జనసేన పార్టీ ఎంపీల కు ఆ పార్టీ అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ టాస్క్ ను అప్పగించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో జనసేన ఎంపీలు ఎలా వ్యవహరించాలన్న విషయంపై ఆయన దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా జనసేన కూటమిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూటమి బంధాన్ని కాపాడుకుంటూనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తీసుకురావాలని ఆయన ఎంపీల కు సూచించారు.
జనసేనకు ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు ఉన్నారు. మచిలీపట్నం నుంచి విజయం సాధించిన వల్లభనేని బాలశౌరి, కాకినాడ నుంచి గెలిచిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లు పార్లమెంట్ లో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శీతాకాల సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాల పై పవన్ కళ్యాణ్ వారితో చర్చించారు. ఈ క్రమంలో తన శాఖకు సంబంధించిన పనులను పర్యవేక్షించడమే కాకుండా వాటికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని కూడా సూచించారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆర్థిక సంఘం కేటాయించే మొత్తాలు నేరుగా పంచాయతీ ఖాతాలలోకి చేరతాయి. వీటిద్వారా పనులు చేపట్టాలి. ఇప్పుడు మరిన్ని నిధులు కేంద్రం నుంచి వచ్చేలా పార్లమెంట్ ద్వారా ప్రయత్నించాలని ఆయన ఎంపీల కు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని పవన్ స్పష్టం చేశారు.
దీనికి మరొక కారణం కూడా ఉందని చెబుతున్నారు. వచ్చే ఏడాది పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం పెట్టనున్నారు. భారీ ఎత్తున నిధులు తీసుకురావడం ద్వారా పంచాయతీల్లో పనులు చేయడానికి అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ జనసేన ఎంపీల కు బిగ్ టాస్క్ ఇచ్చారంటున్నారు పరిశీలకులు.
అదే సమయంలో అమరావతి రాజధాని, పోలవరం వంటి ముఖ్యమైన అంశాల్లో కూడా కూటమి ఎంపీల తో కలిసి కేంద్రంతో చర్చించాలని ఆయన సూచించారు. మొత్తం వ్యూహం బలంగా ఉందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on November 29, 2025 6:35 pm
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను…