరెంజ్ ఎన్నిసార్లు చూస్తారయ్యా

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…

2 hours ago

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

4 hours ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

6 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

11 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

12 hours ago