Political News

పాట్లు ప‌డుతున్న కోట్ల పాలిటిక్స్ ..!

ఆయ‌న గతంలో కేంద్ర మంత్రి కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే. మరి అప్పట్లో చక్రం తిప్పిన ఆయ‌న ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏమేరకు దూసుకుపోతున్నారు? ఏమేరకు నియోజకవర్గంపై దృష్టి పెడుతున్నారు? అనేది కీలకం. రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికల్లో 88 మంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరిలో జనసేన పార్టీ అధినేత పవన్ కూడా ఒకరు. ఇక గతంలో కేంద్రంలో చక్రం తిప్పి కేంద్ర మంత్రిగా పని చేసిన వారు కూడా ఉన్నారు. వీరిలో కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఒకరు.

గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సూర్యప్రకాశ్ రెడ్డి తర్వాత కాలంలో టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గం నుంచి విజయాన్ని సాధించారు. ఇక కేంద్రంలో చక్రం తిప్పి రాష్ట్రానికి జిల్లాకు మేలు చేశానని పదే పదే చెప్పే జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఇప్పుడు ఏమి చేస్తున్నారు? అనేది చూస్తే కొంత నిరాశే కలుగుతుంది. ఎందుకంటే ఆయ‌నకు ఉన్న సీనియార్టీ రాజకీయ అనుభవం వంటివాటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిపదవిని ఆశించారు.

కానీ యువతకు పెద్దపీట వేస్తానని చెప్పిన చంద్రబాబు ఇదే ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి టీజీ భారత్ కు అవకాశం ఇచ్చారు. ఇక మైనారిటీ కోటాలో ఫరూక్ కు అవకాశం కల్పించారు. ఇది కోట్లను నిరాశకు గురిచేసింది. దీంతో ఎన్నికైన తర్వాత కొంతకాలం బయటకు రాలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు చంద్రబాబు హెచ్చరికలు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల నేపథ్యంపై బయటకు వచ్చినా అనారోగ్యం వెంటాడుతోంది. ప్రస్తుతం 76 ఏళ్ల వయసులో ఉన్న కోట్ల పెద్దగా యాక్టివ్ గా లేరన్నది వాస్తవం.

దీంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే సందడి కనిపించడం లేదు. వచ్చినా ఇలా ముఖం చూపించి అలా వెళ్లిపోతున్నారు. ఇది ఎమ్మెల్యే హవాకు ఇబ్బందిగా మారింది. మరోవైపు టీడీపీలోనే వర్గ పోరు కూడా వెంటాడుతోంది. వచ్చే ఎన్నికల నాటికి బలపడేందుకు టీడీపీలోనే సీనియర్ నాయకుడు ఒకరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రాజకీయ వివాదాలకు దారితీసింది. మొత్తంగా ఇటు రాజకీయాల వ్యవహారం మరోవైపు వయసుతో కూడిన సమస్యల కారణంగా నియోజకవర్గంలో కోట్ల పాలిటిక్స్ కు పాట్లు తప్పడం లేదు.

Satya

Recent Posts

యంగ్ హీరోకు త‌మిళ డిస్ట్రిబ్యూట‌ర్ ఇచ్చిన షాక్

దేశంలో తెలుగు ప్రేక్ష‌కులంత పెద్ద మ‌న‌సు ఇంకెవ‌రికీ ఉండ‌దంటూ ఇత‌ర భాష‌ల ఫిలిం మేక‌ర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా త‌మిళ…

44 minutes ago

వైసీపీకీ ఓ ‘సూపర్ యాప్’ వచ్చేసింది!

ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…

3 hours ago

కాంగ్రెస్ చెయ్యలేనిది మోదీ చేసి చూపించారు

విష‌యం చిన్న‌దే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా చేయ‌లేనిది.. ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…

4 hours ago

ముద్రగడకు గవర్నర్ పదవిని సిఫార్సు చేసిన పవన్

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…

4 hours ago

చెన్నై ల‌వ్ స్టోరీ ఎందుకు చేతులు మారింది?

బేబీ సినిమాతో పెద్ద సంచ‌ల‌న‌మే రేపాడు ద‌ర్శ‌క నిర్మాత సాయిరాజేష్‌. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణ‌వి చైత‌న్య‌, ఆనంద్…

6 hours ago

డ్ర‌గ్స్ కోసం ఎగ‌బ‌డ్డ ఎమ్మెల్సీ కొడుకు… ప‌ట్టేసుకున్న పోలీసులు

హైద‌రాబాద్‌ను డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి వెంటాడుతోంది. ఇటు ప్ర‌భుత్వం, అటు పోలీసులు అనుక్ష‌ణం డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి ఎంతగా ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏదో ఒక…

7 hours ago