Political News

జనసేన ఎంపీల కు పవన్ బిగ్ టాస్క్

జనసేన పార్టీ ఎంపీల కు ఆ పార్టీ అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ టాస్క్ ను అప్పగించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో జనసేన ఎంపీలు ఎలా వ్యవహరించాలన్న విషయంపై ఆయన దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా జనసేన కూటమిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూటమి బంధాన్ని కాపాడుకుంటూనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తీసుకురావాలని ఆయన ఎంపీల కు సూచించారు.

జనసేనకు ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు ఉన్నారు. మచిలీపట్నం నుంచి విజయం సాధించిన వల్లభనేని బాలశౌరి, కాకినాడ నుంచి గెలిచిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లు పార్లమెంట్ లో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శీతాకాల సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాల పై పవన్ కళ్యాణ్ వారితో చర్చించారు. ఈ క్రమంలో తన శాఖకు సంబంధించిన పనులను పర్యవేక్షించడమే కాకుండా వాటికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని కూడా సూచించారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆర్థిక సంఘం కేటాయించే మొత్తాలు నేరుగా పంచాయతీ ఖాతాలలోకి చేరతాయి. వీటిద్వారా పనులు చేపట్టాలి. ఇప్పుడు మరిన్ని నిధులు కేంద్రం నుంచి వచ్చేలా పార్లమెంట్ ద్వారా ప్రయత్నించాలని ఆయన ఎంపీల కు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని పవన్ స్పష్టం చేశారు.

దీనికి మరొక కారణం కూడా ఉందని చెబుతున్నారు. వచ్చే ఏడాది పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం పెట్టనున్నారు. భారీ ఎత్తున నిధులు తీసుకురావడం ద్వారా పంచాయతీల్లో పనులు చేయడానికి అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ జనసేన ఎంపీల కు బిగ్ టాస్క్ ఇచ్చారంటున్నారు పరిశీలకులు.

అదే సమయంలో అమరావతి రాజధాని, పోలవరం వంటి ముఖ్యమైన అంశాల్లో కూడా కూటమి ఎంపీల తో కలిసి కేంద్రంతో చర్చించాలని ఆయన సూచించారు. మొత్తం వ్యూహం బలంగా ఉందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on November 29, 2025 6:35 pm

Share
Show comments
Published by
Satya
Tags: Pawan

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

43 minutes ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

1 hour ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

2 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

5 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

7 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

7 hours ago