పరదాల మాటున పవన్ కళ్యాణ్ టూర్లు అంటూ… వైసిపి చేస్తున్న ఆరోపణలను జనసేన పార్టీ తిప్పి కొట్టింది. పీ అంటే పరదాలు, కే అంటే కంచెలు అని వైసీపీ విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో పరదాలు, కంచెలతో ప్రజలెవరూ దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పకుండా ఆంక్షలు.. ఒకవేళ చెప్పడానికి వస్తే… మైక్ కట్..! చేస్తున్నారనేది వైసీపీ ఆరోపణ. ప్రజా సమస్యలు వినడానికి కూడా ఇంత భయం ఎందుకు? అంటూ ఆ పార్టీ ప్రశ్నించింది. పవన్ పర్యటనలో పరదాలు కట్టిన ఫోటోలను విడుదల చేసింది.
దీనికి జనసేన ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. తమరు పెట్టిన మొదటి ఫోటోకి సంబంధించిన వీడియో ఇది.. అంటూ పోస్ట్ చేసింది. ఆ పరదా వెనుక ఉన్న గృహంలోని గృహిణి బయటకొచ్చి ప్రభుత్వం తమకి కల్పించిన మ్యాజిక్ డ్రెయిన్ సౌకర్యం గురించి ఉపముఖ్యమంత్రికి నవ్వుతూ సంతోషంగా కృతజ్ఞతలు తెలిపిందని వివరించింది. మీ తరహా పరదాల వాడకం కాదు ఇది.. అంటూ సెటైర్లు వేసింది.
ఇక రెండో ఫోటోలోని కంచె పార్టీ కేంద్ర కార్యాలయం బయట ఉన్న గేటును ఆనుకుని ఉన్నది. అంటే తమ మాదిరి క్యాంపు కార్యాలయానికి పెద్ద పెద్ద బోనులు కడితే అక్షేపణీయం కానీ గేటుకి ఆనుకుని కంచె ఉంటే తప్పేముంది! అని ప్రశ్నించింది. అసలంటూ జగన్ పాలన వెలగబెట్టిన ఐదేళ్లలో ప్రజలను కలవడం, వారి సమస్యలు వినడం లాంటివి చేస్తే ఇవి అర్థమయ్యేవి అని జనసేన పేర్కొంది. దీనిలో మిమ్మల్ని నిందించడం కూడా సమంజసం కాదులే.. పాపం మీరేం చేస్తారు!! అంటూ ట్విట్టర్ లో సమాధానం ఇచ్చింది.
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…